• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జీవీఎంసీ హైస్కూల్ విద్యార్థులకు అవార్డులు.

VSP: యూత్ ఫర్ సేవ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన “చిగురు” కార్యక్రమంలో మల్కాపురం జీవీఎంసీ హై స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. అన్ని విభాగాలలో పాల్గొన్న విద్యార్థులు విజేతలుగా నిలిచి అవార్డులు సాధించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ సభ్యులు అభినందించారు.

February 23, 2026 / 08:23 AM IST

నేటి నుంచి ఎల్లమ్మ తిరుణాల

అన్నమయ్య: సుండుపల్లి మండలం చెన్నంశెట్టి పల్లె సమీపంలోని ఎల్లమ్మ తిరుణాల సోమవారం నుంచి బుధవారం వరకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సోమవారం అంకురార్పణ,ప్రత్యేక పూజలు,అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తామని చెప్పారు. మంగళవారం అభిషేకాలు, పుట్ట బంగారు తెచ్చుట పొంగుబాలు, రాత్రి చెక్కభజన కార్యక్రమాలు ఉంటాయన్నారు. బుధవారం చాందిని బండ్ల తిరుణాల ఉంటుందని తెలిపారు.

February 23, 2026 / 08:23 AM IST

బాల్క సుమన్‌ కస్టడీ పిటిషన్‌ విచారణ

MNCL: క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న అల్లర్ల కేసులో మాజీ MLA బాల్క సుమన్‌కు బెయిల్, పోలీసుల కస్టడీ పిటిషన్లపై సోమవారం కోర్టులో వాదనలు జరగనున్నాయి. బెయిల్ మంజూరవుతుందా? లేక పోలీసుల కస్టడీకి అప్పగిస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. కోర్టు తీసుకునే నిర్ణయం క్యాతనపల్లి రాజకీయ పరిణామాలపై ప్రభావం చూపే అవకాశముంది.

February 23, 2026 / 08:22 AM IST

జిల్లాలో ఇంటర్ పరీక్షల ఏర్పాట్లు పూర్తి

మహబూబ్ నగర్ జిల్లాలో ఈ నెల 25 నుంచి మార్చి 13 వరకు జరగనున్న ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 35 కేంద్రాల్లో 21,884 మంది విద్యార్థులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష రాయనున్నారు. విద్యార్థులకు సౌకర్యాల కోసం కనీస వసతులు అందించినట్లు అధికారులు తెలిపారు.

February 23, 2026 / 08:22 AM IST

చిన్నారి మృతికి నిరసనగా కొవ్వొత్తులతో ర్యాలీ

NZB: నాగర్ కర్నూల్ జిల్లాలో చిన్నారి మృతికి నిరసనగా జక్రాన్ పల్లి మండలం కలిగోట్ గ్రామంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. డా. విశారదన్ మహారాజ్ ఆదేశాల మేరకు DSP కార్యకర్తలు ఈ ర్యాలిలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. చిన్నారి మృతికి కారణమైన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.

February 23, 2026 / 08:21 AM IST

నేటి నుంచి యథావిధిగా ప్రజావాణి

SRPT: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఇవాళ్టి నుంచి యథావిధిగా కొనసాగిస్తామని కలెక్టర్ తేజస్ నంద్లల్ పవార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజలు, దరఖాస్తుదారుల నుంచి వినతులు స్వీకరించి పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 23, 2026 / 08:21 AM IST

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు: DMHO

BDK: రోగులకు మెరుగైన సేవలు అందించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని DMHO హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం DMHO డాక్టర్ తుకారాం రాథోడ్ ఆదివారం పాల్వంచ పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ నిబంధనలు, చట్టపరమైన ప్రమాణాల అమలును ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

February 23, 2026 / 08:20 AM IST

12 వేల టోకెన్లు జారీ..

TPT: తిరుపతి శ్రీవారి దర్శనానికి సంబంధించి శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద ఆదివారం భక్తులకు 12 వేల సర్వ దర్శన టోకెన్లు జారీ చేశారు. వీరికి సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనం కానుంది. శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు మరో 2 వేల టోకెన్లు జారీ చేశారు.

February 23, 2026 / 08:20 AM IST

‘రైతుబడి అగ్రి షో’ ను సందర్శించిన మంత్రి తుమ్మల

KMM: హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నిన్న నిర్వహించిన ‘రైతుబడి అగ్రి షో’ ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ స్టాళ్లను పరిశీలించిన ఆయన, సాగు రంగంలో వస్తున్న అత్యాధునిక సాంకేతిక ఆవిష్కరణల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. రైతులు, శాస్త్రవేత్తలను ఒకే వేదికపైకి తెచ్చిన నిర్వాహకులను మంత్రి అభినందించారు.

February 23, 2026 / 08:17 AM IST

సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి

సత్యసాయి: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను పలువురు సందర్శకులు కలిసి తమ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ప్రజల అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆమె సానుకూలంగా స్పందించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. వినతుల్లోని అంశాలను పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తామని చెప్పారు.

February 23, 2026 / 08:16 AM IST

నేడు బాల్కసుమన్‌ కస్టడీ పిటిషన్‌ విచారణ

TG: మంచిర్యాల జిల్లా కోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ సహా ఇతర బీఆర్ఎస్ నాయకుల అరెస్టుకు సంబంధించి పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. పిటిషన్‌పై ఇప్పటికే బాల్కసుమన్ అడ్వకేట్ల బృందం కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే రిమాండ్‌లో ఉన్న నేపథ్యంలో కస్టడీకి ఇవ్వకుండా బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరినట్లు న్యాయవాదులు తెలిపారు.

February 23, 2026 / 08:16 AM IST

20 మద్యం సీసాలు స్వాధీనం

AKP: అక్రమంగా తరలిస్తున్న 20 మద్యం సీసాలను కసింకోట మండలం తాళ్లపాలెం వద్ద ఆదివారం స్వాధీనం చేసుకున్నట్లు సీఐ స్వామి నాయుడు తెలిపారు. గస్తీ నిర్వహిస్తున్న పోలీసులను చూసి కె.కాశీ విశ్వనాథం అనే వ్యక్తి పారిపోతుండగా ఎస్సై మనోజ్ కుమార్ పట్టుకున్నట్లు తెలిపారు. అతని వద్ద ఉన్న 20 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసామన్నారు.

February 23, 2026 / 08:11 AM IST

గుంతకల్లులో వరుసగా నాలుగు ఇళ్లలో చోరీ

ATP: గుంతకల్లులోని మోదినాబాద్ ఏరియాలో గల రైల్వే క్వార్టర్స్‌లో ఆదివారం అర్ధరాత్రి వరుసగా నాలుగు ఇళ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బీరువాలో ఉన్న నగదుతో పాటు నగలు ఎత్తుకెళ్లారు. బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పరిసర ప్రాంతాలతో పాటు సీసీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

February 23, 2026 / 08:10 AM IST

హైదరాబాద్‌లో ఎయిర్ క్వాలిటీ@225

HYD: నగరంలో ఎయిర్ క్వాలిటీలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సాధరణంగా పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంటుంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్ క్వాలిటీ సోమవారం AWHO కాలనీలో 225గా రికార్డ్ అయ్యింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు.

February 23, 2026 / 08:09 AM IST

నాణ్యమైన మొక్కలు సకాలంలో సిద్ధం చేయాలని

KMM: నగర సుందరీకరణకు అవసరమైన నాణ్యమైన మొక్కలను సకాలంలో సిద్ధం చేయాలని ఉద్యానవన అధికారి ఆదేశించారు. ఖమ్మం నగరం గొల్లగూడెం నర్సరీలో జరుగుతున్న మొక్కల పెంపకం, నిర్వహణ పనులను ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణ హరితీకరణ లక్ష్యంగా చేపడుతున్న పనులను సమీక్షించి, సిబ్బందికి సాగు పద్ధతులపై పలు సూచనలు చేశారు.

February 23, 2026 / 08:08 AM IST