VSP: చింతలగ్రహారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం వేడుకగా నిర్వహించారు. 2000-2001 బ్యాచ్ చదువుకున్న విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్య నేర్పిన గురువులను సత్కరించారు. ఒకరికి ఒకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకుని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. సాయంత్రం వరకు ఆటపాటల్లో మునిగి తేలారు.
KDP: పులివెందుల నగరిగుట్ట మసీదు సమీపంలో చెత్తను వేయడంతో గాలికి అది రోడ్డుపైకి ఎగిరివస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోంది. ముఖ్యంగా ఆ మార్గం ద్వారా వెళ్లే పిల్లలు చెత్తాచెదారాల కారణంగా అసౌకర్యం ఎదుర్కొంటున్నారు. చెత్తాచెదారాలు రోడ్డుపై వ్యాపించడంతో దుర్వాసనతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. అధికారులు స్పందించాలని స్థానికులు కోరారు.
కోనసీమ: ఎస్పీ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ‘స్టాప్ వాష్ అండ్ గో’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. జాతీయ రహదారులు, గ్రామీణ రహదారులపై నిద్రమత్తు వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. దీనిపై దృష్టి సారించి అమలాపురంలో సోమవారం తెల్లవారుజామున డ్రైవర్లను ఆపి, ముఖం కడుక్కునేలా చేసి ప్రయాణానికి అనుమతిస్తున్నారు.
SKLM: యువ రచయితలను ప్రోత్సాహించటం ఆనందదాయకమని, డా.బీ ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా గ్రంథాలయంలో యువ రచయితల వేదిక అధ్యక్షులు తంగి ఎర్రమ్మ, కార్యదర్శి పొట్నూరి మాలతిల ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. కవి సమ్మేళనంలో పలువురు కవులు తమ కవితలను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో గేదెల, వాసవి, తదితరులు పాల్గొన్నారు.
NDL: చిన్నదేవలాపురం గ్రామంలో నిన్న రాత్రి జరిగిన ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదంలో షేక్ మాభూసా కుటుంబానికి చెందిన పశువుల పాక పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న బండి ఆత్మకూరు టీడీపీ మండల అధ్యక్షులు ముమ్మడి నాగ కృష్ణారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని సోమవారం పరామర్శించారు.
CTR: మానవత్వానికి కులమతాల అవసరం లేదని నిరూపించిన సంఘటన వీకోట మండలం చౌడేపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. అబ్దుల్ బాషా, షబీనా దంపతులు తల్లిదండ్రులు లేని హేమలత అనే ఓ హిందూ చిన్నారిని పెంచి పెద్ద చేశారు. తమ స్తోమత మేరకు చదువు సైతం చెప్పించారు. ఓ మంచి హిందూ సంబంధం చూసి హిందూ పద్ధతిలో వివాహం జరిపించారు.
VZM: జిల్లా వ్యాప్తంగా ఇవాళ నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా కె.ఎల్. పురంలోని శ్రీ లక్ష్మీగణపతి జూనియర్ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని ఆయన సందర్శించి, పరీక్షల నిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులు పరీక్ష రాస్తున్న గదులను సందర్శించారు.
KKD: తునిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శ్రీరామ థియేటర్ సెంటర్లో బుధవారం జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడిన సైకిల్ మెకానిక్ నానాజీ సోమవారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బైక్ మెకానిక్, సైకిల్ మెకానిక్ మధ్య జరిగిన ఘర్షణ ఆగ్రహానికి లోనైన బైక్ మెకానిక్, నానాజీపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ క్రమంలో ఇవాళ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కృష్ణా: గుడివాడలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. విద్యార్థులు నిర్ణీత సమయానికి ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకొని పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద సిబ్బంది విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి, నిబంధనలకు అనుగుణంగా కేంద్రాల్లోకి అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు అధికారులు చర్యలు చేపట్టారు.
ATP: గుత్తి ICDS కార్యాలయం ఎదురుగా సోమవారం అంగన్వాడీ కార్యకర్తలు, సిబ్బంది CITU ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నాయకులు రమేష్ మాట్లాడుతూ.. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, అంగన్వాడి కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ATP: గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామానికి చెందిన రామాంజనేయులు కుమారుడు రవి వివాహానికి ఏడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి సోమవారం రూ.10వేల ఆర్థిక సాయం అందజేశారు. నిరుపేద కుటుంబాల పెళ్లిళ్లకు తోడ్పాటు అందించడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. నూతన వధూవరులు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
VSP: భారీ వాహనాల డ్రైవర్ల నిర్లక్ష్యంతో హనుమంతువాక-మధురవాడ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎండాడ సిగ్నల్ వద్ద కంటైనర్ తీసుకెళ్తున్న భారీ ట్రాలర్ అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టి రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ ఎస్ఐ ధర్మేందర్ సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేపట్టారు.
కోనసీమ: అయినవిల్లి మండలం ముక్తేశ్వరం తొగరపాయ వంతెన వద్ద సోమవారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న రెండు మోటార్ సైకిళ్ళు ఢీకొన్నాయి. ఈ విషయం తెలుసుకున్న అయినవిల్లి పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో కొలపర్తి అచ్యుత లోకేశ్వరరావు, పి.శ్రీనివాసరావులకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.
KRNL: పెద్దకడబూరు LLC కాలువ పరిధి సళ్లమ్మ వంక సమీపంలో నీరు కలుషితమవుతోంది. కాలువలో ప్రవహిస్తున్న నీటిలో గుర్రపుడెక్కలు, చనిపోయిన జంతువుల కళేబరాలు పేరుకుపోయి తేలుతూ దుర్గంధం వెదజల్లుతోంది. పరిసర ప్రాంతమంతా అసహ్యకరమైన వాసనతో నిండిపోతోంది. చుట్టూ ప్రక్కల పొలాల కూలీలకు ఈ నీటినే ఉపయోగిస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే పరిశుభ్రత పనులు చేపట్టాలన్నారు.
PPM: కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి నిర్వహించిన ప్రెస్మీట్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. హిందూ విశ్వాసాలు, సంప్రదాయాలను వైసీపీ నేతలు గౌరవించలేదని ఆరోపించారు. శాసన మండలిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటోలతో చెప్పులు వేసుకుని నినాదాలు చేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు.