ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో కలకలం రేపింది. సీఎం జగన్ పాలనలో విద్యార్థులకు రక్షణ లేదని ఆరోపించారు. ర్యాగింగ్ ను అరికట్టాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. జగన్ పాలనలో గతంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయని తెలిపారు. అయినా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కళాశాలలో ఆగడాలు పెరిగిపోతున్నాయని.. వెంటనే కళాశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
శివసేన (shiv Sena) పార్టీలోని ఉద్ధవ్ థాక్రే గ్రూప్ కు (Uddhav Thackeray) చెందిన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్(Sanjay Raut)ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన పార్టీ గుర్తు కోసం 2000 కోట్లు చేతులు మారాయని తీవ్ర ఆరోపణలు చేశారు.
నందమూరి కుటుంబ సభ్యుడు, నటుడు తారకరత్న మృతి పైన వైసీపీ నేత నందమూరి లక్ష్మీ పార్వతి షాకింగ్ కామెంట్స్ చేసారు. ఇన్నాళ్లు ఆయన మృతిని దాచి పెట్టారు అని సంచలన ఆరోపణ చేశారు.
నందమూరి తారకరత్న చివరి ప్రసంగం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. గత నెల 27వా తేదీన తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చారు తారకరత్న. ఆ సమయంలో అస్వస్థత ఏర్పడి హాస్పిటల్ కు తరలించారు. విషమంగా ఉండడంతో అక్కడి నుండి బెంగళూరు నారాయణ హృదయాలయకు తరలించారు. అక్కడ 23 రోజుల చికిత్స అనంతరం ఆయన కన్నుమూశారు. అయితే ఆయన చివరి ప్రసంగం ఇప్పుడు వైరల్ గా మారింది. మన...
తెలంగాణలోని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్నాయక్ 2,170 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే అందులో 2,100 ఎకరాలు కబ్జా చేశారని వైఎస్సార్సీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆరోపించారు. ఇలాంటి కబ్జా అంశంపై ఏ పార్టీ నేతలు కూడా ప్రశ్నించలేదని..కానీ తాను అడిగినందుకు దాడులు చేయిస్తున్నారని పేర్కొన్నారు.
సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ 6 వికెట్లతో సౌరాష్ట్రను ఆదివారం బెంగాల్పై తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించడానికి మార్గనిర్దేశం చేశాడు. దీంతో నాల్గవ రోజున మూడు సీజన్లలో రెండో టైటిల్ ను బెంగాల్ పై విజయం సాధించి గెలుపొందారు. ఈ క్రమంలో ఈడెన్ గార్డెన్స్లో రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర గెలుపొందింది.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన వినరో భాగ్యము విష్ణు కథ మూవీ శనివారం(ఫిబ్రవరి 18న) విడుదల కాగా...తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 2.75 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు.
హైదరాబాద్ అంబర్ పేట పోలీస్ స్టేషన్ గ్రౌండ్ దగ్గర ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగార్థులు నిరసన చేపట్టారు. హైకోర్టు ఆదేశం ప్రకారం మ్యాన్యువల్ గా హైట్ చెక్ చేయకుండా మళ్లీ డిజిటల్ మీటరే ఉపయోగించి తమను డిస్ క్వాలిఫై చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. మరోవైపు లాంగ్ జంప్, షాట్ పుట్ కూడా ఎక్కువగా పెట్టి తమకు డిస్ క్వాలిఫై చేశారని ఇంకొంత మంది వాపోయారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ (contonment) బీఆర్ఎస్ (brs) ఎమ్మెల్యే సాయన్న కన్నుమూశారు. కొంత కాలంగా గుండె, కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్న ఆయన యశోద హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. ఆయన నాలుగు సార్లు కంటోన్మెంట్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు తెలుగు దేశం పార్టీ నుండి గెలిచిన ఆయన 2014 తర్వాత బి అర్ ఎస్ పార్టీలో చేరారు. 2018లో మరోసారి అదే పార్టీ నుండి విజయం సాధించారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy 2023)లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా టీమిండియా(Team India) రెండో టెస్టులోనూ ఘన విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో ఆసీస్ ను టీమిండియా(Team India) మట్టికరిపించింది.
సినీ నటుడు తారకరత్న భౌతికకాయనికి ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని నివాళులు అర్పించారు.
అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 25,000 పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ... సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్ రికార్డులను అధిగమించాడు.
బంధుత్వాలు వేరు.. రాజకీయాలు వేరు అని ఈ ఇద్దరు నేతలు చాటారు. రాజకీయపరంగా కొట్లాడాలి కానీ కుటుంబపరంగా కలిసి ఉండాలని.. మిత్రులపరంగా కూడా కలిసి ఉండాలనేది వాస్తవం. ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్నా వైఎస్సార్ తో చంద్రబాబు ఆప్యాయంగా మాట్లాడేవారు. వీరిద్దరూ రాజకీయంగా యుద్ధమే చేసేవాళ్లు. కానీ రాజకీయాలను పక్కన పెడితే వీరిద్దరూ చాలా మంచి స్నేహితులు.
పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దీంతో ద్రవ్యోల్బణం(inflation) క్రమంగా పెరుగుతోంది. దీంతో నిత్యావసరాల ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో చికెన్ 700 రూపాయలు దాటగా, లీటర్ పాలు రూ.200కు చేరాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ ఇప్పటికే దివాళా తీసిందని దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. ఖర్చులను తగ్గించుకునేందుకు రెండు గోల్ఫ్ క్లబ్లను విక్రయించనున్నట్లు చెప్పారు.
పరామర్శ సమయంలో చంద్రబాబు వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో కూడా మాట్లాడుకోవడం ఆసక్తికరం. ఈ సందర్భంగా వారిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. తారకరత్నకు అందించిన వైద్యం, అంత్యక్రియలు తదితర అంశాలపై మాట్లాడుకున్నట్లు తెలుస్తున్నది. విజయసాయిరెడ్డి తారకరత్న బంధువు. అందుకే దగ్గరుండి తారకరత్న కార్యక్రమాలు చూసుకుంటున్నారు.