• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఉయ్యాలవాడలో పంచాయతీలకు ప్రత్యేక అధికారులు

NDL: ఉయ్యాలవాడ మండలంలోని 20 గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు ఎంపీడీవో ఉమామహేశ్వరరావు శనివారం తెలిపారు. సర్పంచుల పదవీకాలం ఈనెల 2తో ముగియడంతో తాత్కాలికంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఎంపీడీవో, తహసీల్దార్ ప్రసాద్ బాబు, డిప్యూటీ ఎంపీడీవో నాగలక్ష్మమ్మ, పశువైద్యాధికారి సాయిబాబాలను కలెక్టర్ నియమించినట్టు ఆయన వెల్లడించారు.

April 5, 2026 / 08:00 AM IST

యువకుడిపై 15 మంది దుండగుల దాడి

అన్నమయ్య: మదనపల్లెలో శనివారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. ఎస్టేట్ సమీపంలోని దాము వైన్స్‌లో మద్యం తాగేందుకు వెళ్లిన శివసాయి(28) అనే యువకుడిపై సుమారు 15 మంది దుండగులు మూకుమ్మడిగా దాడి చేశారు. మద్యం షాపు వద్ద జరిగిన చిన్న వివాదం కారణంగా ఆగ్రహించిన దుండగులు బీరు బాటిళ్లతో శివసాయి తలపై కొట్టి తీవ్రంగా గాయపరిచారు. బాధితుడిని స్థానికులు జిల్లా ఆసుపత్రికి తరలించారు.

April 5, 2026 / 07:46 AM IST

ఒంటిమిట్టలో శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు ముగింపు

KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి ధ్వజావరోహణంతో ఘనంగా ముగిశాయి. సాయంత్రం 7 గంటలకు ధ్వజావరోహణ కార్యక్రమం నిర్వహించి గరుడ పటాన్ని అవతనం చేశారు.బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే భక్తులు పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధి పొందుతారని ఐతిహ్యం. సకల శ్రేయస్సులు కలుగుతాయని విశ్వాసం.

April 5, 2026 / 07:40 AM IST

‘గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించండి’

KRNL: ఈనెల 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నేపథ్యంలో అవగాహన సదస్సులు నిర్వహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి ఆధ్వర్యంలో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖతో కలిసి గ్రామాల్లో ఆరోగ్య సమస్యలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. విలేజ్ అర్బన్ సెంటర్లలో ప్రచారం చేపట్టాలని సూచించారు.

April 5, 2026 / 07:40 AM IST

విశాఖలో ఈరోజు మాసం ధరలు ఎంతంటే..!

VSP: విశాఖలోని పలు ప్రాంతాల్లో ఆదివారం చికెన్ ధరలు కేజీల్లో ఇలా ఉన్నాయి. బ్రాయిలర్ లైవ్ రూ.145, స్కిన్తో రూ.260, స్కిన్ లెస్ రూ. 270, శోంఠాం రూ.300లకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. మటన్ కేజీ రూ.1000కు, డజన్ గుడ్లు రూ.55లకు అమ్మకాలు చేపట్టారు. అప్పుఘర్, ఎంవీపీ, ఫిషింగ్ హార్బర్ ప్రాంతాల్లో తాజా చాపల కోసం కొనుగోలుదారులు పోటీ పడుతున్నారు.

April 5, 2026 / 07:37 AM IST

ఘోరం.. 13 ఏళ్ల బాలికపై అత్యాచారం

E.G: రంగంపేట మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లగా, ఇంట్లో ఒంటరిగా ఉన్న 13 ఏళ్ల బాలికపై పొరుగింటి వ్యక్తి పెనుముచ్చి మంగరాజు (45) లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం బయటపెడితే చంపేస్తానని బెదిరించాడు. బాధితురాలు తల్లిదండ్రులకు విషయం చెప్పగా, వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

April 5, 2026 / 07:33 AM IST

మట్టి దోపిడిని అడ్డుకోవాలని గ్రామస్తుల డిమాండ్

బాపట్ల: పెదగాదెలవర్రులోని చెరువులో అక్రమంగా మట్టి తవ్వి విక్రయిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. వారం రోజులుగా ట్రక్కుల ద్వారా మట్టి తరలింపులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఒక్కో లోడు రూ.800 నుంచి 1000 వరకు అమ్ముతున్నారని ఆరోపించారు. అధికారులు పట్టించుకోకపోవడం వల్ల దోపిడి పెరుగుతోందని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

April 5, 2026 / 07:31 AM IST

పారా అథ్లెటిక్స్‌లో ‘అనంత’ హవా!

ATP: నెల్లూరులో జరిగిన 8వ రాష్ట్రస్థాయి పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అనంతపురం జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. మొత్తం 44 పతకాలు సాధించిన విజేతలకు విభిన్న ప్రతిభావంతుల సహాయ సంస్థ చైర్మన్ గడుపూటి నారాయణస్వామి సర్టిఫికెట్లు అందజేశారు. జిల్లా నుంచి 41 మంది పాల్గొనగా 22 స్వర్ణ, 16 రజత, 10 కాంస్య పతకాలు రావడం విశేషం.

April 5, 2026 / 07:30 AM IST

‘రహదారులపై చెత్త వేస్తె కఠిన చర్యలు’

కోనసీమ: స్వచ్ఛ మండపేట సాధనే లక్ష్యంగా పురపాలక సంఘం పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణపై కమిషనర్ టీవీ రంగారావు శనివారం కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన రహదారులపై ప్రతిరోజూ రాత్రి సమయాల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నామని తెలిపారు. వ్యాపార సంస్థల నిర్వాహకులు రహదారులపై బహిరంగంగా చెత్త వేయకూడదని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

April 5, 2026 / 07:30 AM IST

రెండు ఆటోలు డీ.. ఇద్దరికి గాయాలు

KKD: కొత్తపల్లి మండలం అమీనాబాద్ వెళ్లే రహదారిలో శనివారం సాయంత్రం రెండు ఆటోలు బలంగా ఢీకొన్నాయని స్థానికులు తెలిపారు. పెట్రోల్ బంకు సమీపంలో ఎదురెదురుగా వచ్చిన ఆటోలు ఢీకొనడంతో అవి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకుపోయాయని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

April 5, 2026 / 07:30 AM IST

‘మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే రెండేళ్లు డిబార్’

KRNL: ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పార్ట్-2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నామని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా. చంద్రశేఖర్ తెలిపారు. శనివారం కర్నూలు మెడికల్ కాలేజీలో జరుగుతున్న పరీక్షలను ఆయన తనిఖీ చేసి నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే రెండేళ్ల వరకు డీబార్ చేస్తామని హెచ్చరించారు.

April 5, 2026 / 07:30 AM IST

రుద్రవరం పంచాయతీలకు ప్రత్యేక అధికారులు

నంద్యాల: రుద్రవరం మండలంలోని 21 గ్రామ పంచాయతీల పాలన కోసం జిల్లా అధికారులు ప్రత్యేక అధికారులను నియమించారు. శ్రీరంగాపురం తదితర గ్రామాలకు ఎంపీడీవో భాగ్యలక్ష్మి, మరికొన్ని గ్రామాలకు డిప్యూటీ ఎంపీడీవో ప్రసాద్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. చందలూరు ప్రాంతానికి వ్యవసాయ అధికారి సుమతి, రుద్రవరం పరిధిలోని గ్రామాలకు డాక్టర్ మనోరంజన్ ప్రతాప్‌ను నియమించినట్లు వెల్లడించారు.

April 5, 2026 / 07:29 AM IST

బంగారం విడిపించాలంటూ.. రూ. 19లక్షలతో ఉడాయింపు

గుంటూరు: అరండల్‌పేటలో బంగారం వ్యాపారిని మోసం చేసిన ఘటన వెలుగుచూసింది. ఫైనాన్స్‌లో ఉన్న తన బంగారాన్ని విడిపించాలంటూ నమ్మబలికి ఓ మహిళ వ్యాపారి వద్ద నుంచి రూ.19 లక్షల నగదు, రూ.4 లక్షల విలువైన ఆభరణాలు తీసుకుంది. తరువాత వాటిని తిరిగి ఇవ్వకుండా తప్పించుకుంటుండటంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 5, 2026 / 07:26 AM IST

‘ప్రతి ఒక్కరు వీధి కుక్కలతో జాగ్రత్తగా ఉండాలి’

NLR: వలేటివారిపాలెం మండలంలో కుక్కలకు సోకుతున్న చర్మవ్యాధుల పట్ల పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ చెన్నకేశవులు శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. మాంసం దుకాణాల వద్ద కోడి వ్యర్థాలు తినడం వల్లే ఈ సమస్య వస్తోందని పేర్కొన్నారు. ఈ వ్యాధి కుక్కల నుంచి మనుషులకు గాలి ద్వారా వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

April 5, 2026 / 07:20 AM IST

రెవెన్యూ సమస్యలు తక్షణమే పరిష్కరించండి: ఎమ్మెల్సీ

KDP: పులివెందుల ఆర్డీవో కార్యాలయంలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి రెవెన్యూ సమస్యలపై అధికారులతో శనివారం సమావేశమయ్యారు. భూ తగాదాల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని, రీ-సర్వేలో జరిగిన పొరపాట్లను సరిచేయాలని, ప్రభుత్వ భూముల ఆక్రమణలను అరికట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు.

April 5, 2026 / 07:20 AM IST