• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy

అదానీ ఎఫెక్ట్, రెండ్రోజుల్లో 10 లక్షల కోట్లు ఫట్

భారతీయ స్టాక్ మార్కెట్లు గతవారం రెండు సెషన్లలోనే రూ.10 లక్షల కోట్ల మేర నష్టపోయాయి. ఇందుకు ప్రధాన కారణం హిండేన్ బర్గ్ రీసెర్చ్ ఇటీవల అదానీ గ్రూప్ పైన సంచలన ఆరోపణలు చేయడమే. ఈ రీసెర్చ్ సంస్థ దెబ్బతో అదానీ స్టాక్స్ కుప్పకూలాయి. ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న గౌతం అదానీ ఇప్పుడు 7వ స్థానానికి పడిపోయాడు. అదానీ గ్రూప్ మార్కెట్ వ్యాల్యూ రూ. 4 లక్షల కోట్లకు పైగా క్షీణించింది. న్యూయార్క్ కేంద్రంగా ప...

January 29, 2023 / 12:57 PM IST

అదానీ గ్రూప్ పై తీవ్ర ఆరోపణలు, షేర్లు ఢమాల్

అదానీ గ్రూప్ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అప్పులకుప్పలా మారిన గ్రూప్‌ కంపెనీల ఆర్థిక సత్తాపై అమెరికాకు చెందిన హిడెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ సంస్థ సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లోను మోసం చేస్తోందని ఆ అమెరికా సంస్థ ఆరోపించింది. అదానీ ఎంటర్ ప్రైజేస్ త్వరలో రూ.20,000 కోట్ల మలిదశ ఐపీవో జరగనున్న నేపథ్యంలో ఈ ఆరోపణలు గమనార్హం. ఈ రీసెర్చ్ నేపథ్యంలో ...

January 26, 2023 / 02:34 PM IST

బీఎస్ఎన్ఎల్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్..

ఇంటర్నెట్ ప్రొటోకాల్ టెలివిజన్ (ఐపీటీవీ) సర్వీసులను ప్రారంభిస్తున్నట్టు బీఎస్ఎన్ఎల్ తెలిపింది. సిటీ మీడియాతో కలిసి ఉల్కా టీవీ పేరుతో విజయవాడలో ఇటీవల ఈ సర్వీసులను ప్రారంభించింది. త్వరలోనే ఏపీ సర్కిల్‌లోని బీఎస్‌ఎన్ఎల్ ఖాతాదారులకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సేవల ద్వారా వెయ్యికిపైగా టీవీ చానళ్లను వీక్షించే అవకాశం లభిస్తుంది. టీవీకి వేరుగా, బ్రాడ్‌బ్యాండ్ కోసం వేరుగా రెండు వేర్వేరు కనెక్షన్...

January 24, 2023 / 08:20 AM IST

అమెజాన్ కార్గో విమానం ‘ప్రైమ్ ఎయిర్’ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ శంషాబాద్ లో అమెజాన్‌ ఎయిర్‌కార్గో విమానమైన ప్రైమ్‌ ఎయిర్‌ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.అమెజాన్ ఎయిర్ ను ప్రారంభించడం భారతీయ ఇ-కామర్స్ పరిశ్రమలో గొప్ప లక్ష్యమని ఆయన అన్నారు. భవిష్యత్తులో అమెజాన్ చేపట్టబోయే కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో అమెజాన్‌ బృందాన్ని అభినందించారు. అమెజాన్‌ అతిపెద్ద క్యాంపస్‌...

January 23, 2023 / 05:49 PM IST

‘మహానటి’ సావిత్రి ఇల్లు కొన్న లలితా జ్యువెలర్స్ యజమాని

బంగారం వ్యాపారంలో లలితా జ్యువెలర్స్ ధోరణి భిన్నం. ప్రజలను ఆకర్షించడంలో లలితా జ్యువెలర్స్ ఎండీ కిరణ్ కుమార్ ప్రత్యేకత చాటుతున్నారు. ‘డబ్బులు ఊరికే రావు’ అనే డైలాగ్ తో తెలుగు రాష్ట్రాల్లో సంచలనాలకు మారుపేరైన కిరణ్ కుమార్ వ్యాపారం విజయవంతంగా సాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశంలో ఇతర ప్రాంతాల్లో తన స్టోర్లను పెంచుకుంటూ తన వ్యాపారాన్ని విస్తరిస్తున్నాడు. అయితే తన విజయం వెనుక ఒకరు ఉన్నారని ...

January 21, 2023 / 05:00 PM IST

తెలంగాణలో అమెజాన్ 36 వేల కోట్ల పెట్టుబడి

తెలంగాణకు పెట్టుబడుల వరద కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక విధానాలు పారిశ్రామికవేత్తలను, అగ్రశ్రేణి సంస్థలను ఆకర్షిస్తున్నాయి. దావోస్ వేదికగా పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండగా.. ప్రముఖ అంతర్జాతీయ ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ పెట్టుబడిని ప్రకటించింది. 2030 నాటికి ఏకంగా రూ.36, 300 కోట్ల పెట్టుబడులు చేయనున్నట్లు వెల్లడించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సెంటర్ ఈ పెట్టుబడులు పెట్టనున్...

January 20, 2023 / 09:27 PM IST

గూగుల్ ఉద్యోగులకు షాక్..12 వేల మంది తొలగింపు?

ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూ ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి. టెక్ దిగ్గజం గూగుల్ కూడా అదే బాటలో నడుస్తోంది. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ 6 శాతం మంది ఉద్యోగులపై వేటుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ నిర్ణయంతో 12 వేల మంది ఉద్యోగాలు కోల్పోనున్నట్టు తెలుస్తోంది. గూగుల్ గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులను ఆకర్షిస్తూ క్రోమ్ సెర్చ్ ఇంజిన్, యూట్యూబ్, ఇతర వేద...

January 20, 2023 / 09:02 PM IST

240 రంగులు మార్చే బీఎండబ్ల్యూ కారు..వీడియో వైరల్

బీఎండబ్ల్యూలో సరికొత్త కారు అందుబాటులోకి రానుంది. జర్మనీ కార్ల తయారీ దిగ్గజం బీఎండబ్ల్యూ ఓ సరికొత్త మోడల్ ను ఆవిష్కరించింది. ఆయా పరిస్థితులను బట్టీ 240 రంగులను ఆ కారు మార్చనుంది. ఈ కారును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. Dee comes full colour 🔴⚪️🟡🟢🔵Introducing the BMW i Vision Dee with full-colour E Ink technology. The tech allows for a vibrant, individually configurable exterior with up to [&hell...

January 20, 2023 / 08:16 PM IST

హైదరాబాద్ లో భారీ ఆఫీస్ స్థలాన్ని కొన్న దిగ్గజ సంస్థ

విశ్వనగరం దిశగా హైదరాబాద్ వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రపంచంలోని దిగ్గజ సంస్థలు హైదరాబాద్ లో కొలువుదీరుతున్నాయి. డేటా కేంద్రాలకు అడ్డాగా.. దేశంలోనే ఐటీకి ప్రధాన నగరంగా.. లైఫ్ సైన్సైస్, టీకాలకు కేంద్రంగా మారిన హైదరాబాద్ దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతోంది. దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడులు వెల్లువగా వస్తుండగా.. ప్రముఖ సంస్థలన్నీ హైదరాబాద్ లో కార్యకలాపాలు మొదలుపెడుతున్నాయి. ఇప్పటికే ప్రఖ్యాత సంస్...

January 20, 2023 / 04:55 PM IST

స్విగ్గీ షాకింగ్ నిర్ణయం.. భారీగా ఉద్యోగుల తొలగింపు

ప్రపంచవ్యాప్తంగా ప్రైవేటు కంపెనీలు ఉద్యోగాల కోతపై ఫోకస్ పెట్టాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఒక విధమైన భయాందోళన వాతావరణం కమ్ముకుంది. దీంతో దిగ్గజ సంస్థలతో పాటు స్టార్టప్ కంపెనీలు కూడా ఉద్యోగులను ఇంటి బాట పట్టిస్తున్నాయి. ఇటీవల మైక్రోసాఫ్ట్, అమెజాన్, ట్విటర్, షేర్ చాట్ వంటి సంస్థలు తమ ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించగా.. తాజాగా ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ కూడా ఉద్యోగులను సాగనంపింది. దాదాపు 400 మంది ఉద్యోగు...

January 20, 2023 / 02:58 PM IST

కనీవినీ ఎరుగని రీతిలో అనంత్ అంబానీ నిశ్చితార్థం

అపర కుబేరుడు.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. అతడి కుమారుడు అనంత్ అంబానీ నిశ్చితార్థ వేడుక రాధికా మర్చంట్ తో గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. భారీ ఖర్చుతో ప్రపంచంలో దొరికే అత్యంత అరుదైన పూలతో సుందరంగా ముంబైలోని అతడి నివాసాన్ని అలంకరించారు. గుజరాతీ సంప్రదాయం ప్రకారం నిశ్చితార్థ వేడుక నిర్వహించారు. ముంబైలోని నివాసంలో సంప్రదాయబద్ధంగా జరిగ...

January 19, 2023 / 08:11 PM IST

మళ్లీ నష్టాల్లోకి జారుకున్న స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. రెండు రోజుల పాటు లాభాలతో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్లకు నేడు బ్రేక్ పడినట్లయ్యింది. గురువారం ఉదయం నుంచి నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు సాయంత్రం వరకూ కూడా అదే హవాను కొనసాగించాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 187 పాయింట్లు, నిఫ్టీ 57 పాయింట్లు నష్టపోయింది. టాటా స్టీల్ 0.73%, పవర్ గ్రిడ్ 0.64%, టెక్ మహీంద్రా 0.49%, యాక్సిస్ బ్య...

January 19, 2023 / 05:21 PM IST

కేంద్ర పద్దులో ఈ 5 ఉంటే.. ప్రజలకు తీపి రోజులే

బడ్జెట్ సమావేశాలకు సమయం సమీపిస్తోంది. వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో ఈ ఏడాది (2023) ప్రవేశపెట్టేది పూర్తిస్థాయి బడ్జెట్. ఎన్నికల నేపథ్యంలో కేంద్రం తమపై కరుణ చూపిస్తుందని సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆశిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. కిల్లీ కొట్టు నుంచి స్టాక్ మార్కెట్ దాకా కేంద్ర బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెంచుకుని ఉంటాయి. అయితే బీజేపీ సారథ్యంల...

January 19, 2023 / 04:46 PM IST

బెంగళూరును హైదరాబాద్ దాటేసింది: కేటీఆర్

ఐటీ ఉద్యోగ కల్పనలో బెంగళూరును తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ దాటి వేసిందని మంత్రి కేటీ రామారావు అన్నారు. అయితే ఇక్కడ బెంగళూరును తక్కువ చేసి చూపించాలనేది తన ఉద్దేశ్యం కాదని, తాము అధికారంలోకి వచ్చాక అన్నింటా అభివృద్ధి దూసుకు వెళ్తోందన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగంలో 5 మిలియన్ ఉద్యోగాలు ఉంటే, ఇందులో 1 మిలియన్ ఉద్యోగాలు కేవలం హైదరాబాద్, తెలంగాణ నుండే ఉన్నాయన్నారు. అంటే 20 శాతం హైదరాబాద్ నుండి ఉంద...

January 9, 2023 / 08:51 PM IST

రూ.80,000 క్రాస్ చేసి, రికార్డ్ ధర పలికిన ఎండుమిర్చి

ఎండు మిర్చి బంగారంతో పోటీ పడటం కాదు.. బంగారాన్ని మించి ఒకటిన్నర రెట్లు పలికింది! మార్కెట్‌లో ఎండు మిర్చికి మంచి డిమాండ్ కనిపిస్తోంది. దిగుమతి తగ్గడం, పచ్చళ్ల సీజన్ సమీపిస్తుండటంతో ఎండు మిర్చి రికార్డు ధర పలుకుతోంది. శుక్రవారం ఎనుమాముల మార్కెట్‌లో ఎండు మిర్చి ధర క్వింటాల్‌కు ఏకంగా రూ.80,100 పలికింది. అయితే అన్ని రకాల మిర్చికి ఈ ధర రాలేదు. పచ్చళ్లు, ఔషదాలలో వినియోగించే ఓ రకమైన మిర్చి ఆసియా అతిపెద...

January 6, 2023 / 09:33 PM IST