W.G: మొగల్తూరు మండలం మోళ్ళపర్రు బీచ్ రోడ్డు వద్ద నిన్న రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. గాయపడిన వారిని స్థానికులు నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఘటనలకు ససంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.