VSP: GVMC పరిధిలో సర్వేయర్లపై దోపిడీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ భూముల వివరాలు, సర్వే సర్టిఫికెట్లు, వీఎల్టీ, ప్లాన్ మంజూరులు వంటి పనుల కోసం ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకు అదనంగా వసూలు చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. పనిని బట్టి రూ. లక్షల్లో డిమాండ్ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
NLG: చండూరు మండల ప్రజల కోసం కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం (రేపు) మునుగోడు క్యాంపు కార్యాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ శిబిరంలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఆపరేషన్లు అవసరమైన వారికి హైదరాబాద్లో ఉచితంగా చేయిస్తామని వెల్లడించారు.
‘ధురంధర్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో దాని సీక్వెల్పై ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ‘ధురంధర్ 2’ ట్రైలర్ అప్డేట్ వచ్చింది. 2026 మార్చి 5న ట్రైలర్ రిలీజ్ కానున్నట్లు సమాచారం. దీనికోసం భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమా మార్చి 19న థియేటర్లలో సందడి చేయనుంది.
BDK: మణుగూరు పట్టణంలోని సుందరయ్య నగర్లో నిర్మితమవుతున్న దశావతార శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమానకి హాజరు కావాలని ఆలయ కమిటీ సభ్యులు శనివారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును కోరారు. ఆహ్వానాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
కోనసీమ: అమలాపురం పట్టణం మహిపాల వీధిలో వేంచేసి ఉన్న పెళ్లిళ్ల వెంకన్నగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం భక్తులు పోటెత్తారు. పాల్గుణ మాసం శుద్ధ చవితి కావడంతో స్వామి వారు ప్రత్యేక పుష్పాలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు అన్న ప్రసాద ఏర్పాట్లు చేశారు.
PPM: అగ్రిగోల్డ్ బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని AITUC జిల్లా కార్యదర్శి కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం పార్వతీపురంలోని స్థానిక కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ నెల 23న పార్వతీపురంలో అగ్రిగోల్డ్ బాధితుల విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ముప్పాళ్ళ నాగేశ్వరరావు హాజరవుతారని పేర్కొన్నారు.
NRPT: ధన్వాడ మండలం యంనోనిపల్లి గ్రామంలో పాత విద్యుత్ లైన్లను తొలగించి కొత్త లైన్ల పునర్నిర్మాణం ప్రారంభించారు. సుమారు రూ.3.50 లక్షల వ్యయంతో 25 కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి సహకారం, సర్పంచ్ బోయ నాగేశ్వర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు నరహరి పర్యవేక్షణలో ఈ అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్లు స్థానికులు తెలిపారు.
సత్యసాయి: లేపాక్షి మండలం చోళసముద్రం టోల్ ప్లాజా సమీపంలో హిందూపురం రూరల్ సీఐ జనార్ధన్, ఎస్సై నరేంద్ర ఆధ్వర్యంలో శనివారం వాహన తనిఖీలు నిర్వహించారు.హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులను గుర్తించి వారికి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.హెల్మెట్ ప్రాముఖ్యతను వివరించి, అక్కడికక్కడే కొత్త హెల్మెట్లు కొనుగోలు చేయించేలా చర్యలు చేపట్టారు.
TG: మాయని గాయం.. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లకు నేటితో 13 ఏళ్లు. 2013 ఫిబ్రవరి 21న జరిగిన ఈ బీభత్సంలో 18 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు. NIA కోర్టు దోషులకు మరణశిక్ష ఖరారు చేసినా, అది ఇంకా అమలుకు నోచుకోలేదు. తమకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని బాధితులు నేటికీ ఆవేదన చెందుతున్నారు ఉగ్రవాదుల శిక్షల అమలులో జాప్యంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
KMR: నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల పలు దశల్లో కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. యాసంగి పంటల కోసం శనివారం ఔట్ ఫ్లో 156 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. కాగా 31 క్యూసెక్కులు నీరు ఆవిరిగా మారుతున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు యాసంగికి 0.527 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్ట్ నీటిమట్టం 1.820 టీఎంసీలు ఉందన్నారు.
ADB: ఇచ్చోడ మండలంలోని ధర్మపురి గ్రామస్తులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ను ఆయన నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలో ఈ నెల 25న నిర్వహించనున్న అఖండ హరినామ సప్తః కార్యక్రమానికి రావాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్కు గ్రామస్తులు ఆహ్వాన పత్రిక అందజేశారు. గ్రామస్తులు అందరూ సమిష్టిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని పేర్కొన్నారు.
VSP: బురుజుపేట కనకమహాలక్ష్మి ఆలయంలో శనివారం వేకువజాము నుంచి వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి తులసీదళార్చనలు చేపట్టారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ పూజలలో ఇద్దరు ఉభయ దాతలు పాల్గొన్నారు. దేవస్థానం అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
ప్రజల అస్తిత్వానికి సుస్థిర కోటను నిర్శించేది మాతృభాషేనని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య తెలిపారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం వేళ విషెస్ చెప్పిన ఆయన.. భవిష్యత్ తరాలు ‘నీవెవరు’ అని అడిగితే చెప్పడానికి సమాధానం భాష, సంస్కృతులేనన్నారు. మన తెలుగును మనం కాకపోతే ఎవరు గుర్తించి కాపాడుకుంటారని ప్రశ్నించారు. మాతృభాషపై పేరెంట్స్ మమకారం పెంచుకుని, పిల్లలకు నేర్పించాలని సూచించారు.
KNR: మానకొండూర్ మండలం రంగంపేటలో శ్రీ మేడలంబ కేతకాంబ సమేత మల్లిఖార్జున స్వామి నూతన దేవాలయ ప్రతిష్ట మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవాలయ నిర్మాణానికి సహకరించిన దాతలను అభినందించి, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
PDPL: అంతర్గాం మండలం గోలివాడలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఖాజామియా అనే రైతు విక్రయానికి సిద్ధంగా ఉంచిన సుమారు 10 క్వింటాళ్ల పత్తి మంటల్లో చిక్కుకుంది. స్థానికులు శ్రమించి మంటలను ఆర్పినప్పటికీ, అప్పటికే సగం పంట దగ్ధమై రైతుకు భారీ నష్టం వాటిల్లింది. దీంతో అధికారులు వెంటనే ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు తమను ఆదుకోవాలని బాధితుడు కోరారు.