KRNL: ఆదోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న తెలుగు, ఎకనామిక్స్, కంప్యూటర్ అప్లికేషన్ పోస్టులకు అతిథి అధ్యాపకుల నియామకం చేపట్టనున్నట్లు ప్రిన్సిపాల్ S.శివారెడ్డి తెలిపారు. PGలో 55% మార్కులు ఉన్నవారు అర్హులని, నెట్, సెట్, PHD ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 27 నుంచి కళాశాలలో డెమో ఇవ్వాలన్నారు.
నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ మేళాలో 69 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారని ప్రిన్సిపల్ శశికళ బుధవారం తెలిపారు. మొత్తం 132 మంది అభ్యర్థులు హాజరయ్యారని ప్రిసిపల్ పేర్కొన్నారు. ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు తమ భవిష్యత్తును మెరుగుపరుచుకోవాలని ఆమె సూచించారు.
TG: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఫస్టియర్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్- 1 పరీక్ష నిర్వహించారు. తొలి రోజు పరీక్షకు 96.90 శాతం హాజరు నమోదైనట్లుగా ఇంటర్ బోర్డు తెలిపింది. పరీక్షకు మొత్తం 5,14,598 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. 4,98,695 హాజరయ్యారని, 15,903 మంది గైర్హాజరైనట్లుగా పేర్కొంది.
దుకాణాల్లో ఏదైనా వస్తువు కొనుగోలు చేసిన తర్వాత కొన్నిసార్లు రిటర్న్ చేయాలని అనుకున్నప్పుడు దూకాణదారులు తిరిగి తీసుకోరు. అయితే, అది ఎలాగైతే ఉందో అదే స్థితిలో ఉంటే తిరిగి తీసుకోవడానికి వ్యాపారి నిరాకరించకూడదని వినియోగదారుల చట్టం చెబుతోంది. బిల్లులపై నో రిటర్న్ అని రాయడం 1999 నుంచి నిషేధించబడింది. వస్తువును వెనక్కి తీసుకోకపోతే సదరు దుకాణదారుడికి జరిమానా కూడా విధిస్తారు.
TG: విద్యార్థుల ఆధార్ అప్డేషన్పై విద్యాశాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఏప్రిల్ 2026 నాటికి 100 శాతం ఆధార్ నమోదు పూర్తి చేయాలని నిర్ణయించింది. పాఠశాలల్లోనే ఆధార్ నమోదు, బయోమెట్రిక్ అప్డేషన్ సదుపాయం కల్పించనుంది. 5 ఏళ్లు నిండినవారికి 15 ఏళ్లు పూర్తయిన విద్యార్థులు తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని సూచించింది.
ఏఐకి టీసీఎస్ భయపడదని ఆ సంస్థ సీఈవో కృతివాసన్ పేర్కొన్నారు. కంపెనీ వార్షిక ఈవెంట్లో ఆయన మాట్లాడారు. ఏఐ మార్పులకు అనుగుణంగా తమ కంపెనీ విధానాలు మార్చుకుంటున్నామని తెలిపారు. అంతేగానీ.. కొత్త టెక్నాలజీ చూసి భయపడబోమని అన్నారు. ఏఐ టూల్స్ను వినియోగించి పనిని వేగంగా, తక్కువ ఖర్చుతో చేసే విధానంపై తమ ఉద్యోగులను ప్రోత్సహిస్తున్నట్లు కృతివాసన్ వెల్లడించారు.
మార్చి 16 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు పరీక్షల విభాగం కీలక సూచనలు చేసింది. నామినల్స్ రోల్స్లో విద్యార్థుల పేరు, పుట్టిన తేదీ వంటి వివరాల్లో తప్పులు ఉంటే సరిదిద్దుకోవచ్చని తెలిపింది. ఈనెల 26 నుంచి 28 వరకు అవకాశం కల్పించింది.
టెక్ రంగంలో ‘ఆంథ్రోపిక్’ సంచలనాలు సృష్టిస్తోంది. కొత్త ఏఐ మోడళ్లతో కంపెనీలను ఆకర్షిస్తోంది. దీంతో ఆ సంస్థ మార్కెట్ విలువ 380 బిలియన్ డాలర్లకు చేరింది. మరోవైపు మార్కెట్లోకి ఆంథ్రోపిక్ కొత్త ఐటీ మోడళ్లను తెస్తుండటంతో ఇతర ఐటీ కంపెనీలు, సైబర్ సెక్యూరిటీ సంస్థల షేర్లు నష్టాలకు గురవతున్నాయి.
భారత యూజర్ల కోసం వాట్సాప్ సిమ్ వెరిఫికేషన్ను తెస్తోంది. దీంతో సైబర్ నేరాలకు చెక్ పెట్టనుంది. ఇప్పటివరకు ఫోన్లో సంబంధిత అకౌంట్ సిమ్ లేకపోయినా వేరే డివైజ్లో ఆ ఫోన్ నంబర్కు వచ్చే ఓటీపీతో వాట్సాప్లో లాగిన్ కావొచ్చు. దీంతో వేరే వ్యక్తులు వాట్సాప్ వాడుకునే అవకాశం ఉంది. కొత్త వెరిఫికేషన్తో సిమ్ ఫోన్లో ఉంటేనే లాగిన్ అవకాశం ఉంటుంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 50.15 పాయింట్లు లాభపడి 82276.07 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 57.85 పాయింట్ల లాభంతో 25482.50 దగ్గర ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.95గా ఉంది.
TG: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉన్న ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ క్రమంలోనే 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అభ్యర్థుల వివరాలను బోర్డు విడుదల చేసింది. ఈనెల 28 వరకు అభ్యంతరాల స్వీకరణకు గడువు విధించింది. అభ్యంతరాల పరిశీలన తర్వాత మెరిట్ లిస్ట్ను విడుదల చేయనుంది.
ప్రముఖ ప్రభుత్వ సంస్థ HPCLలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ (ఇంజినీరింగ్ స్ట్రీమ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 250 ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు www.hindustanpetroleum.comను సంప్రదించండి.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్వ్యూకు ఎంపికైన వారి జాబితా విడుదలైంది. ఈ మేరకు యూపీఎస్సీ తన వెబ్సైట్లో జాబితాను ఉంచింది. అభ్యర్థులు వెబ్సైట్లో జాబితాను చూసుకోవాలని తెలిపింది.
రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్స్(ALPs) కోసం కొత్త నియామకాన్ని రైల్వే మంత్రిత్వశాఖ ఆమోదించింది. 11,127 ALPs ఖాళీలను భర్తీ చేస్తారు. ద.మ. రైల్వేలో 674 పోస్టులు ఉన్నాయి. RRB త్వరలో ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించనుంది. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి లేదా ఇంజనీరింగ్లో డిప్లొమా పొంది ఉండాలి.
హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 పెరిగి రూ.1,61,890కు చేరింది. అలాగే, ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి రూ.1,48,400గా నమోదైంది. మరోవైపు వెండి ధర రూ.5,000 పెరిగి రూ.2,95,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.