• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సివిల్ జడ్జి కోర్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానం

NTR: తిరువూరులో 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హై కోర్ట్ జడ్జి చీకటి మానవేంద్ర రాయ్‌ను బార్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి జనార్ధన రావు, కృష్ణా రెడ్డి కలసి ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు వెంకటరెడ్డి, హేమంత్ కుమార్, నవీన్ తదితరులు ఉన్నారు.

April 28, 2026 / 05:43 PM IST

ఇంధన కొరతపై వైసీపీ నిరసన

SKLM: రాష్ట్రంలో ఇంధన కొరత ప్రభుత్వ అసమర్థత ఫలితమని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. మందస మండలం హరిపురం ఫ్లైఓవర్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ లభించక వాహనదారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వారం రోజులుగా బంకుల వద్ద క్యూలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.

April 28, 2026 / 05:41 PM IST

‘RU పరిధిలోని కళాశాలలకు మే 1 నుంచి వేసవి సెలవులు’

KRNL: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ యూజీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ, M.Ed, MPEd, లా కళాశాలలకు మే 1వ తేదీ నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు మంగళవారం వీసీ ప్రొఫెసర్ వెంకట బసవరావు తెలిపారు. మే 1 నుంచి జూన్ 14వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. అటు, జూన్ 15వ తేదీన కళాశాలలు పునఃప్రారంభమవుతాయని ఈ మేరకు వీసి వెల్లడించారు.

April 28, 2026 / 05:40 PM IST

‘అక్రమ అడ్మిషన్లు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి’

ATP: గుంతకల్లు ఎంఈవో మస్తాన్ రావుకు PDSU విద్యార్థి సంఘం నాయకులు మంగళవారం వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గ కార్యదర్శి వినోద్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై, ప్రైవేట్ టీచర్లను ఇంటింటా అక్రమ అడ్మిషన్లకు పంపిస్తున్న పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

April 28, 2026 / 05:40 PM IST

‘మేడే ఉత్సవాలను విజయవంతం చేయాలి’

AKP: అచ్యుతాపురం మండలంలో సీఐటీయూ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్.రాము తెలిపారు. ఈ మేరకు అచ్యుతాపురం మండల కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. 140వ అంతర్జాతీయ మేడే సందర్భంగా మండలంలో వాడవాడల పతాకావిష్కరణలు నిర్వహిస్తామన్నారు. మేడే స్ఫూర్తితో కార్మికులకు అండగా నిలిచి పోరాటాలు చేస్తామని తెలిపారు.

April 28, 2026 / 05:39 PM IST

చేనేత రంగంపై మంత్రి సవిత సమీక్ష

GNTR: రాష్ట్ర సచివాలయంలో చేనేత రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రి సవిత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆప్కో షోరూమ్‌లలో అమ్మకాలు పెంపు, చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్, సహకార సంఘాల నుంచి చేనేత వస్త్రాల కొనుగోలు వంటి విషయాలపై చర్చించారు. అర్హులైన చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అందజేయాలని మంత్రి సవిత అధికారులను ఆదేశించారు.

April 28, 2026 / 05:38 PM IST

‘ఐరిష్ మస్తరు విధానాన్ని రద్దు చేయాలి’

W.G: ఉపాధి హామీ శ్రామికులకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు తలనొప్పిగా మారిన ఐరిష్ మస్తర్ విధానాన్ని రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కండెల్లి సోమరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తాడేపల్లిగూడెం (M) చిన్నతాడేపల్లిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పాత విధానంలోనే మస్తర్ వేయాలని, అన్ని గ్రామాల్లోనూ పనులు కల్పించాలన్నారు.

April 28, 2026 / 05:30 PM IST

‘25% అదనంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలు పెరిగాయి’

ATP: జిల్లా పెట్రోల్, డీజిల్ సరఫరాకు సంబంధించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇంధన నిలువలు ఆశాజనకంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఇంధన సరఫరా పై కలెక్టర్, ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం 25% అదనంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలు జరుగుతున్నాయన్నారు.

April 28, 2026 / 05:24 PM IST

జమ్మలమడుగు టోల్ గేట్ వద్ద ఘోర ప్రమాదం

KDP: జమ్మలమడుగు టోల్ గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. గండికోటకు వెళ్లి తిరిగి వస్తుండగా కారు మరో వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చిన్న బాలుడితో సహా మరో నలుగురికి గాయాలు కావడంతో వారిని జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

April 28, 2026 / 05:20 PM IST

జిల్లా అభివృద్ధిలో ఇంజనీరింగ్ శాఖల పాత్ర కీలకం: కలెక్టర్

అన్నమయ్య: మదనపల్లిలో కలెక్టర్ నిశాంత్ కుమార్ అధ్యక్షతన ఇంజనీరింగ్ శాఖల సమీక్షా సమావేశం జరిగింది. వివిధ శాఖల అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించిన కలెక్టర్, గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. భూసేకరణ, అనుమతుల సమస్యలను త్వరగా పరిష్కరించి పనులు వేగవంతం చేయాలని సూచించారు. సమన్వయంతో పనిచేస్తే జిల్లా అభివృద్ధి వేగవంతమవుతుందని తెలిపారు.

April 28, 2026 / 05:20 PM IST

అంగన్వాడీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

PPM: కురుపాం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 6, 2011 నాటి ప్రభుత్వ ఉత్తర్వులు (జి.ఓ. నం.39) ప్రకారం ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. కురుపాం, జియ్యమ్మవలస మండలాల్లో ఖాళీగా ఉన్న 39 అంగన్వాడీ హెల్పర్ పోస్టులను రోస్టర్ విధానంలో భర్తీ చేయనున్నట్లు ప్రాజెక్టు అధికారి తెలిపారు.

April 28, 2026 / 05:13 PM IST

అంగన్వాడీపై ఆకస్మిక తనిఖీ

ASR: అరకులోయ మండలం నందివలస అంగన్వాడీ కేంద్రాన్ని మంగళవారం రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు కిల్లో సాయిరామ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తున్నారా అనే అంశంపై పరిశీలించారు. పిల్లలకు సరైన పోషకాహారం అందించడంలో నిర్లక్ష్యం చేయొద్దని సిబ్బందికి సూచించారు. ఎలాంటి లోపాలు తలెత్తినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

April 28, 2026 / 05:11 PM IST

‘కుష్ఠు వ్యాధిగ్రస్తులకు సకాలంలో చికిత్స అందించాలి’

NLR: నెల్లూరు జిల్లాలో కుష్ఠు వ్యాధిగ్రస్తులకు సమయానికి వైద్య సేవలు అందించాలని జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ షేక్ ఖాదర్ వలీ సూచించారు. మంగళవారం నిర్వహించిన సమీక్షలో కొత్త కేసులు, వారికి అందుతున్న చికిత్సపై ఆరా తీశారు. అలాగే, వ్యాధిగ్రస్తులతో కలిసి నివసించే వారికి వ్యాధి వ్యాప్తి నివారించేందుకు “పెప్” మందు ఇవ్వాలని తెలిపారు.

April 28, 2026 / 05:06 PM IST

లైబ్రరీలో సమ్మర్ క్యాంప్ ప్రారంభం

అన్నమయ్య: తంబళ్లపల్లె గ్రంథాలయంలో పిల్లలకు వేసవి శిక్షణా తరగతులను ప్రారంభించినట్టు లైబ్రేరియన్ జిలానీ బాషా తెలిపారు. వేసవి సెలవుల్లో పిల్లలు TVలు, ఫోన్లకు బానిస కాకుండా ప్రభుత్వం, ఉన్నతధికారుల ఆదేశాలతో సమ్మర్ క్యాంపులను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. నేటి నుంచి జూన్ 6 వరకు పిల్లలకు దినపత్రికలు, పుస్తకాలు చదివించడం, కథలు చెప్పడం, యోగా నేర్పించడం చేస్తామన్నారు.

April 28, 2026 / 05:06 PM IST

‘పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి’

E.G: రానున్న పుష్కరాల దృష్ట్యా కొవ్వూరు పరిధిలోని భూములను MLA ముప్పిడి వెంకటేశ్వరరావు మంగళవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు PPP విధానంలో కాటేజీలు, గదులు, స్నానాల గదులు వంటి అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పించాలన్నారు.

April 28, 2026 / 05:04 PM IST