PPM: జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి గురువారం కలక్టరేట్లో సివిల్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యోగుల, ఉపాద్యాయుల సమస్యల పరష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఉద్యోగులకు ఏ రకమైన సమస్యలు ఉన్నా సంకోచించకుండా నేరుగా తనను సంప్రదించవచ్చని భరోసా ఇచ్చారు.
NTR: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రూ.1 కోటి 64 లక్షల వ్యయంతో నిర్మించనున్న కర్మల భవన నిర్మాణానికి ఎమ్మెల్యే బోండా ఉమా శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్థానిక ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించడమే లక్ష్యంగా ఈ భవన నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
KDP: ప్రొద్దుటూరు నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ విశ్వనాథ్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత వాతావరణానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మహిళా భద్రత, గంజా నిర్మూలన, రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్ల కదలికలపై నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
ATP: రైలు ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో కదిరిదేవరపల్లి – తిరుపతి ప్యాసింజర్ రైలు కళ్యాణదుర్గం స్టేషన్ సమీపంలో నిలిచిపోయింది. గురువారం కదిరిదేవరపల్లి నుంచి బయల్దేరిన ఈ రైలులో కొద్దిదూరం వెళ్ళాక సమస్య ఏర్పడటంతో, సిబ్బంది తాత్కాలిక మరమ్మతులు చేసి కళ్యాణదుర్గం స్టేషన్కు చేర్చారు. దీంతో గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
TG: ఎప్సెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. తొలిరోజే ఇంజినీరింగ్ విభాగానికి 1,950 మంది, అగ్రికల్చర్కు 1,430, రెండింటికి కలిపి ఐదుగురు.. మొత్తంగా 3,385 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదట వచ్చిన దరఖాస్తుల ఆధారంగా పరీక్షా కేంద్రాలను కేటాయిస్తామని ఎప్సెట్ కన్వీనర్ ఆచార్య విజయకుమార్ రెడ్డి వెల్లడించారు. విద్యార్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అన్నమయ్య: రైల్వేకోడూరులోని బోటుమీదపల్లె రైల్వే ట్రాక్ సమీపంలో నిన్న దేశయ్యపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గత 15 రోజులుగా ఓబులవారిపల్లె, కోడూరు మండల పరిసర గ్రామాల్లో రెండు ఎలుగుబంట్లు ప్రజలపై దాడులు చేస్తున్నాయి. గ్రామస్తులు అటవీశాఖ చర్యలు తీసుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
SRD: జిల్లా రంజాన్ మాసంలో ప్రపంచంలోని ప్రతి ముస్లీం ఐదు ప్రాతమిక విధులను తప్పనిసరిగా నిర్వహించాలని ఇమామ్ నయ్యర్ అజాం అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఇమాన్, నమాజ్, జకాత్, రోజా, హజ్ అనే విధులను విధిగా నిర్వహించాలి. ఇమాన్ భగవంతుడైన అల్లాహ్పై పూర్తిగా విశ్వాసం ఉంచాలని, నమాజ్, ఎనిమిదేళ్లు దాటిన వారు విధిగా 5 సార్లు నమాజ్ చేయాలని తెలిపారు.
SS: గోరంట్ల పోలీస్ స్టేషన్ను అడిషనల్ ఎస్పీ అంకిత సురాన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, లాకప్ గది, మహిళా హెల్ప్డెస్క్ను పరిశీలించి కేసుల పురోగతిపై ఆరా తీశారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, నేరాల నియంత్రణకు రాత్రి బీట్లు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఎస్సైలు రామచంద్ర, ఉమాదేవి, సిబ్బంది పాల్గొన్నారు.
KMM: మధిర బోడెపుడి భవన్లో సీపీఎం పార్టీ డివిజన్ కమిటీ సమావేశం గురువారం జరిగింది. సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు పాల్గొని మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను ప్రజలు నమ్మి స్థానిక సంస్థల ఎన్నికలలో మంచి విజయాన్ని అందించిందన్నారు. ప్రజల నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వమ్ము చేయొద్దని హితవు పలికారు.
TPT: పుత్తూరు ప్రాంతానికి చెందిన ఓ బాలికను తిరుపతికి చెందిన యువకుడు యూసఫ్ (23) మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అఘయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ శేఖర్ రెడ్డి తెలిపారు. గురువారం యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
KDP: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఈ ఏడాది ఏప్రిల్ 1న నిర్వహించే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి 110 కిలోల ముత్యాలను కానుకగా ఇచ్చేందుకు నెల్లూరు జిల్లా కోవూరు MLA,TTD పాలకమండలి సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, నెల్లూరు లోక్ సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ముందుకొచ్చినట్లు డిప్యూటీ ఈవో ఏ.ప్రశాంతి గురువారం తెలిపారు.
CTR: చిత్తూరు మురకంబట్టులోని చిత్తూరు-పూతలపట్టు రైల్వే మార్గంలో ట్రాక్ మరమ్మతు పనులను శుక్రవారం ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే ట్రావెల్ క్రాసింగ్ నంబరు 22 పూర్తి ట్రాక్ను అప్ గ్రేడేషన్ చేయనుండటంతో శుక్రవారం నుంచి మార్చి 1వ తేదీ వరకు ట్రాఫిక్ మళ్లింపునున్నట్లు చెప్పారు.
BHPL: మొగుళ్ళపల్లి (M) వేములపల్లికి చెందిన సాత్విక్ సీఎం కప్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యాడు. ఇటీవల BHPL జిల్లాలోని అంబేడ్కర్ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో సాత్విక్ షాట్పుట్, జావెలిన్ త్రో విభాగాల్లో అద్భుత ప్రదర్శన చూపించాడు. ఈ రెండు ఈవెంట్లలోనూ ఉత్తమ ఫలితాలతో రాష్ట్ర స్థాయికి అర్హత సాధించినట్లు అధికారులు తెలిపారు.
ADB: ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దందా మితిమీరిపోతోందని రైతు హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ యాదవ్ ఆరోపించారు. అదనపు కలెక్టర్, డీఈవో రాజేశ్వర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. కరువు కాలంలో రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని, ఫీజుల విషయంలో పిల్లలను ఇబ్బంది పెట్టకుండా నేరుగా తల్లిదండ్రులతోనే మాట్లాడేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
AKP: సంప్రదాయం మత్స్యకారులకు చట్టసభల్లో అవకాశాలు కల్పించాలని జాతీయ మత్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు మోసా అప్పలరాజు విజ్ఞప్తి చేశారు. గురువారం పాయకరావుపేట సంఘం కార్యాలయంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 30 లక్షల ఓట్లు ఉన్న మత్స్యకారులను అన్ని పార్టీలు ఓటు బ్యాంకుగా వినియోగించుకుంటున్నాయన్నారు. ఏ పార్టీ ఇప్పటివరకు మత్స్యకారులకు తగిన గుర్తింపు ఇవ్వలేదన్నారు.