• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

జాతీయ వీల్ చైర్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌‌గా పాలకొల్లు వాసి

W.G. వీల్ చైర్ క్రికెట్‌లో పాలకొల్లు కుర్రాడు మురపాక నళిని రాజశేఖర్ సత్తా చాటుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖలో ఫిబ్రవరి 23 నుంచి 28 వరకు 5వ జాతీయ వీల్ చైర్ క్రికెట్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టుకు రాజశేఖర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు ఏసీఏ శుక్రవారం ప్రకటించింది.

February 21, 2026 / 10:29 AM IST

బొత్స సత్యనారాయణ బురద జల్లుతున్నారు: గురునాథం

NTR: వైసీపీ నేతలు హెరిటేజ్ సంస్థపై చేసిన ఆరోపణలను ఖండిస్తూ విజయవాడలో టీడీపీ నేత మాదిగాని గురునాథం నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నేతల ఆరోపణలు దొంగే దొంగ అన్నట్లు ఉన్నాయని అన్నారు. స్వార్థ రాజకీయ లాభాల కోసం, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మీడియా దృష్టిని ఆకర్షించేందుకు హెరిటేజ్ పై బురద జల్లుతున్నారని విమర్శించారు.

February 21, 2026 / 10:29 AM IST

శ్రీశైలంలో హుండీ ఆదాయ వివరాలు

NDL: మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీశైలం దేవస్థానంలో 13 రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. హుండీల ద్వారా రూ. 5,61,81,535 నగదు ఆదాయం లభించింది. దీంతో పాటు 124 గ్రాముల బంగారం, 5.550 కిలోల వెండి, విదేశీ కరెన్సీ కూడా అందాయి. పటిష్ట భద్రత, సీసీ కెమెరాల నిఘా మధ్య ఈ లెక్కింపు ప్రక్రియను దేవస్థానం అధికారులు నిర్వహించారు.

February 21, 2026 / 10:28 AM IST

గుండెపోటుతో సర్పంచ్ మృతి

GNTR: కొల్లిపర మండలం పాత బొమ్మువారి పాలెం టీడీపీ సర్పంచ్ కొల్లి శివరామిరెడ్డి (51) శనివారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు గుంటూరు GGHకి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. శివరామిరెడ్డి ఆకస్మిక మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

February 21, 2026 / 10:28 AM IST

మనస్తాపంతో యువతి ఆత్మహత్య

TPT: తిరుపతి కొర్లగుంట మారుతీనగర్‌లో విషాదం నెలకొంది. నగరి మండలం గుండ్రాజుకుప్పానికి చెందిన దివ్య (20) మూడేళ్ల కిందట ప్రకాశ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఈ దంపతులకు 18 నెలల సితార అనే కుమార్తె ఉంది. తిరుపతిలో నివాసం ఉంటున్నారు. ఏమైందో ఏమో ఆమె ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని భర్త దివ్యను మందలించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

February 21, 2026 / 10:26 AM IST

శ్రీమఠానికి భారీ విరాళం

KRNL: శ్రీమఠానికి బెంగళూరుకు చెందిన కేశవ్ గౌడు రూ.53,000, ముంబైకి చెందిన ఆదిత్య రవి అనే భక్తుడు రూ.200,000, బెంగుళూరుకు చెందిన చంద్రశేఖర్ 100 బస్తాల బియ్యం విరా ళంగా ఇచ్చినట్లు మఠం ఏఏవో మాధవవెట్టి, మేనేజర్లు ఎస్కే శ్రీనివాసరావు, వెంకటేష్ జోషి ఇవాళ తెలిపారు. అనంతపురాణిక్, చిలకలడోణ రాఘ వేంద్రరావు, నరసింహా దేశాయ్, శ్రీపాధచార్ పాల్గొన్నారు.

February 21, 2026 / 10:25 AM IST

మహిళల భద్రతకు ‘శక్తి’ యాప్ అవగాహన

కడప: నగరంలోని చెమ్ముమియాపేట జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్‌లో ‘శక్తి’ టీమ్ ఎస్సై శాంతమ్మ ఆధ్వర్యంలో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో ‘శక్తి’ యాప్ వినియోగం, ఎస్‌.ఓ.ఎస్ బటన్ ప్రాముఖ్యత, డయల్ 112 సేవలపై విద్యార్థినులకు వివరించారు. మహిళలు, చిన్నారుల రక్షణకు అందుబాటులో ఉన్న హెల్ప్‌లైన్ నంబర్లను గుర్తు చేశారు.

February 21, 2026 / 10:22 AM IST

ముమ్మరంగా చెత్త తొలగింపు పనులు

కృష్ణా: గుడ్లవల్లేరు గ్రామంలో శానిటరీ సిబ్బంది ద్వారా చెత్త తొలగింపు పనులను శనివారం చేపట్టారు. గ్రామం చుట్టూ వ్యర్థాల నిల్వ తగ్గించి, పరిశుభ్రతను పెంపొందించే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నామని శానిటరీ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ తెలిపారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా చెత్త బండి వారికి అందజేయాలని ఆయన గ్రామస్థులకు సూచించారు.

February 21, 2026 / 10:21 AM IST

‘మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలి’

ELR: వట్లూరులోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహం -1లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల ఆహార నాణ్యతను పరిశీలించారు. భోజనం పరిశుభ్రంగా ఉందా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు.

February 21, 2026 / 10:20 AM IST

దాడులు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు: షర్మిల

అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ నేతల దాడిని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం ఖండించారు. ఢిల్లీలో జరిగిన పరిణామాలకు ఇక్కడ దాడులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. దేశంలో ప్రశ్నించే హక్కును బీజేపీ కాలరాస్తోందని ధ్వజమెత్తారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని ఆవేదన వ్యక్తం చేశారు.

February 21, 2026 / 10:12 AM IST

ఉగాది గిఫ్ట్.. మరో DSC నోటిఫికేషన్..!

W.G: ఉగాది వేళ డీఎస్సీ ప్రకటన నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. ఇప్పటికే మెగా డీఎస్సీ ద్వారా 900 పైచిలుకు పోస్టులు భర్తీ కాగా, తాజాగా మరో 200 ఖాళీల భర్తీకి అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే నోటిఫికేషన్ విడుదల చేసేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. దీంతో ప.గో. అభ్యర్థులు తమ ప్రిపరేషన్ కు మరింత పదును పెడుతున్నారు.

February 21, 2026 / 10:11 AM IST

గంజాయి కేసు.. విద్యార్థుల తల్లిదండ్రులలో ఆందోళన.!

VZM: బొబ్బిలి (M) కోమటిపల్లిలో విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్న కేసులో 11మందిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. వీరిలో ఓ మైనర్ బాలుడు, 7గురు విద్యార్థులు ఉండటం కలకలం రేపింది. కాలేజ్ సమీపంలో గంజాయి విక్రయాలు జరగుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంజాయి అమ్మకాలు విక్రయిస్తున్న ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

February 21, 2026 / 10:11 AM IST

విభాగాల సమన్వయంపై ప్రత్యేక దృష్టి

అన్నమయ్య: రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్వహించిన జనగణన-2027 రాష్ట్రస్థాయి సమావేశంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ పాల్గొన్నారు. జనగణన ఏర్పాట్లపై కేంద్ర అధికారులు మార్గదర్శకాలు అందించగా, జిల్లా స్థాయిలో ముందస్తు సిద్ధతపై కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు విభాగాల సమన్వయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

February 21, 2026 / 10:11 AM IST

తండ్రిపై దాడి చేసి బంగారంతో పరార్

KRNL: ఆదోని(M) కపటి గ్రామంలో ఆస్తి తగాదాతో కొడుకు తన తండ్రిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు SI మహేశ్ తెలిపారు. అనంతరం ఇంట్లోని ఐదు తులాల బంగారం, బుల్లెట్ బైక్‌తో పరారయ్యాడని చెప్పారు. గాయపడిన తండ్రిని కుటుంబ సభ్యులు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

February 21, 2026 / 10:09 AM IST

దేవరపల్లిలో స్వచ్ఛ రథం ప్రారంభం

E.G: దేవరపల్లిలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ రథాన్ని గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు కంబాల సత్తిబాబు, టీడీపీ మండలం అధ్యక్షులు తంగేళ్ల మునీశ్వర రావు శనివారం ప్రారంభించారు. స్వచ్ఛ రథం ద్వారా ప్రజల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను స్వీకరించి వాటి విలువను తగ్గట్టుగా నిత్యవసర సరుకులు ఇవ్వడం జరుగుతుందన్నారు. దీనిని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

February 21, 2026 / 10:06 AM IST