మహారాష్ట్రలోని ముంబైలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయింది. ఏకంగా రూ.200 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను మీరా రోడ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఫ్యాక్టరీలో గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ ఆపరేషన్లో భారీ ఎత్తున డ్రగ్స్ నిల్వలు బయటపడటం కలకలం రేపుతోంది.