BDK: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో రేపు నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీవో రాహుల్ ఆదివారం తెలిపారు. గిరిజన దర్బార్కు రేపు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. గిరిజనులు వారి వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందచేయాలని కోరారు.
ATP: తాడిపత్రి మండలం వెలమకూరు పొలాల్లో పేకాటాడుతున్న 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ జగదీష్ ఆదేశాలతో సీఐ శివగంగాధర్ రెడ్డి నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి. నిందితుల నుంచి రూ.72,980 నగదు, మూడు మోటార్ సైకిళ్లు, 11 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
CTR: పలమనేరు ఏరియా ఆసుపత్రిని జిల్లా స్థాయి ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు MLA అమర్నాథ్ రెడ్డి, MP దగ్గు మళ్ల ప్రసాద్ రావు సంయుక్తంగా ప్రకటించారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో ఆదివారం 6000 లీటర్ల కెపాసిటీతో ఏర్పాటు చేసిన సోలార్ వాటర్ హీటింగ్ సిస్టంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వార్డులను వారు పరిశీలించారు.
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు లక్షెట్టిపేట పట్టణంలో పర్యటించనున్నారని కాంగ్రెస్ పార్టీ లక్షెట్టిపేట పట్టణ, మండల అధ్యక్షులు ఎండీ. ఆరిఫ్, పింగళి రమేష్ తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి, పాఠశాల, కళాశాలలను సందర్శిస్తారన్నారు. ఆ కార్యక్రమాలలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొనాలన్నారు.
KRNL: ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన మాచాని శివ కేశవ “అత్యంత చిన్న నాటికల్ నాట్ బోర్డ్ తయారు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. ఈ సందర్భంగా ఆయన గురువు చంద్రశేఖర్తో కలిసి ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డిని కలిశారు. ఆదివారం ఎమ్మెల్యే శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. యువతకు స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు.
PPM: అర్జీల వివరాలు మీ కోసం వెబ్సైట్లో నమోదు చేయవచ్చని జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. సమర్పించిన అర్జీల స్థాయిని 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించడం జరుగుతుందన్నారు.
NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తి జి.ప.ఉ. పాఠశాలకు విద్యార్థుల సౌకర్యార్థం క్యూరియా గ్లోబల్ సంస్థ రూ.2.25 లక్షల విలువైన 11 టేబుళ్లు, 10 కుర్చీలు, 10 ర్యాక్లను ఆదివారం అందజేసింది. ఈ పాఠశాల పూర్వ విద్యార్థి, క్యూరియా సైంటిస్ట్ డా. ఆవుల రాఘవేందర్ చొరవతో సీఎస్ఆర్ నిధుల ద్వారా ఈ సహాయం అందింది. కంపెనీ బృందానికి, రాఘవేందర్కు హెచ్ఎం కృతజ్ఞతలు తెలిపారు.
WNP: వనపర్తి నియోజకవర్గం కన్మనూరు గ్రామానికి చెందిన మీనిగ బాలయ్య నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై కాలు విరిగిపోయింది.ఆదివారం కన్మనూరు గ్రామానికి వెళ్లిన వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న బాలయ్యను పరామర్శించి ఆరోగ్య విషయాలు తెలుసుకున్నారు. ఇబ్బంది ఏమీ లేదని తనకు భరోసాగా నేనుంటానని ఎమ్మెల్యే బాధితుడికి ధైర్యం చెప్పారు.
NZB: ఆర్మూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ హైయర్ సెకండరీ స్కూల్ (బాలుర)లో 1975 -76లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 50 సంవత్సరాల తర్వాత ఆత్మీయ సమ్మేళనంలో కలిశారు. పట్టణంలో గోల్డెన్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. 50 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులందరూ ఒకే చోట కలిసి పాత రోజుల్లో జరిగిన విద్యాభ్యాసం గురించి చర్చించుకున్నారు.
TG: ములుగు జిల్లాలోని దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా భూసేకరణ కోసం జూన్ 2వ తేదీలోపు రూ. 600 కోట్లు మంజూరు చేస్తామని CM రేవంత్ రెడ్డి చెప్పారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలలోపు అన్ని అంచనాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని ప్రాజెక్టుల భూసేకరణ కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేసి.. భూములు కోల్పోయిన వారికి గ్రీన్ ఛానెల్లో నిధులు మంజూరు చేస్తామన్నారు.
విశాఖ సాగర్నగర్లోని ఇస్కార్ మందిరంలో ఆదివారం “హరే కృష్ణ, హరే రామ” నామస్మరణతో భక్తి వాతావరణం నెలకొంది. వారాంతపు ప్రత్యేక పూజల సందర్భంగా ఇస్కాన్ అధ్యక్షులు సాంబాదాస్ ప్రభూజీ, మాతాజీ నితాయి సేవిని భగవద్గీత శ్లోకాలతో పాటు ఆధ్యాత్మిక ప్రవచనాలు అందించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణులు, సుభద్రా దేవి, బలభద్రుడు, జగన్నాథుడు, సీతారాములను అలంకరించారు.
NRKL: ఉప్పునుంతల మండల కేంద్రంలో ఆదివారం బీరప్ప స్వామి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. డప్పు వాయిద్యాల మధ్య మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలతో ఊరేగి స్వామివారికి మొక్కులు చెల్లించారు. ప్రధాన రహదారులన్నీ భక్తులతో కిటకిటలాడగా, గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేసారు.
MHBD: గార్ల మండలం పూమ్యతండాలో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. తండాకు చెందిన గూగులోత్ రవి (32) భార్యతో గొడవపడి, మనస్తాపంతో ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని మార్చురికి దర్యాప్తు చేపట్టారు.
కోనసీమ: రాజోలు నియోజకవర్గంలో 30 వేల జనసేన సభ్యత్వాలే లక్ష్యంగా పనిచేయాలని MLA దేవ వరప్రసాద్ సూచించారు. విశ్వేశ్వరాయపురం క్యాంపు కార్యాలయంలో ఆదివారం పార్టీ సభ్యత్వ నమోదుపై సమావేశం నిర్వహించారు. సభ్యత్వం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని, ఈ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
PDPL: జూలపల్లి మండలం తేలుకుంట గ్రామంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం, శివాలయంలో ఎమ్మెల్యే విజయ రమణారావు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవం, శివాలయంలో కలశ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్ సంపత్, పార్టీ నాయకులు ఎమ్మెల్యేను సత్కరించారు.