E.G: తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని కడియంకు చెందిన రాష్ట్ర వైసీపీ కార్యదర్శి గిరజాల బాబు గురువారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనకు అప్ప చెప్పిన పార్టీ యొక్క బాధ్యతలు, పరిస్థితులు జగన్తో చర్చించారు. ప్రజా సమస్యల కొరకు పోరాడుతూ, కార్యకర్తలకు అండదండలు అందించాలని సూచించారు.
MHBD: నెల్లికుదురు మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి శివారు ఆకేరు వాగు నుంచి అక్రమంగా తరలిస్తున్న 3 ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసి, నలుగురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై చిర్రా రమేష్ బాబు తెలిపారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక తరలించినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
VZM: దేశపాత్రునిపాలెం వద్ద ఈనెల 2న రాత్రి గోకాడ పద్మ మృతికి కారణమైన కారును సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించామని కొత్తవలస సీఐ షణ్ముఖరావు గురువారం తెలిపారు. రాత్రి 10 గంటల సమయంలో పాలకేంద్రం మూసేసి ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె ఘటనా స్థలంలో మృతి చెందారు. ఏ.ఎస్.ఆర్. జిల్లాకు చెందిన కారు యాజమానిపై కేసు నమోదు చేశామన్నారు.
ASF: అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనాన్ని జైనూర్ పోలీసులు పట్టుకున్నారు. జైనూర్ నుంచి పశువులను అక్రమ రవాణా చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు జామ్ గాం వద్ద పోలీసులు తనిఖీలు చేసి పశువులను తరలిస్తున్న ఐచర్ వ్యాన్ను పట్టుకున్నారు. ఈ దాడిలో 23 పశువులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రవి తెలిపారు. పశువులను తరలిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేసి నట్లు పేర్కొన్నారు.
ELR: జిల్లా కామవరపుకోట గ్రామంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణంలో స్టాక్ నిల్వలను పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన ఇతరులకు మద్యాన్ని విక్రయించాలని సూచించారు. అధిక ధరలకు మద్యాన్ని విక్రయించకూడదని పేర్కొన్నారు.
కృష్ణా: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించడం, అక్రమ రవాణా,అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గుడివాడలో వన్ టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్ నిన్న వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అన్ని వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్.సీ (RC), పొల్యూషన్, ఇన్షూరెన్స్ వంటి కీలక పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. హెల్మెట్ ధరించని వాహనదారులపై చలాన్లు విధించారు.
TG: ఎన్నికల జాబితాల పరిశుభ్రతను కాపాడడం EROల బాధ్యత అని CEC సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాల్లో చేర్చడంతో పాటు, అనర్హుల పేర్లను చట్టబద్ధంగా తొలగించాల్సిన అవసరం ఉందని సూచించారు. మేడ్చల్, సంగారెడ్డి, రంగారెడ్డి, HYD జిల్లాలకు చెందిన మొత్తం 50 మంది EROలకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే త్వరలో చేపట్టనున్న SIRపై చర్చించారు.
GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గత నవంబర్లో జరిగిన బీ.ఆర్కిటెక్చర్ (5/5, 2వ సెమిస్టర్) సప్లమెంటరీ పరీక్షల ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఫలితాలను గురువారం పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు వెల్లడించారు. విద్యార్థులు తమ ఫలితాలను వర్సిటీ వెబ్సైట్లో చూసుకోవచ్చని, రీవాల్యుయేషన్ కోసం ఈ నెల 27వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
MHBD: జిల్లా గంగారాం మండలం వెంకమ్మగుంపు గ్రామానికి చెందిన క్రీడాకారులకు శుక్రవారం ఉదయం యువ ఫౌండేషన్ సభ్యులు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ.. మారుమూల ఏజెన్సీగుడాలలో మంచి క్రీడానైపుణ్యం కలిగిన యువకులు ఉన్నారని, వారిని ప్రోత్సహించిన ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు. యువతతోనే ఏజెన్సీఅభివృద్ధి సాధ్యమన్నారు.
ASR: రాజవొమ్మంగి మండలం జడ్డంగి మడేరు ఆనకట్ట వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అన్నవరంలో వివాహానికి హాజరై కొండపల్లికి తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను జడ్డంగి పోలీసులు వెంటనే స్థానిక పీహెచ్సీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
SDPT: ఐటీ హాబ్ మేనేజర్ నరేందర్ గౌడ్ మహిళా అభ్యర్థులకు సువర్ణావకాశం ప్రకటించారని తెలిపారు. హైదరాబాద్ సోలార్ కంపెనీలో ఉద్యోగాల కోసం 50% మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు, హిందీ భాషలో ప్రావీణ్యం ఉన్నవారు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 20వ తేదీ వరకు https://forms.gle /AoKByEro8EvtckD67 దరఖాస్తు చేసుకోవాలన్నారు.
KKD: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ‘గ్రీవెన్స్’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. కలెక్టరేట్ ప్రజావాణి హాలులో సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లా స్థాయి అధికారులు 3:45 గంటలకే హాజరు కావాలని సూచించారు. ఉద్యోగులు తమ సర్వీసుపై సమస్యలపై వినతులు సమర్పించాలన్నారు
SRD: గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ ఇద్దరికి 20 ఏళ్లు జైలు శిక్ష, రూ.2 లక్షల చొప్పున జరిమానా విధించారు. ఈ మేరకు సంగారెడ్డి ఫస్ట్ క్లాస్ అడిషనల్ సెషన్స్ కోర్ట్ న్యాయమూర్తి జయంతి గురువారం తీర్పు వెలువరించారని అందోలు ఎక్సైజ్ స్టేషన్ సీఐ సాగర్ రెడ్డి తెలిపారు. 2020 సెప్టెంబరులో 850 కేజీల గంజాయిని జాదవ్ బన్సీలాల్, రాథోడ్ శంకర్ రవాణా చేస్తుండగా పట్టుకున్నారు.
అన్నమయ్య: పీలేరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. రామచంద్రారెడ్డి కాలనీలో ఐదేళ్ల బాలికపై అఘాయిత్యం జరిగినట్లు సమాచారం. ఘటనపై ఆగ్రహించిన స్థానికులు నిందితుడిగా భావిస్తున్న 15 ఏళ్ల బాలుడికి దేహశుద్ధి చేశారు.అనంతరం అతడు సమీప బంధువుల ఇంట్లో తలదాచుకోగా, పీలేరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన బాలుడిని చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
KMR: రాష్ట్ర ఫుడ్ కమిషన్ బృందం నేడు KMR జిల్లాలో పర్యటించనుంది. కమిషన్ ఛైర్మన్, సభ్యులు ఉ.9:30 గం.కు KMR పట్టణంలోని R&B గెస్ట్ హౌస్ కు చేరుకోనున్నారు. ఉ.10:30 గం.కు మున్సిపల్ క్యాంటిన్లో ప్రజలకు విక్రయిస్తున్న పదార్థాల ధరలను తనిఖీ చేసి,11 గం.కు ZPHS పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేయనున్నారు.12 గం.కు అంగన్వాడి సెంటర్ ను,1 గం.లకు రామారెడ్డి PHCకీ వెళ్తారు.