నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని 4 పరీక్షా కేంద్రాలలో విద్యార్థులు ఉదయం 9 గంటలకే పరీక్షకు హాజరయ్యారు. అధికారులు కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ పటిష్టమైన పోలీసు బందోబస్తు నిర్వహించారు.
SRPT: యాసంగి సీజన్కు వారబందీ విధానంలో ఇస్తున్న గోదావరి జలాలను బుధవారం సాయంత్రం పెంచారు. 1,750 క్యూసెక్కులు వదులుతుండగా 1,810 క్యూసెక్కులకు పెంచారు. రెతులు నీటిని వృథా చేయవద్దని జలవనరులశాఖ ఈఈ సత్యనారాయణగౌడ్, బయన్న వాగు ఏఈ చంద్రశేఖర్ తెలిపారు. చివరి భూములకు నీళ్లు చేరేందుకు ఈసారి అవకాశం ఉన్న మేర ఎక్కువ నీటిని వదులుతున్నట్లు పేర్కొన్నారు.
CTR: జీడీనెల్లూరు ఎంపీడీవో కార్యాలయంలో మండల పంచాయతీ కార్యదర్శుల సంఘ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఎన్నికల అధికారిగా ఎంపీడీవో మనోహర్ గౌడ్ వ్యవహరించారు. అధ్యక్షుడిగా గంగాధరనెల్లూరుకు చెందిన వి.శివయ్య, మండల ప్రధాన కార్యదర్శిగా ముక్కళత్తూరుకు చెందిన పి. కిరణకుమార్ ఎంపికయ్యారు.
JGL: మెట్పల్లి ఆర్డీవోగా పనిచేస్తున్న నక్క శ్రీనివాస్ను ఖమ్మం జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ఖమ్మం జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఆర్డీవో నరసింహారావును మెట్పల్లికి నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి లోకేష్ కుమార్ బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
NDL: అసెంబ్లీ ఆవరణలోని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్తో ఇవాళ నంద్యాల జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు ఎంపీలు తమ నియోజకవర్గాలలో ఉన్న సమస్యలను నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మంత్రి నారా లోకేష్ బాబు వాటిని పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు.
PDPL: ధర్మారంలో గురువారం ఉదయం 9 గంటలకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం తెలుగు పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 333 మంది, సాధన జూనియర్ కళాశాలలో 145 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. ఈ మేరకు పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 100 మీటర్ల దూరంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
VZM: గరుగుబిల్లి మండలం గిజబ గ్రామ సమీపంలో ప్రధాన రహదారి వద్ద ఇవాళ గుర్తుతెలియని వాహనం బైకును ఢీకొట్టడంతో ఆర్మీ ఉద్యోగి దవలసింగి చంద్రమౌళి (29) అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు అతన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు జియ్యమ్మవలస మండలం శిఖబడి గ్రామానికి చెందిన వ్యక్తిగా అని సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ASR: అరకు రైల్వే ఆస్పత్రిలో నేడు ఉచిత క్యాన్సర్ స్క్రీ నింగ్ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు మెడికవర్ ఆస్పత్రి పీఆఓ్వ పీ.ఆనంద్ తెలిపారు. విశాఖ ఈస్ట్ కోస్ట్ రైల్వే హెల్త్ యూనిట్, ఆరిలోవ మెడికవర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ వారు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారన్నారు. శిబిరంలో బీపీ, మహిళల కోసం ప్రత్యేకంగా పాప్ స్మియర్ పరీక్షలు ఉచితంగా చేస్తారని తెలిపారు.
PPM: కొమరాడ మండలం వన్నాం గ్రామ పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది గురువారం తెలిపారు. రైతులు, గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏనుగులు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడరాదన్నారు. చేతికందొచ్చిన పంటను ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. వీటిని ఈ ప్రాంతం నుంచి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.
కడప నగరపాలక సంస్థ ఇంఛార్జ్ కమిషనర్గా, ప్రస్తుత అడిషనల్ కమిషనర్గా ఉన్న రాకేశ్ చంద్రను నియమిస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంపత్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుత కమిషనర్ మనోజ్ రెడ్డిని ప్రభుత్వం సరెండర్ చేయడంతో ఆయన స్థానంలో రాకేశ్ చంద్రకు బాధ్యతలు అప్పగించారు.
రామ్ చరణ్తో ‘పెద్ది’ మూవీ చేస్తున్న దర్శకుడు బుచ్చిబాబు, తన తదుపరి మూవీని రెబల్ స్టార్ ప్రభాస్తో చేయనున్నట్లు సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం బుచ్చిబాబు ఇప్పటికే ఒక సాలిడ్ పాన్ ఇండియా స్క్రిప్ట్ను సిద్ధం చేశాడట. భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ సినిమాకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కాంబో సెట్ అయితే బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ ఖాయం.
HNK: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఐఏఎస్ బదిలీలలో భాగంగా గురువారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ను హనుమకొండ జిల్లా కలెక్టర్గా నియమించింది. ఇప్పటికే ఆమె గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నప్పటికీ, హనుమకొండ జిల్లా కలెక్టర్ బాధ్యతలు కూడా అదనపు బాధ్యతలుగా చేపట్టనున్నారు.
KRNL: దేవాలయ భూములు ప్రభుత్వ ఆస్తులు కావని, వాటిని అన్యాక్రాంతం చేసే హక్కు ఎవరికీ లేదని ఆదోని MLA పార్థసారధి అసెంబ్లీలో పేర్కొన్నారు. ఆలయ భూములను లీజులు, స్టేడియాలకు కేటాయించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆలయ భూములను ప్రభుత్వం కాపాడాలని, ధార్మిక సంస్థల అభిప్రాయాలతో సంరక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రముఖ నటి రన్యా రావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రూ.102 కోట్ల విలువైన భారీ బంగారం స్మగ్లింగ్ కేసులో ఆమెపై ఈడీ సంచలన ఆరోపణలు చేస్తూ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఏడాది కాలంలో సుమారు 127 కిలోల బంగారాన్ని అక్రమంగా భారత్కు తరలించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది.
W.G: సిబ్బంది నిర్లక్ష్యం ఒక వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. తణుకు మండలం తేతలి వద్ద బుధవారం రాత్రి బైకుపై వెళ్తున్న వడ్లూరుకు చెందిన రాంబాబు మెడకు ఇంటర్నెట్ కేబుల్ వైర్లు చుట్టుకున్నాయి. మరమ్మతులు చేస్తున్న సమయంలో సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యలు ఆరోపించారు. మెడ భాగంలో గాయాలైన రాంబాబును ప్రభుత్వాసుపత్రికి తరలించారు.