NLG: నకిరేకల్ లో ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో గురువారం లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. జై భీమ్, జై సంవిధాన్, జై బాపు అనే నినాదాల ఉన్న ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. దేశవ్యాప్త పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను తెలుసుకొని దేశానికి దిక్సూచిగా నిలిచారని కొనియాడారు.