SKLM: 2022-2026 వరకు ఆమదాలవలస పోలీసులు పట్టుకున్న అక్రమ మద్యాన్ని మంగళవారం ఎక్సైజ్ శాఖ DSP పి.రామచంద్ర కుమార్, ఆమదాలవలస ఎస్సై బాలరాజు సమక్షంలో మొత్తం 760 మద్యం సీసాలను ధ్వంసం చేశారు. వీటి విలువ సుమారు రూ.1లక్షగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
AP: బ్రిటీష్ పాలనలో కూడా వేంకటేశ్వరస్వామి జోలికి వెళ్లలేదని సీఎం చంద్రబాబు అన్నారు. 2019-24 మధ్య 20 కోట్ల కల్తీ లడ్డూలు తయారు చేశారని తెలిపారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సీబీఐ సిట్ విచారణ కొనసాగిందన్నారు. సిట్ నివేదిక ప్రకారం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశామని, కమిషన్ను అడ్డుకోవడానికి కూడా పిటిషన్ వేశారని చెప్పారు. సుప్రీం ఆ పిటిషన్ను కొట్టివేసిందన్నారు.
E.G: రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ పనిచేయట్లేదని, పూర్తిగా ఫెయిల్ అయిందని EX మంత్రి విడుదల రజిని విమర్శించారు. కల్తీ మాటలతో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిందని మండిపడ్డారు. రాజమండ్రిలో కల్తీ పాలు స్వీకరించి అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంగళవారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలన్నారు.
బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే నిపుణులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 116 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రెగ్యులర్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ నియామకాలు జరగనున్నాయి. అర్హులైన వారు మార్చి 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కృష్ణా: ఘంటసాల మండలం పూషడం నుంచి మల్లాయి చిట్టూరు ప్రధాన రహదారి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కృషితో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉపాధి పథకం నిధులతో నూతన రోడ్డు నిర్మాణం చేపట్టారు. జరుగుతున్న పనులను పంచాయతీరాజ్ శాఖ డీఈఈ పగడాల సురేష్, సర్పంచ్ ఆవుల రేవతి, టీసీ అధ్యక్షులు నరసయ్య పరిశీలించారు.
HYD: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ నేడు కాచిగూడ రైల్వే స్టేషన్ను అధికారులతో కలిసి పరిశీలించారు. స్టేషన్ అభివృద్ధి ప్రణాళికలపై సమీక్షించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ డివిజన్ డీఆర్ఎమ్ సంతోష్ కుమార్ వర్మ జనరల్ మేనేజర్కు తోడుగా ఉన్నారు. ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదలపై అధికారులు చర్చించారు.
ప్రకాశం: ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించాలనే లక్ష్యంతో పొన్నలూరులో ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పరీక్షల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో పోలీస్ అధికారులు సిబ్బందిని నియమించారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా చర్యలు తీసుకున్నామన్నారు.
NZB: ముబారక్ నగర్ కాంప్లెక్స్ పరిధిలో మంగళవారం నిజామాబాద్ గ్రామీణ మండలాల తెలుగు ఉపాధ్యాయులు రూపొందించిన బోధన అభ్యసన సామాగ్రి (TLM) ప్రదర్శన నిర్వహించారు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు హన్మంత్ రావు మాట్లాడుతూ.. విద్యార్థులకు పాఠ్యాంశాలు సులభంగా అర్థం కావడానికి టీఎల్ఎం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.
అనంతపురం జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు జిల్లా పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు మంగళవారం అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష సమయాల్లో కేంద్రాల సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
తిరుపతి రూరల్ నూతన ఎంపీడీవోగా మస్తాన్ వలి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అధికారులు, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. మస్తాన్ వలి మాట్లాడుతూ.. మండల అభివృద్ధి, ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరేలా పనిచేస్తానన్నారు.
చిత్తూరు: పుంగనూరు పట్టణంలోని శ్రీవిరుపాక్షి మారెమ్మ ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఉదయాన్నే అమ్మవారి మూలవర్లను పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. ఆ తర్వాత పసుపు, కుంకుమ, కాటుకతో అమ్మవారిని నిజరూపంలో అలంకరించారు.
ELR: గణపవరం మండలం సరిపల్లి గ్రామంలో శ్రీ పార్వతి సమేత రాజరాజేశ్వరి స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ధ్వజస్తంభం పునః ప్రతిష్ట సందర్భంగా మంగళవారం క్రొవ్విడి వంశీలు ఆధ్వర్యంలో పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. పలు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
KMM: ఖమ్మం వెలుగుమట్ల పరిధిలో ఉన్న 60 ఎకరాల భూదాన్ భూముల్లో పదేళ్లుగా నివసిస్తున్న సుమారు 600 పేద కుటుంబాలపై వేలాది మంది పోలీసులతో దాడి చేసిన ఘటనపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీబీల సహాయంతో గుడిసెలను కూల్చివేయడం అమానుషం, అతిక్రూరంగా ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచే చర్య అని అన్నారు.
కోనసీమ: రాజోలు నియోజకవర్గం వైసీపీ పార్టీ కొత్త కో ఆర్డినేటర్ను నియమించనున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతుంది. ప్రస్తుత కో ఆర్డినేటర్ గా ఉన్న గొల్లపల్లి సూర్యారావు అనారోగ్యం కారణంగా తీసుకుంటున్న సందర్భంలో ఈ మార్పు అనివార్యమైందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి పేరు ప్రముఖంగా వినిపిస్తుందని అంటున్నారు.
AP: తిరుమల శ్రీవారికి ప్రతి ఒక్కరూ తమ కష్టాన్ని చెప్పుకుంటారని సీఎం చంద్రబాబు అన్నారు. YCP హయాంలో దేవాలయాలపై దాడులు చేశారని ప్రశ్నిస్తే కేసులు పెట్టారని గుర్తుచేశారు. రాముడి విగ్రహం తలతీశారని ప్రశ్నిస్తే కూడా కేసు పెట్టారన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే తిరుమల ప్రక్షాళనకు ఈవోను నియమించామని తెలిపారు. వెంకన్నను ప్రార్థించడం వల్లే ఇన్నేళ్లుగా పనిచేస్తున్నానని పేర్కొన్నారు.