CTR: కుప్పం మున్సిపాలిటీ సామగుట్ట పల్లెకు చెందిన ముత్తు భార్య లక్ష్మి పట్టణంలోని ఓ ప్రైవేటు లాడ్జిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 3 రోజులుగా లక్ష్మీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికారు. అయితే 3 నెలలుగా లాడ్జిలో రూమ్ తీసుకుని వచ్చిపోయేదని తెలుసుకున్నారు. లాడ్జి తలుపులు బద్దలు కొట్టగా అప్పటికే ఉరి వేసుకుని చనిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.