VSP: పెద్ద వాల్తేరుకు చెందిన 11 ఏళ్ల పీ.చరణ్ తేజ హాస్టల్ నుంచి అదృశ్యమయ్యాడు. కాకినాడ జిల్లా కరప మండలంలోని బీసీ బాలుర హాస్టల్లో 6వ తరగతి చదువుతున్న అతన్ని ఈనెల 27న మధ్యాహ్నం హాస్టల్ వద్ద తల్లి దింపి వెళ్లింది. అయితే రాత్రి కనిపించకపోవడంతో హాస్టల్ ప్రిన్సిపల్ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.