MHBD: జిల్లా గార్ల మండలం పాత పోచారం గ్రామానికి చెందిన పసుపులేటి నరేష్ (26) ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగించేవాడు. మద్యపానం ఎక్కువైందని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన నరేష్ పురుగుల మందు తాగి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి రామయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎస్కో రియాజ్ పాషా తెలిపారు.