ఢిల్లీ నుంచి లేహ్ వెళ్లిన ఇండిగో విమానం(6E 2006)లో సాంకేతిక లోపం తలెత్తింది. ఉ.6:30 గంటలకు బయల్దేరిన విమానం, లేహ్కు చేరుకునే సమయంలో సమస్య రావడంతో పైలట్లు ఢిల్లీ విమానాశ్రయానికి మళ్లించారు. దాదాపు 180 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్న ఈ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఇది అత్యవసర ల్యాండింగ్ కాదని, అన్ని భద్రతా ప్రోటోకాల్స్ పాటించబడ్డాయని ఇండిగో స్పష్టం చేసింది.