BDK: ఆళ్లపల్లి మండలంలో ఇవాళ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటిస్తారని మండల తహసీల్దార్ ప్రకటించారు. మండలానికి చెందిన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేస్తారని అన్నారు. అలాగే పలు శాఖల అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అధికారులు సకాలంలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
TPT: శ్రీకాళహస్తికి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఇవాళ రానున్నారు. గోపురం వద్దగల ధూర్జటి కళా ప్రాంగణంలో ఆయన ప్రవచనం ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు భక్తులకు ఆత్మశాంతి అందిస్తాయన్నారు.
PDPL: రామగిరి మండలంలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు రత్నాపూర్ రైతు వేదికలో 5 రోజుల సాధారణ అవగాహన శిక్షణ నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు జరుగుతాయని, మొత్తం 148 మంది సభ్యులు తప్పనిసరిగా హాజరుకావాలని ఎంపీడీవో బి. శైలజారాణి ఆదేశించారు. సంబంధిత పంచాయతీ కార్యదర్శులు సభ్యుల హాజరు కావాలన్నారు.
MHBD: నెల్లికుదురు మండలంలోని వావిలాల గ్రామంలో ఆదివారం గౌడ సంఘం అధ్యక్షులు బాలగాని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కేజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు రమణ పాల్గొని మాట్లాడుతూ.. నాటి పాలకుల అరాచకాలను అణచివేసేందుకు పుట్టిన బహుజన ధీరుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు.
AP: రాజమహేంద్రవరం ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. సంఘటన జరిగిన ప్రాంతాల్లో పాలు, నీరు, ఇతర నమూనాలను సేకరించారు. క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా రాజమహేంద్రవరంలో పలువురు కిడ్నీ వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే.
TG: రాష్ట్రంలో వరుసగా బస్సు ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం షాంపూర్ వద్ద బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. షాంపూర్ బ్రిడ్జి వద్ద బస్సు అదుపుతప్పి వాగులో పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఉట్నూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
SRPT: ఇంటర్మీడియట్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల విజయాల కోసం కోదాడ పట్టణంలోని నయా నగర్ బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం రాత్రి పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పరీక్షలు రాయబోయే విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేకంగా ఆశీర్వదించి, వారి భవిష్యత్తు శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు.
NDL: రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ ఛైర్మన్ ఆదివారం బనగానపల్లి మండలం పలుకూరు గ్రామంలో పర్యటించారు. గ్రామ సమీపంలో నాపరాల్ల మైనింగ్ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. నేరుగా కార్మికులతో మాట్లాడి పరిశ్రమల్లో కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం వడ్డెర సంక్షేమానికి కార్మికులకు ప్రత్యేక కృషి చేస్తుందని ఆయన అన్నారు.
NGKL: అచ్చంపేట నియోజకవర్గ గిరిజన బంజారా సోదరులకు ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం పట్టణంలో నిర్వహించే వేడుకలకు అన్ని మండలాలు, గ్రామాల నుంచి గిరిజనులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ మల్లు రవి, జిల్లా కలెక్టర్ సంతోష్ హాజరుకానున్నారు.
సిద్దిపేట 33/11 కేవీ సబ్ స్టేషన్లో మెయింటెనెన్స్ పనుల కారణంగా సోమవారం మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఏడీఈ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఖాదర్పురా, సీతారాం నగర్, ఇందిరానగర్, పాత బస్టాండ్, సుభాష్ రోడ్, మెదక్ రోడ్ సహా పలు ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
MBNR: బీసీలు రాజ్యాధికారంకోసం భావజాలాన్ని వ్యాప్తిచేస్తూ ఉద్యమించాలని ఇంటలెక్చువల్ ఫోరం ఛైర్మన్ చిరంజీవులు అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినాక బీసీల ఆత్మగౌరవం దెబ్బతీస్తూ.. అణచివేయడానికి ఆగ్రకుల నాయకులు ఎన్నో ఎత్తుగడలు వేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
నెల్లూరు సౌత్ ట్రాఫిక్ AS1 వెంకటేశ్వర్లుపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన బైకులపై కాలేజీకి వెళ్లే విద్యార్థులను ఆపి ఫోన్ పే ద్వారా నగదు ట్రాన్స్ఫర్ చేసుకున్న వీడియో వైరల్ గా మారింది. చేతిలో డబ్బులు లేవని వాహనదారులు చెబితే ఫోన్ పే చేయమని ఆయన ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతడిని సస్పెండ్ చేశారు.
మంచి గుండె ఆరోగ్యానికి వారానికి కనీసం 150 నిమిషాలు మితమైన-ఏరోబిక్ కార్యకలాపాలతో పాటు వ్యాయామం చేయాలి. ఇందులో నడక, సైక్లింగ్ లేదా మెట్లు ఎక్కడం వంటివి ఉండొచ్చు. రోజుకు 10,000 అడుగులు పూర్తి చేయడం మంచి విషయమే అయినప్పటికీ.. ఇది గుండె రక్షణకు పూర్తి హామీ ఇవ్వదు. వాకింగ్తో పాటు సమతుల్య ఆహారం, సరైన నిద్ర, ఒత్తిడిని నిర్వహించడం అవసరం.
NLR: ఉదయగిరి పట్టణంలోని మెయిన్ రోడ్డులో ఎస్సై కర్నాటి ఇంద్రసేనారెడ్డి ఆదివారం సాయంత్రం వాహనాలు తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని, ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులకు ఫైన్ విధించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. వాహన దారులు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడపరాదన్నారు.
KNR: జమ్మికుంట మండలంలోని రైతులకు వివిధ కేంద్రాల ద్వారా యూరియా పంపిణీ చేయనున్నట్లు మండల వ్యవసాయ అధికారి షేక్ ఖాదర్ హుస్సేన్ తెలిపారు. మాచినపల్లి HACA కేంద్రానికి 340, నాగంపేట DCMS 340, జమ్మికుంట JRUPSS కేంద్రానికి 340 బస్తాలు కేటాయించినట్లు పేర్కొన్నారు. యూరియా అవసరమైన రైతులు సోమవారం ఉదయం 7:30 గంటల నుంచి ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా బుక్ చేసుకొని పొందవచ్చన్నారు.