SRD: విద్యార్థుల సౌకర్యార్థం పాఠశాల ఆవరణలో క్రీడా ప్రాంగణాన్ని సైతం ఆధునికరిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో 37 లక్షల 50 వేల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన అదనపు తరగతులను ఎమ్మెల్యే ప్రారంభించారు.