• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘భోగి’ ఫస్ట్ లుక్‌కి డేట్, టైం ఫిక్స్

దర్శకుడు సంపత్ నందితో హీరో శర్వానంద్ ‘భోగి’ సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌కు డేట్, టైం ఖరారైంది. ఫిబ్రవరి 25న ఉదయం 10:14 గంటలకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. కాగా, ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

February 24, 2026 / 12:16 PM IST

CMRF చెక్కులను పంపిణీ చేసిన టీడీపీ నేతలు

BPT: వైద్య ఖర్చులకు పేదలు అప్పుల పాలు కాకూడదన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని టీడీపీ నేతలు అన్నారు. మంగళవారం రేపల్లె క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం 29 మంది లబ్ధిదారులకు రూ.19.09 లక్షల విలువైన చెక్కులు, ఎల్వోసీలను అందజేశారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని వారు స్పష్టం చేశారు.

February 24, 2026 / 12:13 PM IST

పరీక్షా కేంద్రాలను పరిశీలించిన పోలీసులు

SKLM: ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను పోలీసు అధికారులు మంగళవారం సందర్శించారు. మందస గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాలిగాంలో ఆదిత్య కళాశాల పరీక్షా కేంద్రాలను కాశీబుగ్గ రూరల్ సీఐ ఎం.తిరుపతిరావు, మందస ఎస్సై కె.కృష్ణ ప్రసాద్‌లు పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.

February 24, 2026 / 12:13 PM IST

‘కూటమి ప్రభుత్వంతో గ్రామాల్లో అభివృద్ధి’

KRNL: పెద్దకడబూరులో గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి కీలక అడుగు పడింది. రూ.1.90 కోట్ల వ్యయంతో 3.O కింద, NREGS పథకం మెటీరియల్ వర్క్స్ ద్వారా సీసీ రోడ్ల నిర్మాణానికి మంజూరు లభించాయి. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి రమాకంతరెడ్డి భూమిపూజ చేశారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు.

February 24, 2026 / 12:12 PM IST

అరటి రైతులకు శుభవార్త..!

అన్నమయ్య: కూటమి ప్రభుత్వం హార్టికల్చర్‌కు ప్రోత్సాహంగా అరటి తోటలకు పండ్ల కవర్లపై 50% సబ్సిడీ ప్రకటించింది. రాజంపేటలో సుమారు 5,000 ఎకరాల్లో అరటి సాగు జరుగుతోంది. రైతులు కవర్లు కొనుగోలు చేసి బిల్లులు ఉద్యాన శాఖకు సమర్పిస్తే ఎకరాకు రూ.10 వేలు రాయితీ అందుతుంది. గరిష్టంగా రెండున్నర ఎకరాల వరకు, అంటే రూ.25 వేల వరకు సబ్సిడీ లభిస్తుందని అధికారులు తెలిపారు.

February 24, 2026 / 12:10 PM IST

శ్రీ రాఘవేంద్ర స్వామికి YCP నేతలు ప్రత్యేక పూజలు

KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి, వైసీపీ నేత లక్ష్మీనారాయణ రెడ్డి మంగళవారం స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా గ్రామదేవత మంచాలమ్మ, స్వామివారి మూలబృందావనంకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. వీరిని పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థులు ఆశీర్వదించారు.

February 24, 2026 / 12:10 PM IST

‘దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించాలి’

KMM: వైరా ప్రాంతంలో అకాల వర్షం వల్ల దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని సీపీఎం డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం డిమాండ్ చేశారు. వ్యవసాయ అధికారులతో క్షేత్రస్థాయిలో సర్వే చేయించి, ఎకరాకు తగిన పరిహారం ప్రకటించాలి. పంట బీమా వర్తింపజేయడంతో పాటు, పాత రుణాలపై వడ్డీ మాఫీ చేసి, కొత్తగా వడ్డీ లేని రుణాలు అందించాలని కోరారు.

February 24, 2026 / 12:10 PM IST

నగరపాలక సంస్థ కమిషనర్ మోర్నింగ్ విజిట్

కడప నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ ఎన్.మనోజ్ రెడ్డి మంగళవారం ఉదయం నగరంలోని పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. 17వ డివిజన్‌లో టీజీపీ పార్కును సందర్శించి పెండింగ్ పనులను తక్షణమే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం 15వ డివిజన్‌లో ఏర్పాటు చేయనున్న సాగర్ కాలనీ పార్కులో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

February 24, 2026 / 12:08 PM IST

మనోభావాలను దెబ్బతీశారు: జ్యోతుల నెహ్రు

AP: హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా గత పాలకులు వ్యవహరించారని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. తిరుమల లడ్డూతోనే కాదు.. వైసీపీ పాలన విధ్వసంతోనే ప్రారంభమైందన్నారు. వందకు పైగా హిందువుల ఆలయాల్లో అపచారాలు చేశారని మండిపడ్డారు. నిజమైన బాధ్యులందరినీ శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. భక్తులకు, ప్రజలకు నమ్మకం కలిగించే బాధ్యత తమపై ఉందన్నారు. 

February 24, 2026 / 12:07 PM IST

మనోభావాలను దెబ్బతీశారు: జ్యోతుల నెహ్రూ

AP: హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా గత పాలకులు వ్యవహరించారని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. తిరుమల లడ్డూతోనే కాదు.. వైసీపీ పాలన విధ్వసంతోనే ప్రారంభమైందన్నారు. వందకు పైగా హిందువుల ఆలయాల్లో అపచారాలు చేశారని మండిపడ్డారు. నిజమైన బాధ్యులందరినీ శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. భక్తులకు, ప్రజలకు నమ్మకం కలిగించే బాధ్యత తమపై ఉందన్నారు. 

February 24, 2026 / 12:07 PM IST

‘పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలి’

WNP: జిల్లాలో ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలను ఎటువంటి లోటు లేకుండా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం వనపర్తి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్షలు జరుగుతున్న సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

February 24, 2026 / 12:07 PM IST

అదరగొట్టిన ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ సాంగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో రాబోతున్న మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ చిత్రంలోని ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ సాంగ్ రిలీజైన 24 గంటల్లోనే 11.44 మిలియన్ వ్యూస్ సాధించి, ‘పుష్ప-2’లోని  ‘సూసేకి’ పాట రికార్డును (10.97M) అధిగమించింది. శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం 2026 మార్చి 26న గ్రాండ్‌గా విడుదల కానుంది.

February 24, 2026 / 12:07 PM IST

‘కంటి సమస్యలపై నిర్లక్ష్యం వహించకూడదు’

KMR: కంటి సమస్యలపై నిర్లక్ష్యం వహించకూడదని ఆప్తాల్మిక్ ఆఫీసర్ హరికిషన్ తెలిపారు. నేడు సదాశివనగర్ TS మోడల్ స్కూల్‌లో కంటి పరీక్షలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలోని విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అద్దాలు వాడాలని తెలిపారు. కంటి సమస్యలు రాకుండా ఉండేందుకు మొబైల్, స్క్రీన్ వినియోగం తగ్గించాలని, విటమిన్లు ఉన్న పోషక పదార్థలను తీసుకోవాలన్నారు.

February 24, 2026 / 12:06 PM IST

T20 ప్రపంచకప్: భారత్ సెమీస్ చేరాలంటే..?

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచులో 76 పరుగుల తేడాతో ఓడిపోవడం భారత్ నెట్ రన్ రేట్ పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ నేపథ్యంలో భారత్ తర్వాతి రెండు మ్యాచుల్లోనూ కచ్చితంగా గెలవాలి. మరోవైపు దక్షిణాఫ్రికా కూడా విజయం సాధించాలి. అప్పుడు రన్ రేటుతో సంబంధం లేకుండా భారత్ సెమీస్ చేరుతుంది. ఒకవేళ దక్షిణాఫ్రికా జట్టు వెస్టిండీస్ చేతిలో ఓడిపోతే.. నెట్ రన్ రేట్ కీలకంగా మారుతుంది.

February 24, 2026 / 12:04 PM IST

మీడియా ప్రజల గొంతుకగా నిలవాలి: డా.వ్యాసభట్

MDCL: మీడియా ప్రజల గొంతుకగా నిలవాలని తెలంగాణ హ్యూమన్ రైట్స్ జస్టిస్ ఫోరం ఛైర్ పర్సన్ డా.వ్యాసభట్ శ్రీవాణి చౌదరి అన్నారు. ఉప్పల్ ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా క్లబ్ నూతన కమిటీ సభ్యులను సన్మానించి అభినందించారు. ప్రజా సమస్యలను నిష్పక్షపాతంగా వెలుగులోకి తీసుకురావాలని సూచించారు. ఉప్పల్ అభివృద్ధికి మీడియా నిర్మాణాత్మక సహకారం అవసరమని పేర్కొన్నారు.

February 24, 2026 / 12:03 PM IST