AP: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని తుఫాన్ వెహికల్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడులో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. విశాఖ నుంచి ఒడిశా వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.