• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నూతన ఛైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్‌లకు సన్మానం

NLG: చిట్యాల మున్సిపల్ చైర్మన్‌గా పందిరి గీత రమేష్, వైస్ చైర్మన్‌గా గుండెబోయిన శ్రీలక్ష్మి ఆదివారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ జిట్ట నగేష్, సీపీఎం జిల్లా నేత అవిశెట్టి శంకరయ్య వారిని శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు సుధాకర్ రెడ్డి, రాజయ్య, యాదయ్య, అర్జున్, స్వామి తదితరులు పాల్గొన్నారు.

February 22, 2026 / 06:35 PM IST

‘మెరుగైన ఫలితాల లక్ష్యంగా ప్రత్యేక తరగతులు’

ASF: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈనెల 25 నుంచి మార్చి 16 వరకు జరగనున్నాయి. జిల్లా గతంలో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించిన నేపథ్యంలో ఈసారి కూడా మెరుగైన ఫలితాల లక్ష్యంగా ప్రత్యేక తరగతులు నిర్వహించినట్లు DIEO రాందాస్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు పూర్తి సన్నద్ధతతో పరీక్షలకు హాజరవుతున్నారని పేర్కొన్నారు.

February 22, 2026 / 06:33 PM IST

రేపటి రైతు సభకు కవిత రాక

గద్వాల పట్టణంలోని అనంత ఫంక్షన్ హాల్లో సోమవారం ‘రైతు సంఘర్షణ సభ’ జరగనుంది. ఈ సభకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారు. నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రైతుల సమస్యలపై చర్చించనున్నారు. రైతులు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని జిల్లా ఛైర్మన్ రంజిత్ కుమార్ కోరారు.

February 22, 2026 / 06:33 PM IST

ఎల్లమ్మ ఆలయంలో సీసీ కెమెరాల ఏర్పాటు

SRCL: కోనరావుపేట (M) బావుసాయిపేట గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ భద్రత కోసం ఆదివారం ఉపసర్పంచ్ తిక్కల నవీన్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గౌడ కుల పెద్దల సమక్షంలో వీటిని ప్రారంభించి, ఆలయానికి అప్పగించారు. భక్తుల భద్రతను పర్యవేక్షించడంతో పాటు ఆలయ పరిసరాలను సురక్షితంగా ఉంచడమే దీని ముఖ్య ఉద్దేశమని నవీన్ తెలిపారు.

February 22, 2026 / 06:33 PM IST

ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా ఇమ్రాన్ అలీ

కామారెడ్డి జిల్లాలోని రాజంపేటలోని శ్రీ లక్ష్మీనరసింహ గార్డెన్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఉప సర్పంచ్‌ల ఫోరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫోరం అధ్యక్షుడిగా మీర్ ఇమ్రాన్ అలీ, ఉపాధ్యక్షుడిగా వెంక గౌడ్, జనరల్ సెక్రటరీగా కోశాధికారిగా వెంకట్ ఎన్నికయ్యారు. సలహాదారులుగా షామయ్య, బలరాంలను ఎంపిక చేశారు.

February 22, 2026 / 06:32 PM IST

వీధి కుక్కల దాడిలో పలు పశువులు మృతి

ADB: బోథ్ మండలంలోని కూచులాపూర్ గ్రామంలో వీధి కుక్కల బీభత్సంతో పలు పశువుల మృత్యు బారిన పడుతున్నాయి. ఆదివారం గ్రామంలోని లస్మన్నకు చెందిన ఆవు దూడపై వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి. అంతకు ముందు పలు మేకలు కుక్కల బారిన పడ్డాయి.

February 22, 2026 / 06:32 PM IST

ఆలయ నిర్మాణానికి భారీ విరాళం అందజేత

SRD: ప్రతి ఒక్కరికి దైవచింతన ఉండాలని బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ రెడ్డి అన్నారు. జిన్నారం మున్సిపల్ తాబేలు గుట్టలో నూతన శ్రీ జీవన జ్యోతిర్లింగ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో గుమ్మడిదల బీఆర్ఎస్ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాలయ అభివృద్ధికి రూ.1,51,000 విరాళం అందజేశారు. దైవానుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలన్నారు.

February 22, 2026 / 06:32 PM IST

‘మానవ అక్రమ రవాణాను అరికట్టాలని ప్రతిజ్ఞ’

WG: పాలకోడేరు(M) విస్సాకోడేరులోని ఓ చర్చిలో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమాన్ని ఆదివారం జరిగింది. ఆ సంస్థ సభ్యులు శ్రావ్య శృతి మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణాను ఆదిలోనే అడ్డుకుంటే మన ఆడపిల్లలను రక్షించుకోవచ్చాన్నారు. ప్రతి రోజు ఎంతో మంది అమ్మాయిలు, మహిళలు అక్రమ రవాణా ఉచ్చులో పడుతున్నారన్నారు.

February 22, 2026 / 06:31 PM IST

ధర్మారంలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు

PDPL: అనివార్య కారణాల వల్ల చదువు మధ్యలో మానేసిన వారికి ఆదివారం ధర్మారం కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఓపెన్ టెన్త్, ఇంటర్ బేస్ లైన్ పరీక్షలు నిర్వహించినట్లు కోఆర్డినేటర్ వడ్లూరి కిరణ్ తెలిపారు. చివరి పరీక్షలు ఏప్రిల్లో పెద్దపల్లిలో నిర్వహించబడతాయని ఆయన పేర్కొన్నారు. అందుకోసం విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

February 22, 2026 / 06:31 PM IST

శ్రీ వేంకటేశ్వరస్వామిని రాజకీయాల్లోకి లాగొద్దు: ఎంపీ

NDL: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంను రాజకీయాల్లోకి లాగడం తగదని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. ఉయ్యాలవాడ నరసింహరెడ్డి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన అనంతరం ఆమె ఇవాళ మీడియాతో మాట్లాడారు. శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల ప్రవర్తన అభ్యంతరకరమని, శ్రీవారిని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం పాపమని విమర్శించారు.

February 22, 2026 / 06:31 PM IST

రేపటి నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు

PPM: జిల్లాలో రేపటి నుంచి ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి విద్యార్థులకు సూచించారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుందన్నారు. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కోరారు. నిమిషం ఆలస్యం అయినా అనుమతించారన్నారు.

February 22, 2026 / 06:31 PM IST

బాధితులను పరామర్శించిన మార్కెట్ ఛైర్మన్

ATP: శింగనమల మండలం శోధన పల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో వాంతులు, విరోచనాలతో అస్వస్థకు గురై చికిత్స పొందుతున్న వారిని మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాసులు ఆదివారం పరామర్శించారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆదేశాల మేరకు అస్వస్థకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

February 22, 2026 / 06:30 PM IST

నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలి: ఎమ్మెల్యే

BDK: నిర్మాణంలో నాణ్యత పాటించాలని, గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే పాయం ఆదేశించారు. పినపాక మండలంలోని పోతిరెడ్డిపల్లి క్రింది గుంపు వాగుపై జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదివారం పరిశీలించారు. సుమారు రూ. 65 లక్షల వ్యయంతో చేపట్టిన ఈ పనుల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు.

February 22, 2026 / 06:30 PM IST

‘పిఠాపురంలో MRP ధరలకే అమ్మకాలు’

KKD: పిఠాపురం ఎక్సైజ్ పరిధిలో మద్యం అమ్మకాలు కేవలం MRP ధరలకే జరుగుతున్నాయని ఎక్సైజ్ సూపరింటెండెంట్ అధికారి సుబ్బలక్ష్మి స్పష్టం చేశారు. ఆదివారం తమ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి ఎక్కువ ధరలకు మద్యం అమ్మితే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

February 22, 2026 / 06:30 PM IST

ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలో చేరికలు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో పార్టీలో ఆదివారం నూతన చేరికలు జరిగాయి. 31వ డివిజన్ అక్కచెరువుపాడుకు చెందిన పలువురు TDP తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో కష్టపడి పని చేయాలని MLA సూచించారు.

February 22, 2026 / 06:30 PM IST