• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఉచిత శిక్షణకు దరఖాస్తులు స్వీకరణ: కలెక్టర్

PDPL: జిల్లాలోని నిరుద్యోగ యువతకు టాస్క్ రీజియన్ సెంటర్ ఆధ్వర్యంలో జావా, వెబ్ డెవలప్మెంట్, సీ, HTML, CSS, జావా స్క్రిప్ట్, టాలీ విత్ జీఎస్టీ, మొదలైన కోర్సుల్లో ఉచిత శిక్షణ అందివ్వనున్నట్లు కలెక్టర్ శ్రీహర్ష శనివారం తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 28 లోపు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 9059506807లో సంప్రదించాలి.

February 21, 2026 / 05:47 PM IST

మున్నూరుకాపు సంఘం నూతన కమిటీ ఎన్నిక

JNG: బచ్చన్నపేట మండలం పొచ్చన్నపేట గ్రామ మున్నూరుకాపు సంఘం నూతన కమిటీ ఎన్నిక జరిగినట్లు సంఘం సభ్యులు శనివారం తెలిపారు. అధ్యక్షులుగా జుల కిష్టయ్య, ప్రధాన కార్యదర్శిగా చింతపండు బాలకృష్ణ ప్యానెల్ విజయం సాధించింది. ఉపాధ్యక్షులుగా గోపాల నర్సిములు, సభ్యులుగా ముదం సిద్దయ్య, జుల భాస్కర్లు, సలహాదారులుగా చింతపండు ఆంజయ్య, మట్టి బిక్షపతి, క్రిష్ణలు ఎన్నికయ్యారు.

February 21, 2026 / 05:44 PM IST

బీఆర్ఎస్‌కు భారీ షాక్..!

MDK: చిన్న శంకరంపేట మండలంలో బీఆర్ఎస్‌కు భారీ షాక్ తగిలింది. ఖాజాపూర్ సర్పంచ్ బాలస్వామి, ఉపసర్పంచ్ అక్బర్, కాజాపూర్ తండాకు చెందిన ప్రియనాయక్ సహా సుమారు 80 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి మైనంపల్లి హనుమంత రావు, మండల నాయకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

February 21, 2026 / 05:44 PM IST

వటపత్రశాయి అలంకారంలో నృసింహుడు

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 11 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శనివారం ఉదయం వటపత్రశాయి అలంకారంలో లక్ష్మీనరసింహస్వామి దర్శనమిచ్చారు. రాత్రి హంస వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు. బ్రహ్మోత్సవాలు, వీకెండ్ కావడంతో యాదగిరిగుట్టకు భారీగా భక్తులు తరలివచ్చారు.

February 21, 2026 / 05:43 PM IST

రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

ప్రకాశం: హనుమంతునిపాడు మండలం వేములపాడు గ్రామంలో బస్‌స్టాప్ నుంచి పాఠశాల వరకు జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఒంగోలు ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పరిశీలించారు. పనులు నాణ్యతతో, నిర్దేశిత కాలపట్టికలో పూర్తి చేయాలని అధికారులకు ఆయన సూచించారు. గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

February 21, 2026 / 05:42 PM IST

‘పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరగాలి’

KMR: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో చీఫ్ సూపరింటెండెంట్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

February 21, 2026 / 05:41 PM IST

రహదారికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

VZM: నెల్లిమర్ల నియోజకవర్గంలోని రహదారుల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే లోకం నాగ మాధవి పేర్కొన్నారు. శనివారం “కొండవెలగాడ – విజయనగరం కుమ్మరవీధి రోడ్ రిసర్ఫేసింగ్” పనులకు ఆమె శాస్త్రోక్తంగా భూమి పూజ చేసి, శంకుస్థాపన చేశారు. గత కొంతకాలంగా గుంతలమయంగా మారి ప్రయాణికులకు నరకంగా ఉన్న ఈ రహదారిని పునరుద్ధరించడం తన ప్రాధాన్యత అని తెలిపారు.

February 21, 2026 / 05:40 PM IST

‘ప్రజల సహకారంతోనే స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ సాధ్యం’

E.G: నల్లజర్ల మండలం కృష్ణమ్మగూడెం గ్రామంలో ‘స్వచ్చ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఏర్పాటు చేసిన స్వచ్ఛాంద్ర వాహనాన్ని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రారంభించారు. గ్రామాల పరిశుభ్రతే రాష్ట్రాభివృద్ధికి పునాది అని తెలిపారు. ప్రజల సహకారంతోనే స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ సాధ్యమని పేర్కొన్నారు.

February 21, 2026 / 05:40 PM IST

మార్కెట్‌ను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: ఎమ్మెల్యే

ATP: అనంతపురం నగరంలో శనివారం ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఈ-వేస్ట్ పర్యావరణానికి ప్రమాదకరం కాకూడదని తెలిపారు. మార్కెట్ పరిశుభ్రంగా ఉండటానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

February 21, 2026 / 05:40 PM IST

భూమి వైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం

సుమారు 410 అడుగుల వెడల్పు గల ‘2025 YU15’ గ్రహశకలం గంటకు 34,288 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తోంది. అయితే, ఇది భూమికి చేరువగా వస్తున్నప్పటికీ, ఢీకొనే ప్రమాదం లేదని NASA స్పష్టం చేసింది. ఇది భూమికి సుమారు 5.89 మిలియన్ కిలోమీటర్ల దూరం నుండి వెళ్లనుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కాబట్టి, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు వెల్లడించారు.

February 21, 2026 / 05:40 PM IST

ఉద్యమకారుల పాత్ర కీలకం: గణేష్

HNK: ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం హన్మకొండ జిల్లా అధ్యక్షుడు పొడిశెట్టి గణేష్ అన్నారు. శాయంపేటలో ఆయన మాట్లాడుతూ… ఉద్యమకారులకు ఇంటి స్థలం, పెన్షన్, ఇతర హామీలను నెరవేర్చే దిశగా కృషి చేస్తున్న వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని, స్వరాష్ట్ర సాధనలో ఉద్యమకారుల పాత్ర కీలకమన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్ ఉన్నారు.

February 21, 2026 / 05:39 PM IST

అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం: ఎమ్మెల్యే

BDK: ఇల్లందు నియోజకవర్గం గార్ల గ్రామ పంచాయతీకి మత్స్య శాఖ కింద లైవ్ ఫిష్ వెహికల్ మంజూరు అయింది. శనివారం ఎమ్మెల్యే కోరం కనకయ్య జెండా ఊపి ఆ వాహనాన్ని ప్రారంభించి సంఘం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవాలని లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.

February 21, 2026 / 05:38 PM IST

జిల్లాలో ఇంటర్ పరీక్షలకు డ్రోన్తో నిఘా: ఎస్పీ

KKD: ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా అన్ని కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు SP జి. బిందు మాధవ్ శనివారం తెలిపారు. ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే పరీక్షల్లో డ్రోన్, సోలార్ కెమెరాలతో నిఘా ఉంటుందన్నారు. DHMD, HHMDలతో తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసి విజయం సాధించాలని ఆకాంక్షించారు.

February 21, 2026 / 05:36 PM IST

18 ఏళ్లు నిండకుండా పెళ్లి చేస్తే కఠిన చర్యలు: డీసీపీవో

ADB: తల్లిదండ్రులు ఆడపిల్లల వయస్సును పరిగణనలోకి తీసుకోకుండా బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్ర అన్నారు. ‘ష్యూర్’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘బాల్య వివాహ విముక్తి ప్రచార రథం’ శనివారం జిల్లా కార్యాలయానికి చేరుకుంది. చట్ట ప్రకారం వివాహానికి అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండి ఉండాలన్నారు.

February 21, 2026 / 05:35 PM IST

చిత్తూరులో రెండు యూనివర్సిటీలు

CTR: చిత్తూరులో త్వరలో రెండు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు కానున్నాయని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తెలిపారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. చిత్తూరు స్మార్ట్ సిటీ డెవలప్‌మెంట్ సొసైటీ సమావేశంలో ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావుతో కలిసి పాల్గొన్నారు.

February 21, 2026 / 05:33 PM IST