• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో రూరల్ ఎమ్మెల్యే

NZB: డిచ్‌పల్లిలో శ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని అధికారికంగా నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి భోగ్ బండారు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సేవాలాల్ విగ్రహ ఆవిష్కరణకు భూమిపూజ చేశారు.

February 21, 2026 / 06:21 PM IST

నిత్యం రైల్వే గేట్ తిప్పలు

VKB: బషీరాబాద్ మండల కేంద్రంలోని రైల్వే గేటు స్థానిక వాహనదారులకు తీరని సమస్యగా మారింది. ప్రతిరోజూ రైళ్లు రాకపోకలు సాగించే సమయంలో గేటు పడటంతో 15 నుంచి 20 నిమిషాలు నిరీక్షిస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఈ రూట్లో నిత్యం ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్, సరుకు రవాణా రైళ్లు వెళ్తుంటాయి. ఎన్నో ఏళ్ల నుంచి ఈ సమస్యతో స్థానిక వాహనదారులు సతమతమవుతున్నారు.

February 21, 2026 / 06:20 PM IST

ప్రభుత్వానికి ఉద్యోగులే వెన్నెముక: ఎమ్మెల్యే

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఉద్యోగుల పాత్ర కీలకమని MLA పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. శనివారం సత్యసాయి జిల్లా ఎన్జీవో సంఘం నాయకులు ఎమ్మెల్యేను, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఎన్జీవో భవన నిర్మాణానికి సహకరించాలని వారు కోరారు. CM దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

February 21, 2026 / 06:20 PM IST

చీపురి పట్టిన ఎమ్మెల్యే పరిటాల సునీత

ATP: రాప్తాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం నిర్వహించిన ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో కార్యకర్తలు, ప్రజలతో కలిసి ఆమె స్వయంగా చెత్తను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి ఆసుపత్రిలోని సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చీపురుపట్టి పరిసరాలు శుభ్రం చేశారు.

February 21, 2026 / 06:20 PM IST

వైసీపీ దేవరపల్లి మండల ఉపాధ్యక్షుడిగా దుర్గారావు

E.G: దేవరపల్లి మండల వైసీపీ ఉపాధ్యక్షుడిగా దేవరపల్లి గ్రామానికి చెందిన దుర్గారావు నేడు నియమితులయ్యారు. వైసీపీ పార్టీలో మొదటి నుంచి కష్టపడే నాయకుడిగా పేరు ఉన్న దుర్గారావుకు ఈ పదవి దక్కడం పట్ల దేవరపల్లి పట్టణ అధ్యక్షుడు గంగాధర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పదవి రావడానికి కారకులైన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.

February 21, 2026 / 06:20 PM IST

భారత్-బ్రెజిల్ ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక మలుపు

భారత్-బ్రెజిల్ ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. ఇటీవల జరిగిన ఏఐ సమ్మిట్ ఇరుదేశాల బంధానికి కొత్త శక్తిని ఇచ్చిందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందాలు భవిష్యత్తులో రెండు దేశాల ఆర్థిక, సాంకేతిక అభివృద్దికి మరింత ఊతమిస్తాయని ఆయన పేర్కొన్నారు.

February 21, 2026 / 06:17 PM IST

వేధింపులపై భయపడకుండా ఫిర్యాదు చేయాలి: ఎస్సై స్వాతి

WGL: నర్సంపేట మండలం రాజుపేట జిల్లా పరిషత్ పాఠశాలలో షీ టీమ్స్ ఎస్సై స్వాతి ఆధ్వర్యంలో శనివారం మహిళల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఎదుర్కొనే వేధింపులు, ఫిర్యాదు చేసే విధానం, షీ టీమ్స్ సేవలను ఎలా వినియోగించుకోవాలనే అంశాలపై వివరించారు. మహిళల రక్షణకు షీ టీమ్స్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని ఎస్సై స్వాతి తెలిపారు.

February 21, 2026 / 06:15 PM IST

చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు: SP

KMR: ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద పోలీసులను లక్ష్యంగా చేసుకుని కారుతో అతివేగంగా దూసుకెళ్లిన నిందితుడు గిరెడ్డి మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పాత నేర చరిత్ర కలిగిన ఇతడిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని, విద్వేషాలకు తావులేకుండా మత సామరస్యాన్ని కాపాడాలన్నారు.

February 21, 2026 / 06:11 PM IST

క్రీడాకారులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి: కలెక్టర్

NGKL:  జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో సీఎం కప్ క్రీడలను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఘనంగా ప్రారంభించారు. స్వయంగా వాలీబాల్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపిన ఆయన, క్రీడల్లో గెలుపోటములు సహజమని పేర్కొన్నారు. ప్రతి క్రీడాకారుడు నిరంతరం నైపుణ్యాన్ని మెరుగుపర్చుకుంటేనే క్రీడారంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని కలెక్టర్ ఆకాంక్షించారు.

February 21, 2026 / 06:10 PM IST

‘పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలి’

SRPT: పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని కోదాడ మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. శనివారం కోదాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నూతనంగా మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన ఎర్నేని కుసుమ బాబును సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పద్మావతి సహకారంతో వైద్యశాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.

February 21, 2026 / 06:10 PM IST

భోజనం మానేయడం వల్ల బరువు తగ్గుతారా?

కొందరు బరువు తగ్గడానికి మధ్యాహ్న భోజనం లేదా డిన్నర్ మానేస్తుంటారు. అలా చేయడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భోజనం స్కిప్ చేయడం వల్ల బరువు తగ్గకపోగా పెరిగే ఛాన్స్ ఉంది. ఎక్కువ సేపు ఆకలితో ఉండటం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. శరీరం కొవ్వును బర్న్ చేయడానికి బదులుగా నిల్వ చేస్తుంది. దీనివల్ల తాత్కాలికంగా బరువు తగ్గిన మళ్లీ వేగంగా పెరిగే ఛాన్స్ ఉందని చెప్పారు.

February 21, 2026 / 06:08 PM IST

సొంత ఇంటి కల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం: ఎమ్మెల్యే

వనపర్తి: నిరుపేదల సొంత ఇంటి కల నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో సాధ్యమవుతుందని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలిపారు. శనివారం వనపర్తిలోని పలు మండలాల్లో ఆయన పర్యటించి నూతనంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్న లబ్ధిదారుల గృహప్రవేశాలకు హాజరై నూతన వస్త్రాల అందజేశారు. ఎన్నో ఏళ్లుగా సొంత ఇంటి నిర్మాణం కోసం కలలుగన్న కుటుంబాల ఇంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం వెలుగు నింపిందన్నారు.

February 21, 2026 / 06:08 PM IST

శాంతియుతంగా పండుగలు జరుపుకుందాం: సీపీ

NZB: రాబోయే ఉగాది, హోలీ, రంజాన్ పండుగలను ప్రజలందరూ సోదరభావంతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ పి.సాయిచైతన్య పిలుపునిచ్చారు. శనివారం కమిషనరేట్‌లో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా గంగా జమునా తెహజీబ్‌కు ప్రతీక అని కొనియాడారు. రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

February 21, 2026 / 06:08 PM IST

సంక్షేమ పథకాలు అందేలా కృషి: MLA

ADB: అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా తనవంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శనివారం బేల మండలంలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి చేరేలా అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు.

February 21, 2026 / 06:07 PM IST

పెద్దమ్మ టెంపుల్‌లో జరిగిన చోరి కేసులో నిందితుడు అరెస్ట్

మంచిర్యాల పట్టణం హమాలివాడలోని పెద్దమ్మ టెంపుల్‌లో జరిగిన చోరి కేసులో నిందితుడు గుమ్మడి సారయ్యను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. SI తిరుపతి వివరాల ప్రకారం. నిందితుడు సారయ్య టెంపుల్‌లో హుండీ పగలగొట్టి రూ. 3,000 దొంగతనం చేయడం జరిగిందన్నారు. విచారణలో నిందితుడు నిజం ఒప్పుకున్నట్టు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచామన్నారు.

February 21, 2026 / 06:07 PM IST