మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రం, ఓటీటీలోకి వచ్చినప్పటికీ థియేటర్లలో తన జోరును కొనసాగిస్తుండటం విశేషం. ఏకంగా 109 కేంద్రాల్లో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఇటీవల కాలంలో ఈ ఘనత సాధించిన ఏకైక చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ మూవీ ఈనెల 26న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ఇది ఏ సినిమాకు రీమేక్ కాదని స్పష్టం చేశాడు. కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వెల్లడించాడు. ఈ చిత్రంలో హీరోయిన్లుగా శ్రీలీల, రాశి ఖన్నా నటిస్తున్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న మూవీ ‘పెద్ది’. ఇప్పటికే ‘చికిరి’ పాట రిలీజై సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ‘రాయ్ రాయ్ రారా’ అంటూ సాగే లిరికల్ వీడియోను ఈరోజు రాత్రి 7:02 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ మూవీ ఏప్రిల్ 30, 2026న విడుదలవుతుంది.
యాంకర్, నటి రష్మీ తన సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీకి కీలక విజ్ఞప్తి చేసింది. ‘మన దేశం ఎప్పుడూ భిన్నత్వంలో ఏకత్వాన్ని, అన్ని మతాలను గౌరవించింది. కానీ రాడికల్ (అతివాద) మనస్తత్వాన్ని మేము సహించము. ఈ వ్యాధిని ఇక్కడ వ్యాప్తి చెందనివ్వం. రాడికల్ ఆలోచనలతో ఉండి, యుద్ధాన్ని సమర్థించే వారిని దయచేసి ఇరాన్కు పంపాలి’ అని కోరింది.
బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహి ఇన్స్టా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేసింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై స్పందించింది. తాను ప్రస్తుతం ఇండియాలోనే ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో జరుగుతున్న ఘర్షణలు, అక్కడి భయంకరమైన దృశ్యాలు తనను తీవ్రంగా కలచివేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. తన గురించి ఆందోళన చెందిన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది.
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తన అభిమానులకు కీలక అప్డేట్ ఇచ్చారు. తన స్వీయ దర్శకత్వంలోని ‘క్రిష్ 4’ను ప్రస్తుతానికి పక్కనపెట్టిన ఆయన, కన్నడ నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్’తో ఓ భారీ ప్రాజెక్ట్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది హృతిక్ కెరీర్లోనే తొలి సౌత్ ఇండియన్ సినిమా. ఈ చిత్రం పూర్తయ్యాకే ‘క్రిష్ 4’ పట్టాలెక్కుతుందని సమాచారం.
తమిళ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబోలో వస్తున్న కొత్త సినిమా టైటిల్ను మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే పేరును ఖరారు చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్, డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను జులైలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. సూర్య మార్క్ నటన, వెంకీ స్టైల్ మేకింగ్పై అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి.
మళయాళ బ్లాక్ బస్టర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ చిత్ర దర్శకుడు చిదంబరం ఎస్ పొడ్యాల్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. 2022లో తనను చిదంబరం వేధించినట్లు ఓ మహిళ ఎర్నాకుళం సౌత్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల మళయాళ చిత్ర పరిశ్రమలో వరుసగా వెలుగులోకి వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.
నటుడు, టీవీకే అధినేత విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ తన తండ్రిని ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేయడం సంచలనమైంది. విజయ్-సంగీతల విడాకుల వ్యవహారం, ఇతర ఆరోపణల నేపథ్యంలో ఈ పరిణామం కుటుంబంలో విభేదాలకు సంకేతమని నెటిజన్లు భావిస్తున్నారు. కాగా ఇటీవల భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్టుకెక్కగా, విజయ్కు మరో మహిళతో సంబంధం ఉందని ఆమె ఆరోపణలు చేసింది.
దుబాయ్, ఖతార్ సహా ఏడు దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేయడంతో అక్కడ ఉన్న స్టార్ హీరోలు అజిత్, మాధవన్ భద్రతపై అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే వారిద్దరూ క్షేమంగా ఉన్నారని, ఎటువంటి ముప్పు లేదని వారి సిబ్బంది అధికారికంగా ధృవీకరించారు. ప్రస్తుతం వారు సురక్షిత ప్రాంతంలో ఉన్నారని తెలియజేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన అంతర్జాతీయ చిత్రం ‘ది బ్లఫ్’పై సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమాను చూసిన ఆయన, SM వేదికగా తన రివ్యూను పంచుకున్నాడు. ఈ చిత్రంలో ప్రియాంక నటన అద్భుతంగా ఉందని, పెర్ఫార్మెన్స్తో అదరగొట్టిందని మహేశ్ కొనియాడాడు. గ్లోబల్ స్టార్ స్థాయికి తగ్గట్లుగా ప్రియాంక సత్తా చాటిందని పేర్కొన్నాడు.
నందమూరి బాలకృష్ణ, యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబోలో భారీ చిత్రం రాబోతున్నట్లు ఫిల్మ్నగర్లో టాక్ వినిపిస్తోంది. ‘సరిపోదా శనివారం’తో తన మాస్ యాంగిల్ను నిరూపించుకున్న వివేక్, బాలయ్య కోసం ఓ లార్గర్ దెన్ లైఫ్ కథను సిద్ధం చేశాడట. బాలకృష్ణకు ఇప్పటికే కథను కూడా వినిపించారట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా చేసే ఆలోచనలో ఉన్నారట.
హీరోయిన్ తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కొన్నిసార్లు తనతో కలిసి పనిచేయడం కొంచెం కష్టమనే మాట వింటుంటానని తెలిపింది. ‘బహుశా నాతో పనిచేయని వ్యక్తులు ఇలా ప్రచారం చేసి ఉండొచ్చు. నేనేంటో అందరికీ నిరూపించుకోవాలని అనుకోను. అలా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా పనితోనే సమాధానం చెప్తా’ అని చెప్పుకొచ్చింది.
T20 ప్రపంచకప్ 2026 క్వార్టర్ ఫైనల్లో వెస్టిండీస్పై భారత్ ఘనవిజయం సాధించి సెమీస్కు చేరింది. 196 పరుగుల లక్ష్య ఛేదనలో సంజూ శాంసన్ 50 బంతుల్లో 97* పరుగులతో వీరవిహారం చేశాడు. ఒంటిచేత్తో జట్టును గెలిపించిన సంజూపై మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రశంసలు కురిపించారు. ఇది అద్భుతమైన మాస్టర్ఫుల్ ఇన్నింగ్స్ అని, సంజూ ప్రతిభకు ఇది నిదర్శనమని ఆయన కొనియాడారు.
విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం తర్వాత హైదరాబాద్లో ఈ నెల 4న గ్రాండ్గా రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకకు కేవలం ఆహ్వానం ఉన్న అతిథులు మాత్రమే హాజరుకావాలని వారు కోరారు. సెక్యూరిటీ, పోలీసుల ఆంక్షల దృష్ట్యా అభిమానులు ఎవరూ రావొద్దని, వచ్చి ఇబ్బంది పడొద్దని విజ్ఞప్తి చేశారు. అభిమానుల క్షేమమే తమకు ముఖ్యమని, వారి దీవెనలు ఎక్కడున్నా తమకు చేరుతాయని ‘విరోష్’ జంట తెలిపింది.