ప్రకాశం: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక TDP కార్యాలయంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
NLR: 15 ఏళ్లుగా మూతపడి వేలాది కుటుంబాలను రోడ్డున పడేసిన షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలపై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శాసనసభలో సోమవారం గళమెత్తారు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీలో దాదాపు 3 వేల మంది కార్మికులు పని చేసేవారన్నారు.పెండింగ్లో ఉన్న కోట్లాది రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేసి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు.
ప్రకాశం: కొమరోలు మండలంలోని మాధవపల్లె గ్రామ సమీపంలోని క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న సూరే శివ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
VSP: చినగదిలిలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఇవాళ ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఫిబ్రవరి 23న పద్మశ్రీ పి.సి.సర్కార్ జన్మదినాన్ని పురస్కరించుకుని బాల వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలికలు చదువుతో పాటు కళల్లోనూ రాణించాలని నిర్వాహకులు సూచించారు.
AKP: నర్సీపట్నం న్యాయస్థానాల ఆవరణలో సోమవారం న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మెట్ట ప్రభాకర్ మాట్లాడుతూ కర్నూలు సిటీలో పవన్ కుమార్ అనే న్యాయవాది మీద సీఐ విక్రమ సింహ దాడి చేయడం అమానుషమని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సత్యసాయి: బడ్జెట్ సమావేశాల్లో సోమవారం మంత్రి సవిత పాల్గొన్నారు. చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. చీరాల చేనేత క్లస్టర్కు రూ.4.17 కోట్లు మంజూరు చేశామని, చేనేత వస్త్రాలపై జీఎస్టీ మినహాయింపు ప్రతిపాదన పరిశీలనలో ఉందని తెలిపారు. ధర్మవరంలో రూ.38.31 కోట్లతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
కృష్ణా: పామర్రు మండలం కొండిపర్రు గ్రామంలో దారుణ ఘటన ఇవాళ చోటు చేసుకుంది. వేడి నీళ్లు కాస్తున్న సమయంలో తండ్రి సురేష్తో గొడవ పడిన కొడుకు మహేష్ కత్తితో దాడి చేశాడు. తండ్రిని మన వద్ద నరకడంతో తీవ్రంగా గాయపడిన సురేష్ను మచిలీపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోని ఆయన మృతి చెందాడు. కొడుకు మహేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ASR: డుంబ్రిగుడ సామాజిక భవనం వద్ద ఉన్న తాగునీటి బోరు రెండేళ్లుగా పాడై నిరుపయోగంగా మారిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోరు పాడవడంతో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామంటున్నారు.పలుమార్లు అధికారులకు తెలిపిన పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బోరును మరమ్మతు చేసి వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.
శ్రీ వాగ్దేవి కళా పీఠం వ్యవస్థాపకులు శ్రీనివాసమూర్తి ఈనెల 24న విజయనగరం జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారని తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షులు సముద్రాల గురు ప్రసాద్ పేర్కొన్నారు. ఆరోజు ఉదయం 10 గంటలకు గురజాడ పాఠశాలలో జరుగనున్న కార్యక్రమంలో తెలుగు భాషా ప్రాశస్త్యం అనే అంశంపై ప్రసంగిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అందరు హాజరు కావాలని కోరారు.
KRNL: ఆదోని శివారులోని ఇస్వీ రైల్వే బ్రిడ్జిపై ప్రమాదకర గుంతలు ఏర్పడి ప్రయాణికులకు ముప్పుగా మారాయి. రోజూ వాహనాలు ప్రమాదాలకు గురై పలువురు గాయపడుతున్నారు. గతంలో ప్రభుత్వం కేటాయించిన నిధులతో గుంతలు పూడ్చినా, నాణ్యత లోపంతో మళ్లీ పాత స్థితికి చేరాయి. ఆర్అండ్బీ అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
TPT: విజయవాడలోని ఏపీ అసెంబ్లీ క్రీడా మహోత్సవాలు ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, శాప్ (SAP) ఛైర్మన్ రవి నాయుడు గారితో క్రీడా వేదికలు, మైదానాల సదుపాయాలపై సమీక్ష నిర్వహించారు. అలాగే శ్రీకాళహస్తిలో ఆర్ట్స్ కాలేజీ మైదానాన్ని అభివృద్ధి చేయాలని శాప్ ఛైర్మన్కు విజ్ఞప్తి చేశారు. యువ క్రీడాకారులకు క్రీడా పరికరాలు అందించాలని కోరారు.
SKLM: కొత్తూరు మండల కేంద్రంలో దివంగత నేత, మాజీ కేంద్రమంత్రి కింజరాపు ఎర్రం నాయుడు 69వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి వైస్ ఎంపీపీ, టీడీపీ సీనియర్ నాయకులు లోతుగడ్డ తులసి వరప్రసాద్ నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజాసేవ, నిబద్ధత, రాజకీయ విలువలను స్మరించుకుంటూ, నేటి యువత మాజీ కేంద్రమంత్రి ఆశయ సాధనాలకు కృషి చేయాలన్నారు.
విజయనగరం విజ్జిస్టేడియంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలో గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ముఖ్యఅతిథిగా విజయనగరం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సమీక్ష సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్బంగా విజ్జి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో గల అన్నీ డిపార్ట్మెంట్లను గవర్నర్ పరిశీలించారు. వాటి పనితీరును, అభివృద్ధి, తదితర అంశాలపై స్పోర్ట్స్ అభివృద్ధి అధికారితో వివరాలు అడిగారు.
కృష్ణా: పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా పెడన పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై-2 సోమవారం బస్టాండ్ సెంటర్ వద్ద ఆటో డ్రైవర్లతో కౌన్సెలింగ్ నిర్వహించారు. రోడ్లపై ఆటోలను అడ్డంగా నిలిపివేయడం వల్ల ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయని తెలిపారు. ప్రయాణికులను ఎక్కించడం, దింపడం కోసం నిర్ణయించిన ప్రదేశాలనే ఉపయోగించాలని డ్రైవర్లకు సూచించారు.
అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ఓ.ఆనంద్ వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్ తదితర అధికారులతో కలిసి సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.