SRPT: జిల్లా కేంద్రం లో గురువారం పది గంటలకే బ్యాంకుల వద్ద జనం వందల సంఖ్యలో చేరుకున్నారు. రైతులు పంటలు అమ్మిన డబ్బులు తీసుకోవడానికి పెద్ద సంఖ్యలో బ్యాంకుల వద్దకు చేరుకుంటున్నారు. మరో పక్కన బంగారు రుణాలు చెల్లించడానికి ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారు. డబ్బులు కట్టినప్పటికీ రెండు రోజుల వరకు ఆభరణాలు తిరిగి ఇవ్వడం లేదుని ప్రజలు వాపోతున్నారు.