KDP: సిద్దవటం మండలంలోని మాచుపల్లి గ్రామంలో వెలిసిన శ్రీశ్రీ రేణుక యల్లమాంబకు ఆదివారం విశేష పూజలు జరిగాయి. ఈ సందర్భంగా.. ఆలయ అర్చకుడు సుబ్బరాజు అమ్మవారికి కుంకుమార్చన, పుష్పాభిషేకం,పలు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేశారు. పరిసర గ్రామాల మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించి అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
CTR: రాష్ట్ర రవాణాశాఖ, జిల్లా ఇంఛార్జ్ మంత్రి రాం ప్రసాద్ రెడ్డికి ఆదివారం డీటీసీ నిరంజన్ రెడ్డి పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. చిత్తూరు పర్యటనలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద టీడీపీ భవన నిర్మాణ భూమి పూజతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.
ELR: ఉంగుటూరు గ్రామంలో సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు నారాయణపురం ఏఈ శ్రీరామ్ ఆదివారం తెలిపారు. కొత్త ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు, కొత్త విద్యుత్తు లైన్ వేస్తామన్నారు. ఊర చెరువు దగ్గర నుంచి ప్రాథమిక పాఠశాల వన్, అంబేద్కర్ బొమ్మ దగ్గర, బాబు జగజ్జీవన్ రావు బొమ్మ ఏరియాలో నిలుపుదల చేస్తున్నామన్నారు.
ASR: జీసీసీ గోడౌన్ నుంచి రేషన్ సరుకులను త్వరితగతిన రేషన్ దుకాణాలకు సరఫరా చేయాలని కొయ్యూరు మండల తహసీల్దార్ పీ.మురళీ బాబు సంబంధిత అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం ఆయన కృష్ణదేవి పేటలో ఉన్న గోడౌన్ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం రేషన్ సరుకులను తనిఖీ చేశారు. రేషన్ సరుకుల పంపిణీలో అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రకాశం: ఎర్రగొండపాలెం టీడీపీ కార్యాలయంలో ఆదివారం 117 మందికి రూ. 75 లక్షలు విలువ చేసే చెక్కులను లబ్ధిదారులకు టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అందజేశారు. పేద కుటుంబాల ఆరోగ్యానికి భరోసాగా ఉండేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎరిక్షన్ బాబు వెల్లడించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎరిక్షన్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
కోనసీమ: ఐ.వీ.ఆర్.ఎస్ సర్వేలో మండపేటకు రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం లభించడం పట్ల ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎటువంటి ఉత్తమ ఫలితాలు సాధించలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం వరుసగా రెండు సార్లు మండపేట మున్సిపాలిటీకి అవార్డు దక్కడం ఆనందంగా ఉందన్నారు.
గుంటూరు: పొన్నూరు మండలం వెల్లలూరులోని శ్రీ అంకమ్మ తల్లి దేవస్థానంలో నిర్వహించిన వార్షిక మహోత్సవం, పొంగళ్ల నైవేద్య కార్యక్రమంలో ఎమ్మెల్యే, సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ పాల్గొన్నారు. అమ్మవారికి నూతన వస్త్రాలు, పండ్లు సమర్పించి ఆశీర్వచనం పొందారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
TPT: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయడు, కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ను మర్యదపూర్వకంగా కలిసారు. మైక్రో ఇరిగేషన్ నిధుల విడుదలపై అచ్చెన్నాయడు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసారు. త్వరితగతిన మిగిలిన రూ.645 కోట్లు కేంద్ర వాటా విడుదల చేయాలని కోరారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలో నిధులు విడుదలకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
CTR: సదుంలో తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయనను కలిశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారికి ఆయన సూచించారు. పలువురు తమ సమస్యలు విన్నవించగా, పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
PPM: విజయనగరం తోటపాలెం ఎస్సీ కాలనీకి చెందిన అంబేద్కర్ వాది, బహుజననాయకులు బోక ఆంజనేయులు ఆదివారం విజయవాడజై భీమ్ రావు భారత్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జై బీమ్ పార్టీలో చేరారు. ఏపీ రాష్ట్ర జై భీమ్ రావు భారత్ పార్టీ వ్యవస్థాపకులు జాడ శ్రావణ్ కుమార్, విజయనగరం జిల్లా ఇంచార్జ్ దుర్గారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.
CTR: తొలితరం స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని జిల్లా సాయుధ దళం కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ఏఆర్ అడిషనల్ ఎస్పీ దేవదాస్ పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. రాయలసీమలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఉయ్యాలవాడ అందరికీ ఆదర్శమని వెల్లడించారు.
కృష్ణా: కోడూరు మండలం హంసలదీవి బీచ్కు ఆదివారం విజయవాడ, బాపట్ల, గుంటూరు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు కుటుంబ సమేతంగా విచ్చేసి సముద్ర స్నానాలు చేస్తూ సరదాగా గడిపారు. పర్యాటకుల తాకిడితో బీచ్ కళకళలాడింది. పర్యాటకులు స్నానాలు చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై పాలకాయతిప్ప మెరైన్ పోలీసులు సూచనలు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గస్తీ నిర్వహించారు.
KRNL: గోనేగండ్ల మం. గంజహళ్లి గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీశ్రీ సద్గురు బడేసాహెబ్ ఉరుసు సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇవాళ DSPభార్గవి, CI చంద్రబాబు, ఎమ్మిగనూరు టౌన్ CI శ్రీనివాసులు సిబ్బందితో సమావేశమై పలు కీలక సూచనలు చేశారు. దర్గా పరిసరాల్లో విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, భద్రతా దృష్ట్యా 146మంది సిబ్బంది పాల్గొంటారు.
E.G: పెరవలి మండలం కాకరపర్రు గ్రామం నందు శ్రీ ఆదివారం జరిగిన గంటాలమ్మ దేవి అమ్మవారి వాయ ప్రతిష్ట మహోత్సవాలలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ పనులను పరిశీలించారు. నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్కు మంత్రి సూచించారు.