TPT: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గూడూరు ఎమ్మెల్యే పి. సునీల్ కుమార్కు పలు ప్రాంతాల ప్రజలు అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారి సమస్యలను సావధానంగా విని వాటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. సంబంధిత ఆర్జీలను అధికారులకు పంపి సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని వారికి ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
VZM: సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా కూటమి పాలన సాగుతుందని ఎమ్మెల్యే లోకం నాగమాధవి వెల్లడించారు. కొండవెలగాడ-విజయనగరం రహదారి రిసర్ఫేసింగ్ పనులకు శనివారం ఆమె శంకుస్థాపన చేశారు. రూ.1.75 కోట్లతో ఈ రహదారి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వంతోనే పారదర్శక పాలన సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో గదల అచ్చంనాయుడు, యడ్ల గోవిందరావు పాల్గొన్నారు.
SKLM: పవిత్ర ఖురాన్ అవతరించిన పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ఉపవాస దీక్షలు ఆచరిస్తున్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గొండు శంకర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ మాసం అనేది ఆత్మశుద్ధి, సహనం, దాతృత్వం మరియు సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ATP: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కుటుంబ సభ్యులతో కలిసి శనివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాక్షస ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ వెంకటేశ్వరుని వేడుకున్నానని తెలిపారు.
W.G: శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు శ్రీవారి చిత్రపటాలను ప్లకార్డుల్లా వాడుతూ, చెప్పులేసుకుని వాటిని విసిరేయడంపై నరసాపురం MLA బొమ్మిడి నాయకర్ నిన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో MLA బొలిశెట్టితో కలిసి ఆయన మాట్లాడుతూ.. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వైసీపీకి ప్రజా క్షేత్రంలో ఉండే అర్హత లేదన్నారు. దేవుడి చిత్రపటాలను అవమానించారని మండిపడ్డారు.
NDL: బనగానపల్లె మండలం నందవరంలో శ్రీ చౌడేశ్వరి మాత శనివారం విశేష పుష్పలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో తెల్లవారుజామున అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి కుంకుమార్చన, రుద్రాభిషేకం నిర్వహించారు. యాగంటి ఉమామహేశ్వరస్వామి అమ్మవార్లకు కూడా ఆలయ ఈఓ డి.పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో గణపతి పూజ, జలపాల పంచామృత అభిషేకాలు నిర్వహించారు.
ELR: భీమడోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలు ఆన్ లైన్ పెట్టుబడులు, లాభాలు అనే రెండు బూటకపు మాటలను తిప్పి కొట్టాలని ఎస్సై మదీనా భాష సూచించారు. నిన్న ఆయన మాట్లాడుతూ.. క్రిప్టో కరెన్సీ అనే కుంభకోణంలో ఎంతో మంది కుదేలయ్యారన్నారు. అమాయకులే టార్గెట్గా సైబర్ మోసాలు జరుగుతాయని, మోసానికి గురైతే నం.1930 ఫోన్ చేయాలన్నారు. తెలియని లింక్స్ పై క్లిక్ చేయొద్దన్నారు.
VSP: GVMC పరిధిలో సర్వేయర్లపై దోపిడీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ భూముల వివరాలు, సర్వే సర్టిఫికెట్లు, వీఎల్టీ, ప్లాన్ మంజూరులు వంటి పనుల కోసం ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకు అదనంగా వసూలు చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. పనిని బట్టి రూ. లక్షల్లో డిమాండ్ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
కోనసీమ: అమలాపురం పట్టణం మహిపాల వీధిలో వేంచేసి ఉన్న పెళ్లిళ్ల వెంకన్నగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం భక్తులు పోటెత్తారు. పాల్గుణ మాసం శుద్ధ చవితి కావడంతో స్వామి వారు ప్రత్యేక పుష్పాలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు అన్న ప్రసాద ఏర్పాట్లు చేశారు.
PPM: అగ్రిగోల్డ్ బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని AITUC జిల్లా కార్యదర్శి కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం పార్వతీపురంలోని స్థానిక కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ నెల 23న పార్వతీపురంలో అగ్రిగోల్డ్ బాధితుల విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ముప్పాళ్ళ నాగేశ్వరరావు హాజరవుతారని పేర్కొన్నారు.
సత్యసాయి: లేపాక్షి మండలం చోళసముద్రం టోల్ ప్లాజా సమీపంలో హిందూపురం రూరల్ సీఐ జనార్ధన్, ఎస్సై నరేంద్ర ఆధ్వర్యంలో శనివారం వాహన తనిఖీలు నిర్వహించారు.హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులను గుర్తించి వారికి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.హెల్మెట్ ప్రాముఖ్యతను వివరించి, అక్కడికక్కడే కొత్త హెల్మెట్లు కొనుగోలు చేయించేలా చర్యలు చేపట్టారు.
VSP: బురుజుపేట కనకమహాలక్ష్మి ఆలయంలో శనివారం వేకువజాము నుంచి వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి తులసీదళార్చనలు చేపట్టారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ పూజలలో ఇద్దరు ఉభయ దాతలు పాల్గొన్నారు. దేవస్థానం అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
CTR: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఉపయోగించిన ఫర్నిచర్, ఎలక్ట్రికల్, స్పోర్ట్స్, కిచెన్ పరికరాలకు ఈనెల 23న బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్టు అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. ఉదయం 10:30 గంటలకు ప్రశాంత్ నగర్ పోలీస్స్టేషన్లో వేలం జరుగుతుందన్నారు. ఆసక్తి ఉన్నవారు ఏ సెక్షన్ సూపరింటెండెంట్ పుష్పరాజ్ను సంప్రదించాలని సూచించారు.
VZM: చీపురుపల్లి టౌన్ వంగపల్లి పేటలో కాలువ పక్కన భారీగా చెత్త పేరుకుపోయింది. ఈ చెత్త వలన దోమల బెడద ఎక్కువగా ఉందని, దీంతో రోగలు బారిన పడే అవకాశం ఉంటుందని స్థానికులు భయపడుతున్నారు. శ్రీ కనకమాలక్ష్మి తల్లి పండగ తరుణంలో జనాల తాకిడి ఎక్కువగా ఉంటుంది కనుక అధికారులు స్పందించి వెంటనే చెత్తను తొలగిస్తారని స్థానికులు కోరుతున్నారు.
VZM: మెరకముడిదాం మండలం సిరియాల పేట గ్రామంలో రామాలయం నిర్మాణ చేపడుతున్నారు. ఈ ఆలయ నిర్మాణానికి చీపురుపల్లి టీడీపీ మాజీ ఇంఛార్జ్ త్రిమూర్తులు రాజు రూ. 27,000 అందించారు. మోటర్ బోరు నిమిత్తం గ్రామస్థులు ఆయనను సంప్రదించగా ఈ సాహాయం అందించారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయ పనులు ముగింపు దశకు వచ్చాయని తెలిపారు.