SRCL : తంగళ్ళపల్లి మండలం సారంపల్లిలో సర్పంచ్ గుగ్గిళ్ళ లావణ్య ఆధ్వర్యంలో ఆదివారం చిన్నారులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పిల్లలకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భరత్ గౌడ్, మునిగేలా రాజు, వార్డ్ సభ్యులు ఖాదర్, భారతవ్వ, హనీఫ్, గంగారాం తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ చొరవను గ్రామస్తులు అభినందించారు.
NLG: ‘సీఎం-కప్’ రాష్ట్రస్థాయి క్రీడల్లో ఆమనగల్లు గ్రామానికి చెందిన నలబాల లిఖిత 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించి రికార్డు సృష్టించింది. 33 జిల్లాల నుంచి పాల్గొన్న పోటీదారులలో మూడవ స్థానంలో నిలిచి తన ప్రతిభను చాటింది. గ్రామీణ క్రీడాకారులకు ‘సీఎం-కప్’ గొప్ప వేదికని, తన తదుపరి లక్ష్యం జాతీయ స్థాయికి ఎంపిక కావడమేనని లిఖిత పేర్కొంది.
NLR: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను సోమవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణం నందు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను వెబ్ సైట్ Meekosam.ap.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. ఇతర వివరాలకు సమాచారం కోసం 1100 కాల్ సంప్రదించవచ్చన్నారు.
MDCL: అల్వాల్ TIMS ఆసుపత్రి నిర్మాణంలో వేగం పెరిగినట్లుగా అక్కడి ఇంజనీర్లు తెలిపారు. ఈ ఏడాదిలోనే TIMS ఆసుపత్రి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే చివరి దశలో వర్క్ కొనసాగుతుండగా, ఇది అందుబాటులోకి వస్తే పరిసర ప్రాంతాల వారికి ప్రభుత్వ వైద్యం మరింత చేరువవుతుందని స్థానిక డాక్టర్ శివప్రకాష్ వర్మ తెలిపారు.
పాకిస్తాన్ సూపర్ లీగ్(PSL) 2026లోకి మరో సౌతాఫ్రికా క్రికెటర్ చేరాడు. ఈ లీగ్లో ఇప్పటికే చాలామంది సౌతాఫ్రికా ఆటగాళ్లు పాల్గొంటుండగా.. తాజాగా యువ వికెట్కీపర్ రూబిన్ హెర్మన్ వీరి సరసన చేరాడు. హెర్మన్ను లాహోర్ ఖలందర్స్ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. ఖలందర్స్తో జతకట్టిన అనంతరం హెర్మన్కు ప్రత్యేక గుర్తింపు దక్కింది.
E.G: అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అపర దానకర్ణుడు కొవ్వూరి బసివిరెడ్డి జీవిత చరిత్రను ఇటీవల జరిగిన అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ సందర్బంగా అనపర్తి మండలం రామవరంలో ఎమ్మెల్యేను కొవ్వూరి బసివిరెడ్డి కుటుంబ సభ్యులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన జీవిత చరిత్ర ఎందరికో ఆదర్శమని ఎమ్మెల్యే కొనియాడారు.
ATP: గత ఎన్నికల్లో పోలింగ్ సరళిపై మాజీ మంత్రి శైలజానాథ్ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయంత్రం 5 గంటలకు క్యూలైన్లలో ఉన్న వారికి కేవలం 30 వేల టోకెన్లు మాత్రమే జారీ అయ్యాయని పేర్కొన్నారు. మరి అర్ధరాత్రి సమయంలో 50 లక్షల ఓట్లు ఎలా నమోదయ్యాయని, ఆ ఓట్లు దెయ్యాలు లేదా ఆత్మలు వేశాయా అని ప్రశ్నించారు. ఎన్నికల అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
SKLM: మెలియాపుట్టి (M) గాథలవలస గ్రామంలో శ్రీ సవర పోలమ్మ అమ్మవారి ఆలయ పునః ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం ఆదివారం జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు ముఖ్యఅతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ దేవతల ఆశీస్సులు ఉంటే గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంది అని అన్నారు.
MDK: రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో ఆదివారం గ్రామపంచాయతీ వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎఫ్ఆర్వో కుద్బుద్దిన్ మాట్లాడుతూ.. అడవుల పరిరక్షణకై ప్రతి ఒక్కరు సహకరించాలని, అడవిలో అగ్ని ప్రమాదాలు జరిగితే వెంటనే సమాచారం అందించాలని గ్రామస్తులకు సూచించారు.
RR: బాన్సువాడ హింసలో గాయపడిన బాదిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళుతున్న BJP రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావును అడ్డుకుని నిర్బంధించడం ప్రభుత్వ దౌర్జన్యానికి పరాకాష్ట అని SDNR BJP నేత శ్రీవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. అసలు దుండగులను వదిలిపెట్టి బాధితుల పక్షాన నిలిచిన నాయకుడిని అరెస్టు చేయడం అధికార దుర్వినియోగానికి ఉదాహరణ అన్నారు.
CTR: చిత్తూరులో టీడీపీ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజా కార్యక్రమాలు ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ ప్రసాదరావు, ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్ హాజరయ్యారు. పార్టీ బలోపేతానికి, కార్యకర్తల సమన్వయానికి కార్యాలయం కేంద్ర బిందువుగా నిలుస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు.
PDPL: రామగుండం కార్పొరేషన్ డివిజన్లలో కనీస సౌకర్యాలు కల్పించి, అభివృద్ధి కార్యక్రమాలను పటిష్టంగా చేపట్టాలని CPI నాయకులు కనకరాజు, కార్పొరేటర్ మార్కాపురి సూర్య మేయర్ మహంకాళి స్వామిని ఆదివారం కలిసారు. మార్కండేయ కాలనీలో సమస్యలపై చర్చించి, పనులను తక్షణమే అమలు చేయమని కోరారు. గోశిక మోహన్, గౌతం గోవర్ధన్, తాళ్లపల్లి మల్లయ్య, శంకర్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
WNP: పట్టణంలోని 14వ వార్డు అధ్వాన్నంగా తయారైంది. స్థానిక బ్రహ్మంగారి ఆలయం వెనుక భాగం ప్రస్తుతం చెత్తాచెదారంతో నిండి, ఒక మినీ డంపింగ్ యార్డ్ను తలపిస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో హడావుడి చేసిన అధికారులు, ఆ తర్వాత అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో వార్డు ప్రజలు మండిపడుతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.
విశ్వక్ సేన్ ‘కల్ట్’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో సంగీత దర్శకుడు రవి బస్రూర్ తన గతాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యాడు. 18 ఏళ్ల వయసులో ఆర్థిక కష్టాల వల్ల రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించానని తెలిపాడు . ఆ సమయంలో రవి అనే వ్యక్తి తనను రక్షించి, కీబోర్డుతో పాటు రూ.35 వేలు ఇచ్చి ఆదుకున్నారని, అందుకే ఆయనపై కృతజ్ఞతతో తన పేరులో ‘రవి’ని చేర్చుకున్నానని వెల్లడించాడు.
కడప జిల్లా TDP పార్టీ నూతన కార్యాలయ నిర్మాణానికి ఆదివారం ఘనంగా భూమిపూజ జరిగింది. జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్య రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకలో జిల్లా టీడీపీ నాయకులు, నగర కమిటీ సభ్యులు, క్లస్టర్, బూత్, యూనిట్ ఇన్చార్జ్లు తదితరులు పాల్గొన్నారు.