VKB: తాండూరు పట్టణ సమీపంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఆ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్తో కలిసి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణాలు పూర్తయి చాలా రోజుల నుంచి ఖాళీగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను త్వరలో లబ్ధిదారకు అందజేయున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్తో కలిసి ఎమ్మెల్యే లబ్ధిదారులను త్వరలో ఎంపిక చేయనున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లడించారు.
KMM: ప్రయత్నమే విజయానికి మార్గమని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. తెలంగాణను క్రీడల హబ్గా మార్చే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా సీఎం కప్ – 2025-2026ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం ఆవరణలో నిర్వహించారు. ఈ రాష్ట్రస్థాయి అర్చేరీ క్రీడ పోటీలను పోలీస్ కమిషనర్ ప్రారంభించారు.
NGKL: చారకొండ మండలంలోని ఎర్రవల్లి గ్రామంలో ఎర్రవల్లి గోకారం రిజర్వాయర్ లో ముంపునకు గురి అవ్వద్దని చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారంతో 81 రోజులకు చేరుకున్నాయి. అలాగే R&R ప్యాకేజీ ప్రాథమిక నోటిఫికేషన్ ను రద్దు చేయాలని ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులు మా భూములు మాకు కావాలని, మా ఇండ్లు ముంపునకు గురి కాకుండా కాపాడాలని కోరారు.
HYD: అమీర్పేట్లో నీలగిరి భవన్లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మంటలను అదుపుచేసేందుకు ఫైర్ ఇంజిన్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అటువైపుగా వెళ్లే వాహనాలను ట్రాఫిక్ పోలీసులు మళ్లించారు. మైత్రివనం జంక్షన్ నుంచి సత్యం థియేటర్ రోడ్డుకు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్ అయింది. అటువైపుకి వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని పోలీసులు సూచించారు.
ATP: గుత్తి పట్టణ శివారులో శుక్రవారం రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. బసీనేపల్లి గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి పని నిమిత్తం గుత్తికి బైక్ మీద వచ్చాడు. బైక్ అదుపుతప్పి కింద పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
SKLM: సామాజిక న్యాయం పటిష్టంగా అమలు చేయాలంటూ శ్రీకాకుళం అంబేద్కర్ జంక్షన్ వద్ద సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. సంపద పంపిణీలో అందరికీ సమానంగా జరగాలని జిల్లా పార్టీ నాయకులు తిరుపతిరావు అన్నారు. కార్మికులకు పనిగంటలు తగ్గించి తగిన వేతనాన్ని చెల్లించాలన్నారు. సంఘాల నాయకులు పాల్గొన్నారు.
HNK: గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రజలు సహకరించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. గ్రేటర్ వరంగల్ 45వ డివిజన్ తరాలపల్లి గ్రామంలో పోచమ్మ తల్లి ఆలయ పునర్ నిర్మాణం, ముదిరాజ్ సంఘ భవన నిర్మాణానికి నేడు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. తరాలపల్లి అభివృద్ధికి సహకరిస్తానని, ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే అన్నారు.
CTR: పుంగనూరు పట్టణంలోని చంద్రకాంత్ వీధిలో యూరియా కోసం ఎండను సైతం లెక్కచేయకుండా క్యూలైన్లో రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఒక్క రైతుకు ఒక్క బస్తా యూరియా కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు యూరియా కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్నారు. అధికారులు సకాలంలో రైతులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.
KNR: జమ్మికుంట మార్కెట్కు శనివారం వారాంతపు సెలవు, ఆదివారం సాధారణ సెలవు ఉంటుందని, తిరిగి సోమవారం మార్కెట్ ప్రారంభం అవుతుందని ఉన్నత శ్రేణి కార్య దర్శి రాజా తెలిపారు. శుక్రవారం మార్కెట్కు రైతులు 44 వాహనాల్లో 368 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి తీసుకురాగా.. గరిష్ఠంగా రూ.7,500, కనిష్ఠంగా రూ. 6,300ల ధర పలికింది. పత్తి ధర నిన్నటి కంటే రూ. 50 తగ్గింది.
విజయనగరానికి చెందిన తెలికిచెర్ల శ్రీతోద్భవ్ షిల్లాంగ్లో ఈ నెల 23 నుండి 27 వరకు జరిగే ఇస్రో NSSS 2026 అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశాలలో పాల్గొనున్నారు. తాను రాసిన పరిశోధనాత్మక వ్యాసం ” సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ త్రూ కాస్మిక్ లైఫ్ విసబిలిటీ మెట్రిక్” అనే అంశంపై ఇస్రో, పలువురు అంతర్జాతీయ, అంతరిక్ష పరిశోధకులకు వివరించబోతున్నారు.
సిద్దిపేట పట్టణంలోని 37వ వార్డులో BRS పార్టీ కార్యాలయాన్ని మాజీ మంత్రి హరీష్ రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రజలకిచ్చిన హామీలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ బడ్జెట్నైనా వాస్తవాల ఆధారంగా రూపొందించి హామీలన్నీ నెరవేర్చాలని చెప్పుకొచ్చారు.
RR: చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మున్సిపల్ నూతన ఛైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ను మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ వెంకట్రాంరెడ్డి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. మున్సిపల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని ప్రవీణ్ కుమార్ తెలిపారు.
WGL: నెక్కొండ (M) కేంద్రంలోని పత్తిపాక తండాకు చెందిన బి రజిత–లక్ష్మణ్ దంపతులు నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని MLA దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు. నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన ఆయన, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేరిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత 10 సం,రాలు అధికారంలో ఉన్న BRS ప్రభుత్వం ఇళ్లు ఇవ్వలేదని అన్నారు.
NZB: రాజంపేటలో 157వ బూత్ బీజేపీ అధ్యక్షుడు జూకంటి రాజిరెడ్డి తండ్రి, సోదరుడు ఇటీవల అకాల మరణం చెందడంతో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. అకాల మరణం చెందడం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసి, వారి కుటుంబానికి అండగా ఉంటామని, ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఆయనతో బాటు మున్సిపల్ కౌన్సిలర్లు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
VZM: జిల్లా పంచాయతీ అధికారి డి. వి.మల్లిఖార్జున శుక్రవారం కొత్తవలస మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. స్వర్ణ పంచాయతీ ఇంటి పన్నుల బకాయిలు 2025, 26 వరకు సంబంధించి రూ 1.48 లక్షలు రావాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ 65 లక్షలు వసూలు చేసినట్లు ఆయన తెలిపారు. పంచాయతీ షాపుల అద్దెలు బకాయిలు ఉన్నాయని, త్వరలో వసూలుకు చర్యలు చేపడతామన్నారు. ఈఓపీఆర్డీ ఉన్నారు.