సత్యసాయి: జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం ఆర్టీసీ బస్టాండ్లు, బస్సులలో ప్రయాణికులకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. దృష్టి మళ్లించి దొంగతనాలకు పాల్పడే ముఠాల పట్ల జాగ్రత్తగా ఉండాలని మైకుల ద్వారా హెచ్చరిస్తున్నారు. రద్దీ సమయాల్లో ప్రత్యేక తనిఖీలు చేపడుతూ అనుమానితులను మొబైల్ స్కానింగ్ పరికరాలతో తనిఖీ చేస్తున్నారు.
మావోయిస్టుల ఏరివేత లక్ష్యంలో భాగంగా భద్రతా దళాల ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే వందలాది మంది నక్సల్స్ లొంగిపోగా.. చాలా మంది ఎదురుకాల్పుల్లో మరణించారు. మిగిలిన వారూ అడవులు వీడి జనజీవన స్రవంతిలోకి రావడం తప్ప మరో మార్గం లేదని మాజీ మావోయిస్టు మల్లోజుల వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. ఇటీవల మహారాష్ట్ర సీఎం ఎదుట మల్లోజుల లొంగిపోయిన విషయం తెలిసిందే.
ఢిల్లీ ముఖర్జీనగర్లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ తన రెండేళ్ల అల్లుడిని వాకింగ్కు తీసుకెళ్లి గొంతు కోసి చంపింది. ఈ ఘాతుకానికి పాల్పడిన సదరు మహిళపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
AP: అమరావతిలో నూతన హైకోర్టు ఐకానిక్ భవన నిర్మాణ పనులను మంత్రి నారాయణ ప్రారంభించారు. అమరావతిలో 7 ఐకానిక్ భవనాలు నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. 2027 చివరి నాటికి హైకోర్టు నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 21 లక్షల చదరపు అడుగులలో నిర్మాణం జరగనున్నట్లు చెప్పారు. B+G+7 అంతస్తుల్లో నూతన హైకోర్టు భవనం నిర్మాణం చేపట్టారు.
JN: బచ్చన్నపేట మండలం లింగంపల్లి చెందిన బొడ్డు ప్రవీణ్, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. జగన్ మరోసారి సీఎం కావాలని కోరుతూ తెలంగాణ వ్యాప్తంగా 100 దేవాలయాల్లో మోకాళ్లపై నడుస్తూ ప్రతి ఆలయంలో 100 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. శుక్రవారం కొడవటూరు సిద్దేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాడు.
TG: భారత్ ఫ్యూచర్ సిటీ, AI సిటీ, AI యూనివర్సిటీ, ఏఐ ఆధారిత TG డిజిటల్ ఎక్స్ఛేంజ్, భూభారతి లాంటి విప్లవాత్మక సంస్కరణలు డిజిటల్ గవర్నెన్స్లో తెలంగాణ బ్రాండ్ను సుస్తిరం చేస్తాయని మంత్రి శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. సాంకేతిక ఫలాలను కేవలం ఓ ప్రాంతానికో పరిమితం చేయకుండా అందరికీ చేరువ చేసేలా ‘ఏజెంటిక్ ఏఐ’ వినియోగంపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు.
MNCL: మందమర్రి ఏరియాలో 90 మంది అవుట్ సోర్సింగ్ సెక్యూరిటీ గార్డుల కేటాయింపు కోసం నిర్వహించిన టెండర్లలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని CPI పట్టణ కార్యదర్శి దుర్గరాజ్ శుక్రవారం ఆరోపించారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి అర్హత లేని సంస్థలకు టెండర్లు కట్టబెట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ESI, PF బిల్లులు పరిశీలించాలన్నారు.
KMM: తెలంగాణ ఉద్యమకారుడు బత్తుల సోమయ్య గౌడ్-పంకజం దంపతులు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కూసుమంచి మండలం లోక్యాతండా వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారు భవానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం తెలుసుకున్న మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ స్పందించి శుక్రవారం ఆస్పత్రికి వెళ్లి సోమయ్య-పంకజం దంపతులను పరామర్శించారు.
SRCL: తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో దివ్యాంగుల సంక్షేమ పథకంలో భాగంగా ఉచిత ద్విచక్ర వాహనాలు పంపిణీ చేశారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ లబ్ధిదారులకు వాహనాలు అందజేశారు. ఇల్లంతకుంట మండలం నర్సక్కపేటకు చెందిన ర్యాగటి శ్రీనివాస్, ర్యాగటి శ్రవణ్ వాహనాలు పొందారు. దివ్యాంగుల ఉపాధి, ప్రయాణ సౌకర్యానికి ఇవి ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలిపారు.
PLD: వినుకొండ పట్టణంలో అర్బన్ పోలీస్ స్టేషన్ మంజూరు చేయాలని కోరుతూ సీపీఐ నాయకులు శుక్రవారం జిల్లా ఎస్పీ కృష్ణారావుకు వినతి పత్రం సమర్పించారు. సీఎం పర్యటన ఏర్పాట్ల సమీక్ష కోసం వినుకొండ వచ్చిన ఎస్పీని, సీపీఐ పట్టణ కార్యదర్శి రాము నేతృత్వంలోని బృందం మర్యాదపూర్వకంగా కలిసి ఈ విజ్ఞప్తిని చేశారు.
RR: మహేశ్వరం నియోజకవర్గం, బడంగ్పేట్ సర్కిల్లో గ్రేటర్ HYD మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులతో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. GHMC శంషాబాద్ జోనల్ కమిషనర్, బడంగ్పేట్ డిప్యూటీ కమిషనర్ పాల్గొన్నారు.
భారత్-అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ చర్చలు తుదిదశలో ఉన్నట్లు తెలిపారు. ఒప్పందానికి సంబంధించి న్యాయపరమైన అంశాలపై చర్చించి, ఖరారు చేసేందుకు భారత్-అమెరికా అధికారులు ఫిబ్రవరి 23న అమెరికాలో భేటీ కానున్నారు. ఈ సమావేశం సుమారు మూడ్రోజులు కొనసాగతుందని సమాచారం.
PDPL: మంథని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఇవాళ దాడి చేశారు. సబ్ రిజిస్ట్రార్ కాసర్ల రాజేందర్, ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ రషీద్తో కలిసి పుట్టపాకకు చెందిన రైతు వద్ద రూ. 16,500 ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం తీసుకుంటుండగా ACB DSP మధు ఆధ్వర్యంలో వలపన్ని పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.
గుంటూరు బృందావన్ గార్డెన్స్కు చెందిన నాలి గురుబ్రహ్మం, శాంతి దంపతులు శుక్రవారం మార్టూరు సమీపంలోని రాజుపాలెం వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అద్దంకిలో ఉన్న కుమార్తెను చూసి బైక్పై తిరిగి వస్తుండగా, బస్సు వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దంపతులను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
SRCL: ప్రతి వర్గానికి సమానహక్కులు, అవకాశాలు న్యాయం అందించాలని లోక్ అదాలత్ సభ్యులు ఆడెపు వేణు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో రాజనీతి శాస్త్ర విభాగం సహకారంతో ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవంను నిర్వహించారు. అనంతరం న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు.