ATP: పట్టణంలోని రాజీవ్నగర్ కాలనీకి చెందిన ఎస్కే హుస్సేన్ బాపట్ల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అక్కడి పోలీసులు తెలిపిన మేరకు రోడ్డు వెంబడి ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్నటువంటి హుస్సేన్ అక్కడికక్కడే మృతి చెందారు.