మహిళల ఆరోగ్యానికి నానబెట్టిన నల్ల కిస్మిస్ అద్భుత ఔషధమని నిపుణులు చెబుతున్నారు. వీటిని రోజూ తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గి, హార్మోన్ల ఉత్పత్తి బ్యాలన్స్ అవుతుంది. ముఖ్యంగా పీరియడ్స్, ప్రెగ్నెన్సీ సమయంలో ఇది ఎంతో మేలు చేస్తుంది. ఎముకలు దృఢంగా మారడమే కాక, చర్మంపై ముడతలు రాకుండా యవ్వనంగా ఉంచుతుంది. అయితే రాత్రి 6-10 ద్రాక్షలను నానబెట్టి, ఉదయాన్నే పరగడుపున తింటే మంచిది.
VZM: బొబ్బిలి మండలం చిత్రకోట బొడ్డవలస వద్ద ఉన్న బౌద్ధమత ఆనవాళ్లను వెలికి తీయాలని ఎమ్మెల్యే బేబినాయన ప్రభుత్వాన్ని కోరారు. చిత్రకోటబొడ్డవలస పేరు చిత్రకోటబౌద్ధవలస అని, ఆ ప్రాంతంలో పూర్వం బౌద్ధులు నివాసం ఉండేవారన్నారు. బౌద్ధులు ఆనవాళ్లను వెలికి తీసి భద్ర పరచాలని కోరగా మంత్రి దుర్గేశ్ సానుకూలంగా స్పందించారు.
RR: రాష్ట్రంలోని ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి నాలుగో తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడాధికారి వెంకటేశ్వర్ రావు తెలిపారు. మార్చి 28 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు LBనగర్ ఇండోర్ స్టేడియంలో జిల్లాస్థాయి ఎంపికలు ఉంటాయన్నారు. ఈనెల 26 నుంచి మార్చి 4వ తేదీ వరకు ONLINEలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు.
డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ మరోసారి ‘ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్’ ఫైనల్కు దూసుకెళ్లింది. సెమీస్లో శ్రీలంక విసిరిన 119 రన్స్ లక్ష్యాన్ని మన అమ్మాయిలు 13.3 ఓవర్లలోనే ఛేదించారు. దినేష్ వృంద 42, అనుష్క శర్మ 27 పరుగులతో రాణించగా.. కెప్టెన్ రాధా యాదవ్ 4 వికెట్లు, 28 పరుగులతో ఆల్రౌండ్ ప్రదర్శన చేసి జట్టు తుదిపోరుకు చేరడంలో కీలక పాత్ర పోషించింది.
BDK: టేకులపల్లి సర్పంచ్ బోడ బాలు శుక్రవారం స్థానిక గ్రంధాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గ్రంథాలయంలోని సౌకర్యాలు పరిసరాలు పరిశీలించారు. పుస్తకాల వివరాలను గ్రంథ పాలకులను అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానని వారికి సర్పంచ్ హామీ ఇచ్చారు. వారితోపాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
RR: షాద్నగర్ పట్టణంలోని 17వ వార్డులో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ గృహాన్ని కట్టుకుని నేడు లబ్ధిదారులు పండగ చేసుకుంటున్నారని, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ గృహాలను నిరుపేదలకు అందజేస్తుందని పేర్కొన్నారు.
MP బుర్హాన్పూర్లో 10వ తరగతి ఇంగ్లీష్ పరీక్ష జరుగుతుండగా, ఓ టీచర్ ఏకంగా ప్రశ్నపత్రాన్ని తన వాట్సాప్ స్టేటస్లో పెట్టింది. విద్యార్థులు కాపీ కొట్టేందుకు ఆమె ఈ పని చేసినట్లు తేలింది. దీనిపై సీరియస్ అయిన అధికారులు ఆ ఉపాధ్యాయురాలితో పాటు పరీక్షా కేంద్రం సూపరింటెండెంట్, అసిస్టెంట్ సూపరింటెండెంట్లను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
E.G: ఈ నెల 22వ తేదీన రాజమండ్రి హ్యాపీ స్ట్రీట్ వద్ద 5కే రన్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతూ ప్రముఖ టాలీవుడ్ నటులు భద్రం స్థానిక వెంకటేశ్వరనగర్ పార్క్, హ్యాపీ స్ట్రీట్, ఆర్ట్స్ కళాశాల మైదానంలో శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఫిట్నెస్ పెంచుకోవడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి 5కే రన్ ఉత్తమ మార్గం అన్నారు.
ASF: కాగజ్ నగర్లో ఓటరు అనుసంధానం కార్యక్రమాన్ని బూత్ లెవెల్ అధికారులు గత నెల నుంచి నిర్వహిస్తున్నప్పటికీ ఇంకా పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, ఓటర్లు సహకరించాలని MRO మధుకర్ శుక్రవారం కోరారు. తమ వారసులు నివసిస్తున్న ప్రాంతాల్లో ఉన్న ఓటరు గుర్తింపు కార్డు వివరాలు సేకరించి సంబంధిత BLOలకు అందజేయాలని ఆయన సూచించారు.
KDP: మదనపల్లెలో ఏడేళ్ల బాలికపై కులవర్ధన్ హత్యాచారం చేయడం తెలిసిందే. ఆ కేసులో నిందితుడి తల్లి అంజలి A2గా మారింది. కాగా ఆమె వెంకటేశ్వరపురం స్కూల్లో ఆయాగా పనిచేసేది. నిందితురాలిగా ఉన్న ఆమెను ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో స్కూల్ హెచ్ఎం రమణమ్మ అంజలిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలిపారు.
ELR: జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స గురువారం జరిగింది. బుట్టాయిగూడెం మండలానికి చెందిన ఓ మహిళ కడుపులో 8 కిలోల కణితి ఉన్నట్లు వైద్యుడు సంకు మురళి గుర్తించారు. ల్యాపరో స్కోప్ ద్వారా ఆపరేషన్ నిర్వహించి కణితి తొలగించామన్నారు. కడుపు నొప్పితో సదరు మహిళా ఆసుపత్రికి వచ్చిందని, ఆపరేషన్ అనంతరం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
BDK: మణుగూరు మండలం రాజుపేట గ్రామానికి చెందిన న్యాయవాది పగిడిపల్లి సూర్యం అనారోగ్యంతో నిన్న మృతి చెందారు. శుక్రవారం విషయం తెలుసుకున్న ఉప సర్పంచ్ గాండ్ల సురేష్ సూర్యం భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
GNTR: వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని మాజీ మంత్రి అంబటి రాంబాబు తాడేపల్లి లోని ఆయన నివాసంలో కలిశారు. తనపై ప్రభుత్వం నమోదు చేసిన కేసులు, ఇంటిపై జరిగిన దాడి, పోలీసుల నిర్లిప్త వైఖరి వంటి అంశాలను అంబటి రాంబాబు జగన్కు వివరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జగన్ భరోసా ఇచ్చినట్లు సమాచారం.
ASR: పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిణి, ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ వారం రోజుల పాటు సెలవుపై వెళ్లనున్నారు. ఇటీవల ఐఏఎస్ అధికారి ఆదిత్య వర్మను, పీవో శ్రీపూజ విశాఖ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 24న వివాహ వేడుక జరుపుకోనున్నారు. ఈ మేరకు ఈ నెల 21 నుంచి 28 వరకు పీవో సెలవుపై వెళ్లనున్నారు.
శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ B.Ed మొదటి సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారి డాక్టర్ ఎస్. ఉదయ్ భాస్కర్ విడుదల చేశారు. కాగా ఈ పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరగాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా వేశారు. దీనితో కొత్త తేదీలను ప్రకటించారు. ఈనెల 24 నుంచి మార్చి 2వ తేదీ వరకు జరుగుతాయి.