దేశంలో 4 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సాధారణ జలుబుకు ఉపయోగించే రెండు ఫ్లూ సిరప్లను భారత ప్రభుత్వం నిషేధించింది. అంతేకాదు వాటిపై హెచ్చరిక లేబుల్స్ కూడా ప్రచురించాలని తెలిపింది.
భారత స్టాక్ మార్కెట్లు నేడు తిరోగమనం దిశగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సూచీలు పెద్ద ఎత్తున నష్టాల్లో దూసుకెళ్తున్నాయి. కానీ నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం లాభాల్లో కొనసాగుతుండటం విశేషం.
హైదరాబాద్ నగర వినియోగదారులు ఇప్పుడు వారి లెటర్లతో పాటు పార్శిళ్లను వారి ఇంటి వద్ద నుంచి సేకరించేలా స్పీడ్ పోస్ట్ సర్వీస్ను తెలంగాణ పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రారంభించింది.
ఈ సంవత్సరం అత్యధికంగా సంపాదించిన వారి లిస్ట్లో అదానీ, అంబానీలను వెనక్కి నెట్టి సావిత్ర జిందాల్ ముందంజలో ఉన్నారు. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ఈ జాబితాను విడుదల చేసింది.
భారత స్టాక్ మార్కెట్లు డిసెంబర్ 19న నష్టాల్లో దూసుకెళ్తున్నాయి. అయితే ఉదయం లాభాలతో మొదలు కాగా..కాసేపటి తర్వాత పలు స్టాక్స్ నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, వచ్చే ఏడాది కూడా 6.3 శాతం వృద్ధి నమోదు చేస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) అంచనాలను వెల్లడించింది. దీంతోపాటు భారత ఆర్థిక వ్యవస్థ గురించి కీలక విషయాలను గుర్తు చేసింది.
ఈమధ్యకాలంలో పెద్ద పెద్ద కంపెనీలు సైతం నిధుల సమీకరణ కోసం ఐపీఓలకు వెళ్తున్నాయి. తాజాగా ఈ వారంలో 11 కంపెనీలు ఐపీఓలకు వస్తున్నట్లు తెలిపాయి. వచ్చే ఏడాది ఐపీఓకు వచ్చేందుకు 65 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి.
భారత స్టాక్ మార్కెట్లో వరుసగా రెండో రోజు ట్రేడింగ్ సెషన్లో భారీ పెరుగుదల కనిపించింది. ఐటీ షేర్లలో జోరుగా సాగిన కొనుగోళ్ల కారణంగా సెన్సెక్స్ 1000 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లు ఎగబాకాయి. ఇది ఐటీ ఇండెక్స్లో అతిపెద్ద పెరుగుదల.
భారతీయ స్టాక్ మార్కెట్లు నేడు కూడా లాభాలతో దూసుకెళ్తున్నాయి. మార్కెట్ ప్రారంభం నుంచే లాభాల దిశగా కొనసాగుతున్నాయి. నిన్న గరిష్టా స్థాయికి చేరుకున్న మార్కెట్లు ఈరోజు కూడా సానుకూలంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ స్టాక్స్ లాభాల్లో ఉన్నాయో ఇక్కడ చుద్దాం.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలకు మరో దెబ్బ తగిలింది, CNG ధర 1 రూపాయి పెరిగింది. నేటి నుంచి ఢిల్లీలో సీఎన్జీ ధరలు పెరిగి కిలో రూ.76.59కి చేరాయి.
రూపే క్రెడిట్ కార్డును యూపీఐకి లింక్ చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. చాలా మంది వాడుతున్నారు కూడా.. దీంతో సానుకూల అంశాలు చాలానే ఉన్నాయి. అలాగే కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు.