GNTR: తెనాలి హెడ్ వాటర్ వర్క్స్ మోటార్ రిపేర్ కారణంగా బుధవారం పట్టణంలోని 40 వార్డులకు మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు తెలిపారు. ప్రజలు దీనిని గమనించి ముందస్తుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచించారు. గురువారం నుంచి యథావిధిగా నీటి సరఫరా జరుగుతుందని, కావున ప్రజలు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుత T20 వరల్డ్ కప్ రసవత్తరంగా సాగుతోంది. ఈ సారి టోర్నీలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆటగాళ్లు సెంచరీలతో రాణిస్తున్నారు. 2010, 2014, 2016 ఎడిషన్స్లో అత్యధికంగా రెండేసి సెంచరీలు నమోదు కాగా.. ప్రస్తుత టోర్నీలో ఇప్పటికే 4* నమోదయ్యాయి. ఇంకా 10 మ్యాచులు మిగిలి ఉండటంతో ఈ సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ లేకపోలేదు.
శ్రీవిశ్వావసు నామ సంవత్సరం; ఉత్తరాయణం; శిశిర రుతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్ష నవమి: రా2-57 తదుపరి దశమి; రోహిణి: మ2-09 తదుపరి మృగశిర; వర్జ్యం: ఉ6-45 నుంచి 8-13 వరకు, తిరిగి రా7-24 నుంచి 8-54 వరకు; అమృత ఘడియలు: ఉ11-11 నుంచి 12-40 వరకు, తిరిగి తె4-23 నుంచి 5-53 వరకు; దుర్ముహూర్తం: ఉ11-50 నుంచి 12-36 వరకు; రాహుకాలం: మ12 నుంచి 1-30 వరకు; సూర్యోదయం: ఉ6-26; సూర్యాస్తమయం: సా6-01.
➢ 1961: తెలుగు రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి మరణం➢ 1974: సినీ నటి దివ్యభారతి జననం➢ 1981: బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ జననం➢ 1998: న్యూస్ ఆన్ ఫోన్ విధానాన్ని ఆకాశవాణి(AIR) ప్రవేశపెట్టింది➢ 2001: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్మాన్ మరణం ➢ 2004: సినీ నిర్మాత బి.నాగిరెడ్డి మరణం
TG: యాదాద్రి జిల్లా పాలడుగులో దారుణం చోటుచేసుకుంది. మాటామాటా పెరగడంతో అన్న భార్య వెంకటమ్మ గొంతును మరిది బొంత అశోక్ కత్తితో కోశాడు. అశోక్ అన్న నర్సింహ ఇటీవలే మరణించగా.. ఇరు కుటుంబాల మధ్య భూ తగాదాపై కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం వెంకటమ్మతో అశోక్, అతని ఇద్దరు మనవళ్లు గొడవపడ్డి గొంతు కోశారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతుండగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.
AP: శ్రీకాకుళంలో డయేరియాతో పలువురు ఆస్పత్రుల్లో చేరడంపై YCP చీఫ్ జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రోడ్ల నిర్వహణ, తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఈ పరిస్థితికి దారితీసిందని విమర్శించారు. ప్రజారోగ్య రక్షణలో వైఫల్యం ప్రభుత్వ పరిపాలనా లోపాలను బయటపెడుతోందన్నారు.
పాక్తో జరిగిన సూపర్-8 మ్యాచ్లో ఇంగ్లండ్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత పాక్ 164 రన్స్ చేయగా.. లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ కెప్టెన్ బ్రూక్ సెంచరీ(100)తో రాణించాడు. దీంతో ఇంగ్లీష్ టీమ్ 19.1 ఓవర్లలో విజయాన్ని కైవసం చేసుకోవడంతో పాటు సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. అటు పాక్ అనధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఒత్తిడి, కాలుష్యం, నిద్రలేమి వల్ల చర్మం త్వరగా ముడతలు పడుతోంది. వీటిని అరికట్టాలంటే పోషకాహారం, మంచి నిద్ర అవసరం. చర్మ సంరక్షణలో భాగంగా రోజూ సన్స్క్రీన్, విటమిన్-C, నియాసినమైడ్ సీరమ్ వాడాలి. ఇలాంటి క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటిస్తే మీ చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా, ఆరోగ్యంగా కాంతివంతంగా మెరుస్తుంది.
SKLM: రైతు గుర్తింపు సంఖ్య తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ వర్మ అన్నారు. నందిగాం మండల పరిధిలోని చిన్నలవుని పల్లి, నౌగాం గ్రామాల్లో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ రాయితీలు పొందేందుకు గుర్తింపు కార్డు ఉపయోగపడుతుందని తెలిపారు.
TG: పరీక్షలు జరిగే రోజుల్లో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా RTC ప్రత్యేక చర్యలు చేపట్టింది. పదో తరగతి, ఇంటర్ హాల్ టికెట్లు చూపిస్తే కోరిన చోట బస్సు ఆపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు, మార్చి 14 నుంచి పదో తరగతి పరీక్షలు జరగనుండటంతో.. పరీక్షల సమయంలో అదనంగా బస్సులు నడిపేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
NZB: ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్యే గూండాలా, రౌడీలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఇంటికి వచ్చిన వ్యక్తి వయసు 65 ఏళ్లు ఉంటుందన్నారు.
BPT: అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఆసరాగా నిలుస్తోందని ఎమ్మెల్యే సాంబశివరావు క్యాంపు కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. మంగళవారం ఇసుకదర్శిలోని కార్యాలయంలో, ఇంకొల్లు గ్రామానికి చెందిన షేక్ చాందిని వైద్య చికిత్స నిమిత్తం మంజూరైన రూ.3,02,598 విలువైన ఎల్ఓసీ పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
GNTR: జీజీహెచ్లో కుక్కకాటుకు గురై చికిత్స పొందుతున్న చిన్నారులను వైసీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా మంగళవారం పరామర్శించారు. నల్లచెరువు వద్ద కుక్కల దాడిలో గాయపడిన ఫణీంద్ర రెడ్డి, షేక్ ఆయన్ల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారుల తల్లిదండ్రులకు ఆమె ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.
PLD: మాచర్ల విద్యుత్ శాఖలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ హఠాన్మరణం చెందిన హుస్సేన్ కుటుంబానికి తోటి ఉద్యోగులు అండగా నిలిచారు. అందరూ కలిసి సేకరించిన రూ.3లక్షల ఆర్థిక సాయాన్ని మంగళవారం పల్నాడు జిల్లా ఎస్ఈ డాక్టర్ విజయకుమార్ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించేందుకు కృషి చేస్తా మన్నారు.
ప్రకాశం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ప్రకాశం జిల్లా దర్శిలో మంగళవారం మోస్తరు వర్షం కురిసింది. ఇటీవల పెరిగిన ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఈ వర్షంతో ఉపశమనం పొందారు. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.