• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అందరికీ కనెక్ట్‌ అయ్యే సినిమా ఇది: శ్రీవిష్ణు

శ్రీవిష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘విష్ణు విన్యాసం’ ఈనెల 28న విడుదల కానుంది. తాజాగా జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుందని, అందరినీ అలరిస్తుందని అన్నాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ యువతకు బాగా నచ్చుతుందని, థియేటర్లలో అందరూ హాయిగా నవ్వుకుంటారని ధీమా వ్యక్తం చేశాడు.

February 19, 2026 / 09:56 AM IST

అంబటి రాంబాబు వర్సెస్ పోలీసులు

AP: విజయవాడ నుంచి మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు బయలుదేరారు. ఆయన బయలుదేరే ముందు పోలీసులు నోటీసులు ఇచ్చి సంతకం చేయించుకున్నారు. నోటీసులు ఇవ్వడంపై అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వడం సరికాదని, సంఘీభావం తెలిపేందుకు కార్యకర్తలు వస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో తమకు సంఘీభావం తెలపకుడదా? 18 రోజుల తర్వాత ఇంటికి వెళ్తుంటే నిర్బంధాలు ఏంటని మండిపడ్డారు.

February 19, 2026 / 09:54 AM IST

అంబటి రాంబాబు వర్సెస్ పోలీసులు

AP: విజయవాడ నుంచి మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు బయలుదేరారు. ఆయన బయలుదేరే ముందు పోలీసులు నోటీసులు ఇచ్చి సంతకం చేయించుకున్నారు. నోటీసులు ఇవ్వడంపై అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వడం సరికాదని, సంఘీభావం తెలిపేందుకు కార్యకర్తలు వస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో తమకు సంఘీభావం తెలపకుడదా? 18 రోజుల తర్వాత ఇంటికి వెళ్తుంటే నిర్బంధాలు ఏంటని మండిపడ్డారు.

February 19, 2026 / 09:54 AM IST

గోరింకలపల్లిలో గ్రామ సంఘం భవనానికి శంకుస్థాపన

NLG: నకరేకల్ మండలం గోరింకలపల్లి గ్రామంలో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న గ్రామ సంఘం భవనానికి ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులను ప్రారంబించారు.

February 19, 2026 / 09:52 AM IST

గోరింకలపల్లిలో గ్రామ సంఘం భవనానికి శంకుస్థాపన

NLG: నకరేకల్ మండలం గోరింకలపల్లి గ్రామంలో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న గ్రామ సంఘం భవనానికి ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులను ప్రారంబించారు.

February 19, 2026 / 09:52 AM IST

గణేష్ పల్లెలో చత్రపతి శివాజీ జయంతి

BHPL: గణేష్ పల్లిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి స్థానిక ఆరే కుల సంక్షేమ సంఘం నేతలు, గ్రామస్థులు నివాళులర్పించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చూపిన బాటలో ప్రతి ఒక్కరు నడుస్తూ వారి ఆశయ సాధనకు కృషి చేయాలని జిల్లా నాయకులు తిప్పారపు బాపూరావు, మాజీ సర్పంచ్ తిప్పారపు యుగంధర్ అన్నారు.

February 19, 2026 / 09:51 AM IST

గణేష్ పల్లెలో చత్రపతి శివాజీ జయంతి

BHPL: గణేష్ పల్లిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి స్థానిక ఆరే కుల సంక్షేమ సంఘం నేతలు, గ్రామస్థులు నివాళులర్పించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చూపిన బాటలో ప్రతి ఒక్కరు నడుస్తూ వారి ఆశయ సాధనకు కృషి చేయాలని జిల్లా నాయకులు తిప్పారపు బాపూరావు, మాజీ సర్పంచ్ తిప్పారపు యుగంధర్ అన్నారు.

February 19, 2026 / 09:51 AM IST

జిల్లాలో రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం

CTR: జిల్లాలో ముస్లింలు ఇవాళ ఉదయం నుంచి రంజాన్ మాస ఉపవాస దీక్షలు ప్రారంభించారు. నిన్న సాయంత్రం నెలవంక కనిపించడంతో ఉపవాస దీక్షలు ప్రారంభిస్తున్నట్లు మత పెద్దలు వెల్లడించారు. నెల రోజులపాటు కఠోర దీక్షలు చేపట్టనున్నారు. మసీదుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీక్షలు నిర్వహించే వారి కోసం గంట ముందే వెళ్లేలా ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.

February 19, 2026 / 09:37 AM IST

ప్రభుత్వ కళాశాలలో ప్రవేశం పొందాలి: కలెక్టర్

BDK: పేద విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల్లో చేరి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు పొందాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. జిల్లాలోని ప్రతి పదో తరగతి విద్యార్థులు సమీప ప్రభుత్వ జూనియర్ కళాశాలతో అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించారు. అందుబాటులో కోర్సులు, సౌకర్యాల వివరాలతో కరపత్రాలు పంపిణీ చేయాలని సూచించారు.

February 19, 2026 / 09:25 AM IST

ప్రభుత్వ కళాశాలలో ప్రవేశం పొందాలి: కలెక్టర్

BDK: పేద విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల్లో చేరి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు పొందాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. జిల్లాలోని ప్రతి పదో తరగతి విద్యార్థులు సమీప ప్రభుత్వ జూనియర్ కళాశాలతో అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించారు. అందుబాటులో కోర్సులు, సౌకర్యాల వివరాలతో కరపత్రాలు పంపిణీ చేయాలని సూచించారు.

February 19, 2026 / 09:25 AM IST

‘ప్రభుత్వ పథకాలకు రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి’

SRPT: మునగాల రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్‌ను వెంటనే పూర్తి చేసుకోవాలి మునగాల AO రాజు గురువారం ఒక ప్రకటనలో సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే పీఎం కిసాన్, పంట బీమా, ఇతర ప్రభుత్వ రాయితీలు అందుతాయని ఆయన స్పష్టం చేశారు. రైతులు తమ క్షస్టర్ ఏఈవోలను సంప్రదించి ఈ ప్రక్రియను త్వరగా ముగించాలని రైతులను కోరారు.

February 19, 2026 / 09:25 AM IST

‘ప్రభుత్వ పథకాలకు రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి’

SRPT: మునగాల రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్‌ను వెంటనే పూర్తి చేసుకోవాలి మునగాల AO రాజు గురువారం ఒక ప్రకటనలో సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే పీఎం కిసాన్, పంట బీమా, ఇతర ప్రభుత్వ రాయితీలు అందుతాయని ఆయన స్పష్టం చేశారు. రైతులు తమ క్షస్టర్ ఏఈవోలను సంప్రదించి ఈ ప్రక్రియను త్వరగా ముగించాలని రైతులను కోరారు.

February 19, 2026 / 09:25 AM IST

నగరంలో రంజాన్ శోభ ప్రారంభం

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రంజాన్ శోభ సంతరించింది. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభంతో ముస్లింలు ఉపవాస దీక్షలు ప్రారంభించారు. మసీదులను విద్యుదీపాలతో అలంకరించి, నెల రోజులపాటు తరావీ నమాజ్లు నిర్వహించనున్నారు. ముస్లిం ఉద్యోగులకు పనివేళల్లో వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

February 19, 2026 / 09:07 AM IST

నగరంలో రంజాన్ శోభ ప్రారంభం

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రంజాన్ శోభ సంతరించింది. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభంతో ముస్లింలు ఉపవాస దీక్షలు ప్రారంభించారు. మసీదులను విద్యుదీపాలతో అలంకరించి, నెల రోజులపాటు తరావీ నమాజ్లు నిర్వహించనున్నారు. ముస్లిం ఉద్యోగులకు పనివేళల్లో వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

February 19, 2026 / 09:07 AM IST

వరకట్న వేధింపులు.. భర్తకు జైలు శిక్ష

తిరుపతి మహిళా పోలీస్ స్టేషన్‌లో నమోదైన వరకట్న వేధింపుల కేసులో భర్తకు 6 నెలల జైలుశిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ తిరుపతి నాలుగో అదనపు మున్సిపల్ కోర్టు తీర్పు ఇచ్చింది. 2013లో వివాహం తర్వాత వేధింపులు పెరగడంతో బాధితురాలు 2018లో ఫిర్యాదు చేయగా, దర్యాప్తులో ఆరోపణలు నిరూపితమవడంతో నిన్న కోర్టు తీర్పునిచింది.

February 19, 2026 / 09:02 AM IST