దేశంలో ప్రధానంగా ఐటీ, బ్యాంకింగ్ రంగాల ఆదాయాల నివేదికలు రానున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు(indian stock market) సోమవారం నష్టాలను చవిచుశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్(Sensex) 520 పాయింట్లు కోల్పోవగా, నిఫ్టీ(nifty) 121 పాయింట్లు నష్టపోయింది.
ఏపీ నేతలు చేతనైతే ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు సహా పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం పోరాడాలని తెలంగాణ మంత్రి హరీశ్ రావు(Harish Rao) వ్యాఖ్యానించారు.
వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి స్వల్ప ఊరట కలిగింది. సీబీఐ విచారణ వాయిదా పడింది. రేపు ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని అధికారులు సమాచారం ఇచ్చారు.
తమిళ్ స్టార్ హీరో విక్రమ్(chiyaan Vikram) బర్త్ డే సందర్భంగా తాను యాక్ట్ చేస్తున్న తంగలన్(Thangalaan) చిత్రం నుంచి సరికొత్త లుక్ వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు చిత్ర బృందం మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో చూస్తే ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెరుగుతుంది.
ఆర్ మాధవన్ తనయుడు వేదాంత్ భారత్ తరఫున ఐదు గోల్డ్ మెడల్స్ సాధించడంపై నటి లారా దత్తా, నటుడు సూర్య, నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సహా పలువురు ప్రశంసించారు.
ఇటీవలే ‘RRR మూవీలో కనిపించిన స్టార్ హీరో రామ్ చరణ్(Ram Charan) తన తర్వాత చిత్రంలో కూడా డ్యూయెల్ రోల్(dual role) చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ ఛేంజర్లో చెర్రీ రెండు క్యారెక్టర్లు చేస్తున్నారు. దీంతోపాటు తర్వాత బుచ్చిబాబు(Buchi Babu Sana) డైరెక్షన్లో రాబోతున్న మూవీలో కూడా రామ్ చరణ్ డ్యూయెల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ మంత్రి హరీశ్ రావుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. ఇటీవల హరీశ్ చేసిన కామెంట్స్పై ఏపీ మంత్రులు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. మంత్రుల కామెంట్స్ తెలంగాణ ప్రజలను కించపరిచేలా ఉన్నాయని పవన్ అంటున్నారు.
ఏపీ సీఎం జగన్.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో సమావేశం అయ్యారు. వివేకా హత్య కేసులో తాజా పరిణామాలపై వీరు చర్చిస్తున్నట్టు తెలిసింది.
నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత.. కొన్నాళ్లు సమంత డిప్రెషన్లోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సామ్(Samantha) కొన్ని మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటునే ఉంది. ఇక ఈ మధ్యలో మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి సమంత డిప్రెషన్లోకి వెళ్లిందంటూ.. ఓ బాలీవుడ్ క్రిటిక్ చేసన ట్వీట్ వైరల్గా మారింది.
మొహంపై జాతీయ పతాకం పెయింటింగ్ వేసుకున్న బాలికను స్వర్ణ దేవాలయంలోకి అనుమతించలేదు. దానికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ప్రబంధక్ కమిటీ క్షమాపణ చెప్పింది.
ఈ సభ ద్వారానే కమలం పార్టీ ఎన్నికలకు శంఖారావం పూరించే అవకాశం ఉంది. ఈ పర్యటనలోనే కీలకమైన నాయకులను పార్టీలో చేర్పించుకునేందుకు చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ బృందం సిద్ధమైంది.