W.G: భీమవరం కలెక్టరేట్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ మండల కార్యాలయాల్లో సోమవారం PGRSను యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ నాగరాణి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. నేరుగా రాలేని వారు 1100 కాల్ సెంటర్, వెబ్సైట్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చన్నారు.
రాజస్థాన్లోని జోధ్పుర్ జిల్లాలో విషాదం నెలకొంది. వివాహం జరగాల్సిన రోజే అక్కాచెల్లెళ్లు శోభ(25), విమల(23) విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబీకులు వారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. బాబాయ్ల ఒత్తిడితో జరిగిన బలవంతపు పెళ్లి ఇష్టం లేకనే వారు మరణించినట్లు మేనమామ ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
NDL: డోన్ బట్టీల సెంటర్లో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ గంగమ్మ దేవస్థానం అమ్మ వారి విగ్రహ, ధ్వజ ప్రతిష్ట మహోత్సవంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడు బుగ్గన అర్జున్ అమర్నాథ్ రెడ్డి ప్రత్యేక పూజలు ఇవాళ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మీట్ కార్పొరేషన్ ఛైర్మన్,మున్సిపల్ ఛైర్మన్, ఎంపీపీ,జడ్పిటీసీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అభిమానులు పాల్గొన్నారు.
VZM: బొండపల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం సర్పంచ్లను ఘనంగా సన్మానించారు. సర్పంచుల పదవీకాలం మార్చి నెలలో పూర్తికానున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సర్పంచ్లకు బొండపల్లి ఎంపీపీ చల్ల చల్లంనాయుడు, పలువురు అధికారులు సర్పంచులకు సాలువల కప్పి పుష్పగుచ్చాలు అందజేసి సత్కరించారు.
సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్తో పాటు మండల, డివిజన్, మున్సిపాలిటీ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలపై వినతులు అందజేస్తే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
AP: గ్రామీణ డాక్ సేవక్లకు ఈ స్కూటర్లు ఇచ్చేలా చూస్తామని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య హామీ ఇచ్చారు. తపాలాశాఖ.. ABCD ఫార్ములాతో ముందుకెళ్లాలని సూచించారు. బ్యాంకింగ్, లాడ్లీ లక్ష్మీ, సుకన్య సమృద్ది ద్వారా తపాలాశాఖ బలోపేతం అయిందన్నారు. ఏక్యూరసీ, బిహేవియర్, కమిట్మెంట్ టు డెలివరీ.. ఇవే వారి నినాదం అని అన్నారు. ఇవాళ్టి కార్యక్రమం తపాలాశాఖకు ఉగాది కానుందన్నారు.
NZB: నిజామాబాద్ గాయత్రినగర్లో ఆదివారం శ్రీ గాయత్రి చైతన్య కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేటర్ సుమిత్రను ఘనంగా సన్మానించారు. కమిటీ అధ్యక్షుడు ఆడెపు నరేంద్ర స్వామి మాట్లాడుతూ.. కార్పొరేటర్ సుమిత్ర కిషోర్ గతంలో చేసిన అభివృద్ధి పనులు, ఆయన మంచితనం వల్లే నేడు మళ్లీ విజయం చేకూర్చాయని అన్నారు.
TG: గోదావరి జలాల వివాదం కొన్నాళ్లుగా రాజకీయరంగు పులుముకుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గడిచిన పదేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఇప్పుడు వివాదమే ఉండేది కాదని అన్నారు. 960 TMCలకు సరిపడా ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే సమస్య ఉండేది కాదన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసుకుని రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసుకోవాలన్నారు.
MBNR: మిడ్జిల్ మండలం మల్లాపూర్కు చెందిన నందినికి రూ.32 వేల సీఎం సహాయ నిధి (CMRF) చెక్ను మాజీ సర్పంచ్ అయ్యన్న గౌడ్ అందజేశారు. సీఎంఆర్ఎఫ్ ఆపద సమయంలో పేదలకు భరోసాగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సుకుమార్ రెడ్డి, చందర్, సైదులు, తదితరులు పాల్గొన్నారు.
ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్టులో నైపుణ్యాభివృద్ధి కోర్సుల్లో శిక్షణ పొందుతున్న యువతతో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆదివారం ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం డిగ్రీలతోనే ఉద్యోగాలు రావని, నైపుణ్యం ఉన్నవారికే అవకాశాలు ఉంటాయని తెలిపారు. యువత తమకు నచ్చిన రంగాల్లో శిక్షణ తీసుకుని వికసిత భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు.
CTR: నగరపరిధిలో 40వ వార్డులో రూ.9.55 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును జిల్లా ఇంఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చుడా ఛైర్పర్సన్ కఠారి హేమలత, జిల్లా టీడీపీ అధ్యక్షుడు షణ్ముగం రెడ్డి, ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరి, స్థానిక టీడీపీ, కూటమి నాయకులు పాల్గొన్నారు.
RR: తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంజాపూర్లో బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం MLA మల్ రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంజారాలతో కలిసి నృత్యం చేసి సందడి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బంజారా సంస్కృతిని రక్షించి, మూఢనమ్మకాల నిర్మూలనకు కృషి చేశారన్నారు.
ELR: ఈ నెల 22 నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు జంగారెడ్డిగూడెంలో 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పరీక్షల కస్టోడియన్ శ్రీనివాసరావు చలమాల తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఫస్ట్ ఇయర్ 2,357 మంది, సెకండ్ ఇయర్ 2,191 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని అన్నారు.
కడప: నగరంలో గంజాయి, నిషేధిత మత్తు పదార్థాల సేవనం, బహిరంగ మద్యపానం, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. స్పెషల్ పార్టీ సిబ్బందితో పాటు డ్రోన్ కెమెరాల ద్వారా నింగి నుండి నిఘా ఉంచుతూ.. అనుమానిత ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని DSP వెంకటేశ్వర్లు హెచ్చరించారు.