TG: పెద్దపల్లి జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మంథని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రూ.16,500 లంచం తీసుకుంటూ డాక్యుమెంట్ రైటర్ రషీద్ పట్టుబడ్డారు. రైతు భూమి రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ రాజేందర్ రూ.35వేలు డిమాండ్ చేశారు. వీరిని రెడ్ హ్యాండెడ్గా అధికారులు పట్టుకున్నారు.
MDCL: మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ శుక్రవారం అల్వాల్ పట్టణ పరిధిలోని బొల్లారం రైల్వే స్టేషన్ను సందర్శించారు. నిజామాబాద్–రాయలసీమ ఎక్స్ప్రెస్కు బొల్లారం స్టేషన్లో నిలుపుదల కల్పించామని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు విశాఖ ఎక్స్ప్రెస్, నాగావళి ఎక్స్ప్రెస్, నాగర్సోల్ ఎక్స్ప్రెస్ రైళ్లకు కూడా హాల్ట్ ఇవ్వాలని కోరారు.
VKB: పెండింగ్ కేసులపై దృష్టి సారించాలని ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. శుక్రవారం జిల్లా కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేసుల దర్యాప్తులో జాప్యం లేకుండా వేగవంతంగా విచారణ పూర్తి చేయాలని తెలిపారు. బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
MDK: దేశ ప్రజలకు సేవలాల్ మహారాజ్ ఆదర్శప్రాయుడని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, అదునపు కలెక్టర్ నగేష్ పేర్కొన్నారు. నర్సాపూర్ పట్టణంలో సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించారు. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడి వారి ఔన్నత్యానికి పునాదులు వేశారని సేవాలాల్ మహారాజును కొనియాడారు. ఆయన ఆధ్యాత్మిక మార్గంలో ప్రతీ ఒక్కరు నడవాలన్నారు.
MBNR: భూత్పూర్ మున్సిపాలిటీ కొత్త ఛైర్మన్గా బాలకోటి మున్సిపల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని, వార్డుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని.. సీసీ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పనకు కౌన్సిలర్ల సహకారంతో కృషి చేస్తానని చెప్పారు.
BDK: మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోషల్ మీడియా యువజన కాంగ్రెస్ నాయకుల ఆత్మీయ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పనులను సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో సోషల్ మీడియా పాత్ర కీలకమని పేర్కొన్నారు. యువజన శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
HYD: సైబరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతున్న 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్&గేమ్స్ మీట్-2026 3వ రోజూ అత్యంత ఉత్సాహభరితంగా కొనసాగింది. వివిధ జిల్లాలు, జోన్లు, కమిషనరేట్లు,స్పెషల్ ఫోర్సెస్ నుంచి తరలివచ్చిన వందలాది మంది పోలీస్ అథ్లెట్లు తమ క్రీడా నైపుణ్యంతో మైదానాన్ని హోరెత్తించారు. వాలీబాల్, కబడ్డీ వంటి ప్రధాన విభాగాలలో గెలుపే లక్ష్యంగా పోటీపడ్డారు.
CTR: CMRF పేదల వైద్య సేవలకు ఆర్థిక భరోసా ఇస్తోందని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. శుక్రవారం నియోజకవర్గానికి సంబంధించి 24 మంది లబ్ధిదారులకు రూ.35,35,182 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా CM చంద్రబాబు CMRF ద్వారా పేదలను ఆదుకుంటున్నారని చెప్పారు. వైద్య సేవల కోసం అప్పులు చేయకుండా ఆర్థిక సాయం అందిస్తునారని తెలిపారు.
కామారెడ్డిలోని ‘భరోసా’ సెంటర్ నిర్వహణ బాధ్యతలను మహిళా ఎస్సై శ్రావంతికి అప్పగిస్తూ జిల్లా పోలీస్ కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న మహిళా ఎస్సై జి. జ్యోతి అనారోగ్య కారణాల వల్ల సెలవులో ఉన్న నేపథ్యంలో, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఈ నిర్ణయం తీసుకున్నారు. బాధితులకు అందుతున్న సేవలకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు.
NLG: చిట్యాల మున్సిపాలిటీ 10వ వార్డు కౌన్సిలర్ నిమ్మనగోటి శ్రీనివాస్ తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఆదర్శంగా నిలిచారు. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల వేళ తన వార్డులోని ప్రతి పేద ఇంటి ఆడబిడ్డ వివాహానికి రూ. 10,016లు ఆర్థిక సాయం అందిస్తానని వాగ్దానం చేశారు. అంబేద్కర్ నగర్కు చెందిన సుంకరి రాజేశ్వరి వివాహనికి ఇవాళ హాజరై, ఆ నగదును అందించారు.
PPM: సహకార సొసైటీల సిబ్బంది న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్వీఎస్ కుమార్ అన్నారు. శుక్రవారం DCCB కార్యాలయం వద్ద PACS ఉద్యోగులతో నిరసన తెలిపారు. రైతుల అభివృద్ధి కోసం 30, 40 సంవత్సరాలుగా PACSలలో ఉద్యోగులుగా పని చేస్తున్న వారందరికీ న్యాయం చేయాలన్నారు. ఉద్యోగులందరికీ తక్షణమే జీవో నంబర్ 36 అమలు చేయాలని డిమాండ్ చేశారు.
SRCL: రైతులు పకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని మండల వ్యవసాయ శాఖ అధికారి దుర్గరాజు అన్నారు. చందుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ మిషన్ ఆన్ నాచురల్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయం పైన అవగాహన, దిశ నిర్దేశం కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. దుర్గరాజు మాట్లాడుతూ.. రైతులు పంటల సాగులో రసాయనాలను తగ్గించాలన్నారు.
GNTR: తెనాలి మార్కెట్ యార్డ్ ప్రాంగణంలోని అన్న క్యాంటీన్ను మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు శుక్రవారం సందర్శించారు. అక్కడ ప్రజలకు అందిస్తున్న ఆహార నాణ్యతను స్వయంగా పరిశీలించి, భోజనం చేస్తున్న వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎప్పుడూ నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలని, క్యాంటీన్ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు.
BHNG: శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు శుక్రవారం రూ.20,47,905 ఆదాయం సమకూరినట్లు ఆలయ EO భవాని శంకర్ వెల్లడించారు. అందులో భాగంగా ప్రసాద విక్రయాలతో రూ.6,55,700, లీజులతో రూ.5,35,400, కార్ పార్కింగ్తో రూ.2,27,000, VIP దర్శనాలతో రూ.1,50,000, బ్రేక్ దర్శనాలతో రూ.1,02,900, వ్రతాలతో రూ.1,01,000, కళ్యాణకట్ట రూ.49,000, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చింది.
ప్రకాశం: మర్రిపూడి మండలంలో రైతులు ప్రధానంగా పొగాకు, కంది సాగుచేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం నీటి వనరులు ఉన్న రైతులు బొప్పాయి పంట వైపు మొగ్గు చూపిస్తున్నారు. మండలంలో దాదాపు 500 ఎకరాలకుపైన బొప్పాయి పంట సాగులో ఉందని అధికార యంత్రాంగం తెలిపింది. నీటి వనరులు ఉంటే బొప్పాయి పంట లాభదాయకంగా ఉంటుందని రైతులు తెలిపారు.