AP: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏడో రోజు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ క్వశ్చన్ అవర్తో శాసన మండలిలో బడ్జెట్ సెషన్స్ ప్రారంభంకానున్నాయి. 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ సెషన్లో బడ్జెట్ ప్రసంగంపై మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానాలు చెప్పనున్నారు. అనంతరం శాసనసభ ఆమోదించిన 7 బిల్లులను ప్రభుత్వం మండలిలో ప్రవేశపెట్టనుంది.
NRML: వివిధ ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన వాహనాలను శుక్రవారం వేలం వేస్తున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి రజాక్ తెలిపారు. ఈ వేలం పాట నిర్మల్లోని ఎక్సైజ్ కార్యాలయ ఆవరణలో జరుగుతుందని వెల్లడించారు. ఆసక్తి గల వారు ఉదయం 10 గంటలకు హాజరై వేలంలో పాల్గొనాలని ఆయన సూచించారు.
E.G: ఉండ్రాజవరం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో శుక్ర, శనివారాల్లో విద్యుత్ లైన్ల మరమ్మత్తుల నిమిత్తం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏపీ ఈపీడీసీఎల్ నిడదవోలు ఎస్ఈ ఎన్. నారాయణ అప్పారావు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వేలివెన్ను, కాల్దరిలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించి అధికారులకు సహకరించాలన్నారు.
KRNL: జిల్లా కలెక్టర్ ఎ. సిరి గురువారం విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు గృహ గణన చేపడుతున్నాయి. అందులో భాగంగా రాష్ట్రంలో మే 1 నుంచి 30 వరకు నెల రోజుల పాటు గృహ గణన చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసింది. ఏప్రిల్ 15 నుంచి 30 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్కు అవకాశం ఉంది.
కోనసీమ: ముంగండ ZPHS స్కూల్ 10వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో గురువారం మృతి చెందింది. మృతదేహాన్ని స్కూల్ సమీపంలోని మంచినీటి చెరువులో కనుగొన్నారు. సాయంత్రం వరకు స్కూలు ప్రాంగణంలో వాలీబాల్ ఆడిందని సహచర విద్యార్థులు తెలిపారు. ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆరా తీశారు. అనుమానం వచ్చి చెరువును పరిశీలించగా కరుణ మృతదేహం లభ్యమయింది.
ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) విజయానంద్ అధ్యక్షతన ఉన్నతాధికారులతో కీలక సమావేశం జరగనుంది. జనాభా లెక్కల సేకరణ-2027 అంశంపై జరిగే ఈ రాష్ట్రస్థాయి భేటీలో ప్రక్రియ సన్నద్ధతపై విస్తృతంగా చర్చించనున్నారు. ఈ మేరకు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు వరకు ఈ సమావేశం సాగనుంది.
AKP: బుచ్చయ్యపేట మండలం థైపురం వద్ద పోలీసులు మెరుపు దాడి చేసి భారీ పేకాట స్థావరాన్ని ఛిన్నభిన్నం చేశారు. ఈ దాడిలో 14 మందిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.5,600 నగదు, మూడు కార్లు, రెండు బైకులు, 14 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిలో 11 మంది పాత నేరస్థులని, ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలతో అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
HYD: పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ సూపరింటెండెంట్తో పాటు రంగారెడ్డి DEO కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ACB అధికారులకు చిక్కారు. CBSE గుర్తింపునకు సంబంధించి (NOC) ఇచ్చేందుకు రూ. 70 వేలు లంచం డిమాండ్ చేయగా, ఆ నగదును స్వీకరిస్తుండగా అధికారులు వారిని పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి నాంపల్లిలోని ACB కోర్టులో హాజరుపరిచారు.
MBNR: జడ్చర్ల మండలం మాచారం గ్రామంలోని తెలంగాణ గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ విజయమాధురి విద్యార్థులకు హెల్త్ చెక్ అప్ నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. విద్యార్థులు రోగాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
HNK: తెలంగాణ రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలు శుక్రవారం Jawaharlal Nehru Stadiumలో ప్రారంభమవుతున్నట్లు డీవైఎస్వో అశోక్ కుమార్ తెలిపారు. ఈ క్రీడల్లో రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి సుమారు 1,518 మంది అథ్లెటిక్స్ క్రీడాకారులు పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. పోటీల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు చెప్పారు.
KMM: పెనుబల్లి మండలంలోని నీలాద్రీశ్వరస్వామి ఆలయ మహాశివరాత్రి జాతర ఆదాయం రూ. 31,18,011 వచ్చినట్లు ఈవో రజనీకుమారి తెలిపారు. భక్తుల కానుకల ద్వారా రూ. 11.20 లక్షలు, బహిరంగ వేలం, ఇతర సేవల ద్వారా మిగిలిన ఆదాయం సమకూరింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆదాయం రూ. 3,54,245 పెరిగిందని అధికారులు వెల్లడించారు. భక్తుల తాకిడి పెరగడంతో ఆదాయం గణనీయంగా పెరిగిందని ఆమె పేర్కొన్నారు.
JN: జిల్లా తరిగొప్పుల, స్టేషన్ ఘనపూర్ మండలం పల్లగుట్టకు చెందిన విద్యార్థినులు రాష్ట్ర స్థాయి సీఎం కప్ కిక్ బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా స్థాయిలో స్వర్ణ పతకాలు సాధించిన ఈ క్రీడాకారిణులను గురువారం కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ పింకేష్ కుమార్, జీసీడీవో గౌసియా బేగం ప్రత్యేకంగా అభినందించారు.
NRPT: శివాజీ మహారాజ్ శోభాయాత్రకు పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ లింగయ్య తెలిపారు. గురువారం నారాయణపేటలో నిర్వహించిన శోభాయాత్రలో పోలీస్ బందోబస్తును పరిశీలించారు. శోభాయాత్ర జరిగే గణేష్ మార్గ్ గుండా పోలీసులను మోహరించినట్లు చెప్పారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
AKP: మునగపాకలో కాశీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ ఎస్.రాము తెలిపారు. ఈ మేరకు గురువారం ఆలయంలో పెళ్లిరాట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు కళ్యాణం, మధ్యాహ్నం అన్న సమారాధన, సాయంత్రం ఊరేగింపు ఉంటుందన్నారు.
శ్రీలంకతో జరుగుతున్న ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2026 టోర్సీ తొలి సెమీస్లో భారత్ టాస్ ఓడింది. టాస్ గెలిచిన లంక కెప్టెన్ అనుష్క సంజీవని ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. గత టోర్నీ(2023)లో ఇదే జట్ల మధ్య తొలి సెమీస్ జరగాల్సి ఉండగా.. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. గ్రూప్ దశలో రన్రేట్ ఆధారంగా భారత్ నాటి టోర్నీ ఫైనల్కు చేరింది. ఈ సారి ఏం జరుగుతుందో చూడాలి.