BDK: అశ్వాపురం మండలంలోని గొందిగూడెం వద్ద ఇసుక వాగు మీద నిర్మితమైన నూతన బ్రిడ్జిని గురువారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి పూజలు నిర్వహించి రిబ్బన్ కత్తిరించి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ బ్రిడ్జి ద్వారా పలు గ్రామాల ప్రజలకు రాకపోకలు సౌకర్యవంతంగా మారనున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.