AKP: అనకాపల్లి గవరపాలెంలో వెలిసిన శ్రీనూకాంబిక అమ్మవారి దేవస్థానం మంగళవారం సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మూసివేశారు. ఉదయం ప్రత్యేక పూజలు అనంతరం ఆలయాన్ని మూసివేసినట్లు దేవస్థానం ఛైర్మన్ పీలా నాగశ్రీను, ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్ తెలిపారు. తిరిగి చంద్రగ్రహణం అనంతరం ఆలయాన్ని శుభ్రపరచి సంప్రోక్షణ చేసిన తర్వాత అమ్మవారి దర్శనాలు ఉంటాయని చెప్పారు.
VSP: విశ్వవిఖ్యాత పుణ్యక్షేత్రమైన సింహాచలంలో శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి ఆలయంలో మంగళవారం డోలోత్సవం వైభవంగా జరిగింది. తెల్లవారుజామున సుప్రభాత సేవల అనంతరం స్వామివారిని మెట్ల మార్గం ద్వారా కొండ దిగువకు తీసుకువచ్చారు. ముందుగా సోదరి పైడితల్లి అమ్మవారి ఆలయంకు విచ్చేసిన స్వామివారికి వివాహ ప్రార్థనలు నిర్వహించారు.
ATP: గుత్తి మండలం కొత్తపేట గ్రామంలో వెలిసిన హజరత్ యదుల్లా హ్ భాష ఖాద్రి ఉరుసు ఉత్సవాల సందర్భంగా రెండవ రోజు మంగళవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా గ్రామ పురవీధుల గుండా స్వామి గంధాన్ని మేళ తాళాలు నడుమ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం దర్గాలో స్వామి వారికి గంధాన్ని సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు, చక్కర చదివింపులు చేశారు.
అన్నమయ్య: బోరెడ్డిగారిపల్లిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు స్వయంగా విని, తక్షణ పరిష్కారం కోసం అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటామని మంత్రి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పలువురు మంత్రిని పుష్పగుచ్ఛాలతో సత్కరించారు.
KKD: అన్నవరం రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు అధికారులు ప్లాట్ఫామ్పై టైల్స్ అమరిక, సమతలీకరణ పనులు చేపట్టారు. ఇందుకోసం ఇసుక మోట్లు, నిర్మాణ సామగ్రి ప్లాట్ఫామ్పై సిద్ధంగా ఉంచారు. భవిష్యత్తులో మరింత సౌకర్యవంతమైన వాతావరణం అందించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.
VSP: మాజీ సీఎం వైఎస్ జగన్ ఈనెల 4న ఉమ్మడి విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు అరకు (M) తంగుల్గూడాలోని రాధాకృష్ణ ఆలయంలో MLA రేగం మత్స్యలింగం కుమారుడి వివాహానికి హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖ చేరుకుని రాణాప్రతాప్ నగర్లో మాజీ MLA వాసుపల్లి గణేశ్ నివాసానికి వెళ్లి ఇటీవల వివాహం చేసుకున్న నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు.
ELR: హోలీ పండగ సెలవు రోజైన ఉంగుటూరు మండలంలో అధికారులు ఇంటి పన్ను కులాయి పన్ను వసూళ్లలో నిమగ్నమై ఉన్నారు. ఉంగుటూరు డిప్యూటీ ఎంపీడీవో మంగళవారం పెద్ద వెల్లమిల్లి, చిన వెల్లమిల్లి, చింతాయిగూడెం గ్రామాలలో ఇంటి పన్ను, కుళాయి పన్ను వసూళ్లను పరిశీలించారు. వెల్లమిల్లి గ్రామపంచాయతీ అభివృద్దికి అప్పారావు, సచివాలయం, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
BPT: బాపట్ల విద్యా ప్రదాత కీర్తిశేషులు ముప్పలనేని శేషగిరిరావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ, ఆయన కుమారుడు శేషు సుమంత్ కుమార్, అభిమానులు మంగళవారం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మకు వినతి పత్రం అందించారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, త్వరలోనే విగ్రహ ఏర్పాటుకు తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
KDP: జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం చేపట్టిన స్టాప్, ఫేస్ వాష్ అండ్ గోకార్యక్రమం కొనసాగుతోంది. అర్ధరాత్రి తర్వాత ప్రయాణిస్తున్న లారీలు, బస్సులు, కార్లు, వ్యాన్ల డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించి అప్రమత్తంగా పంపిస్తున్నారు. డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలు నడపాలని, కుటుంబ సభ్యులను గుర్తుంచుకోవాలని పోలీసులు సూచించారు.
SKLM: నరసన్నపేట మేజర్ పంచాయతీ మార్కెట్ దరి గొడగల వీధి వద్ద సంవత్సరాల తరబడి చెత్త నిలువలు పేరుకు పోయాయని స్థానికులు తెలియజేశారు. పలుమార్లు గ్రామపంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోవడంలేదని వారు ఆరోపిస్తున్నారు. దుర్వాసనతో భరించలేకపోతున్నామని, పిల్లాపాపలతో అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
GNTR: చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం పెద్దకాకని శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన ద్వారం మూసివేయబడుతుందని ఆలయ స్థానాచార్యులు పొత్తూరి సాంబశివరావు తెలిపారు. ఉప ప్రధాన పేటేటి ధన మహేశ్వర ప్రసాద్, వేదపండితులు, అర్చకులు, కార్యాలయ సిబ్బంది బసవ శంకర్ తదితరులు పాల్గొన్నారు. గ్రహణం ముగిసిన తర్వాత శుద్ధి అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నారు.
కోనసీమ: రాజోలులో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని స్థానిక నాయకులు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పరిశీలించి సభ్యత్వం పొందడం వలన జనసేన పార్టీ అభిమానులకు రూ.5 లక్షల జీవిత భీమా లభిస్తుందని, పార్టీ పదవులలో సభ్యత్వం కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
TPT: నారాయణవనం మండలం తుంబూరు గ్రామపంచాయతీలో పథక సంచాలకులు పంట కాలువలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఉపాధి శ్రామికులకు 310 మంది వరకు పనులు వచ్చే విధంగా మార్కింగ్ ఇవ్వాలని, పనులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ప్రతి శ్రామికుడు వంద రోజుల ఉపాధిని పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
KDP: ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు మైదుకూరు పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ, వెంకట సుబ్బయ్య కాలనీ, సుందరయ్య నగర్ ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పాత నేరస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చి, వాహన పత్రాలు లేని 21 బైకులు, 6 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. నేరాల నివారణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.
AKP: కోటవురట్ల మండల సర్వసభ్య సమావేశం ఈనెల 9వ తేదీన నిర్వహించనున్నట్లు ఎంపీడీవో చంద్రశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటలకు ఎంపీపీ అప్పలనాయుడు అధ్యక్షతన జరిగే సమావేశానికి ఎంపీటీసీలు సర్పంచ్లను ఆహ్వానించడం జరిగిందని అన్నారు. అలాగే అధికారులు పూర్తి సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని కోరారు.