NGKL: జిల్లాలోని అన్ని గ్రామాల్లో మిషన్ భగీరథ తాగునీటి సర్వేను పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. బిజినేపల్లి మండలం వట్టెం, రామిరెడ్డిపల్లిలో కొనసాగుతున్న మిషన్ భగీరథ తాగునీటి ఇంటింటి సర్వేను శనివారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు.
KMM: రైతులు తమ పత్తిని కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుకింగ్ చేసుకుని విక్రయించుకోవాలని అధికారులు ఇవాళ సూచించారు. జిల్లాలో 2025-26 సీజన్కు సంబంధించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) పత్తి కొనుగోలు గడువును ఫిబ్రవరి 27 వరకు పొడిగించినట్లు ఖమ్మం అదనపు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని అన్ని జిన్నింగ్ మిల్లుల్లో ఈ గడువు వరకు కొనుగోళ్లు జరుగుతాయి.
TG: ఏఐ సమ్మిట్కు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ‘ఏఐ సమ్మిట్తో ఉద్యోగాలు వస్తే స్వాగతిస్తాం. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలతో దేశానికి నష్టం. ట్రంప్ చేప్పినట్లే మోదీ నడుచుకుంటున్నారు. యువత, రైతుల గురించి మోదీ ఆలోచించడం లేదు. దేశ ప్రజలకు వాస్తవాలు తెలియాలి’ అని పేర్కొన్నారు.
ASR: కోటవురట్ల మండలానికి చెందిన స్వచ్ఛ రథాన్ని రాష్ట్ర హోంమంత్రి అనిత నక్కపల్లి క్యాంప్ కార్యాలయంలో శనివారం సాయంత్రం జెండా ఊపి ప్రారంభించారు. గ్రామాల్లో పరిశుభ్రతకు స్వచ్ఛ రథాలు దోహదపడతాయన్నారు. పొడి చెత్తను తీసుకుని అవసరమైన నిత్యవసరం వస్తువులను స్వచ్ఛ రథాల ద్వారా పొందవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు లింగన్నాయుడు పాల్గొన్నారు.
KKD: ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 20వ తేదీన రాత్రి 17 ఏళ్ల బాలిక అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసిన ప్రత్తిపాడు SI ఎస్. లక్ష్మీకాంతం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి బాలిక ఆచూకి కోసం వెతికారు. ఏర్పాటైన 8 గంటల్లో ఆమెను గుర్తించి కుటుంబ సభ్యులకు ఇవాళ అప్పగించారు.
SRCL: బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో శనివారం ఏడబ్ల్యూసీలో నూతనంగా ఆరోగ్యలక్ష్మి కమిటీ ఎన్నిక నిర్వహించారు. కమిటీ ఛైర్మన్గా సర్పంచ్ సంధ్య, ఉపసర్పంచ్ మారుతి, వీవో సంధ్య, లావణ్యలచే కమిటీ ఏర్పాటు చేశామని అంగన్వాడి సూపర్వైజర్ నిర్మల తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ వరలక్ష్మి, అనూజ, తల్లులు, గర్భవతులు, బాలింతలు, తదితరులు పాల్గొన్నారు.
HNK: పరకాల మున్సిపాలిటీ 14వ వార్డు పరిధిలోని మసీదు వద్ద స్ట్రీట్ లైట్లు, కొత్త డ్రైనేజ్ పనులను శనివారం సాయంత్రం నూతన కౌన్సిలర్ పడిదెల దీప్తి-రాకేష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఇబ్బందులు లేకుండా రోడ్లు, లైట్లు, డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాలు త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
MDK: లైంగిక వేధింపులకు గురైన మహిళలు, బాలలకు భరోసా కేంద్రం ద్వారా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పేర్కొన్నారు. మెదక్ కేంద్రంలోని భరోసా కేంద్రాన్ని సందర్శించి తనిఖీ నిర్వహించారు. కార్యాలయ రికార్డులు, సిబ్బంది విధుల నిర్వాహణ పరిశీలించారు. ఫోక్సో కేసులు, లైంగిక వేధింపుల బాధితుల రక్షణకు చర్యలపై తెలుసుకున్నారు.
MDK: లైంగిక వేధింపులకు గురైన మహిళలు, బాలలకు భరోసా కేంద్రం ద్వారా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పేర్కొన్నారు. మెదక్ కేంద్రంలోని భరోసా కేంద్రాన్ని సందర్శించి తనిఖీ నిర్వహించారు. కార్యాలయ రికార్డులు, సిబ్బంది విధుల నిర్వాహణ పరిశీలించారు. ఫోక్సో కేసులు, లైంగిక వేధింపుల బాధితుల రక్షణకు చర్యలపై తెలుసుకున్నారు.
GDWL: కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామి ఈ నెల 23న జిల్లాకు రానున్నారు. దీంతో ఇవాళ జిల్లా కలెక్టర్ సంతోష్ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రోటోకాల్, భద్రతలో ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా చూడాలని ఆదేశించారు. హెలిపాడ్ నుంచి ఆలయం వరకు ఉన్న రహదారులను యుద్ధప్రతిపాదికన సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఈ పర్యటన అత్యంత ప్రతిష్టాత్మకమని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన హెచ్చరించారు.
AP: YCP నేతలకు దేవుడంటే భయం లేదని హోంమంత్రి అనిత తెలిపారు. చెప్పులు వేసుకుని స్వామివారి ఫొటో పట్టుకోవడం అపచారమన్నారు. వైసీపీ నేతలు చెప్పులు వేసుకున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తామన్నారని గుర్తు చేశారు. అయితే వీడియోలు రిలీజ్ చేశామని.. మరి రాజీనామా ఎందుకు చేయలేదని విమర్శించారు. రాజనీయానికి దేవుడిని వాడుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు.
VSP: భారత ప్రభుత్వ నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బీ.వీ.ఆర్. సుబ్రహ్మణ్యం ఆదివారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఢిల్లీ నుంచి విమానంలో ఆయన విశాఖ చేరుకుంటారు. పర్యటన అనంతరం తిరిగి 23వ తేదీ ఉదయం 9 గంటలకు వాయు మార్గంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.
NZB: ప్రతీ సోమవారం పోలీస్ ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని, దీనిని సమస్యలు ఉన్న ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రజలు తమకు సమస్యలను పోలీస్ ప్రజావాణి కార్యక్రమంలో విన్నవించి వాటిని పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు.
TG: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్లో నల్లమందు విక్రయిస్తున్న నలుగురిలో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. ముగ్గురి నుంచి 2.7 కిలోల OPMను ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి 2 సెల్ ఫోన్లు, రూ. 50 వేలు కైవసం చేసుకున్నారు. నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించారు.
KNR: వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేసి త్వరగా పూర్తి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. భూసేకరణ విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎక్కడ జాప్యం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. శనివారం సాయంత్రం కరీంనగర్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో KNR, HUZ ఆర్డీవోలు, సమావేశమయ్యారు.