CTR: మరమ్మతుల్లో భాగంగా పీలేరులోని ఎల్బీఎస్ రోడ్డులో రైల్వే గేట్ మూసివేశారు. ఈ నేపథ్యంలో సదుం నుంచి పీలేరుకు వెళ్లే ఆర్టీసీ బస్సు సర్వీస్ రూట్ మార్చారు. రైల్వే స్టేషన్, డిగ్రీ కాలేజ్, మదనపల్లె జాతీయ రహదారి మీదుగా ఆర్టీసీ బస్టాండ్కు చేరుకుంటుందని చెప్పారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరారు.
SKLM: జి.సిగడాం మండలం ఆనందపురం గ్రామంలో గ్రామ కమిటీల పరిచయ వేదిక కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ గురువారం నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను గుర్తుచేసుకున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసి డైవర్సన్ పాలిటిక్స్ చేస్తుందని విమర్శించారు. అభివృద్ధి జరగాలంటే మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలుపించుకోవాలని సూచించారు.
CTR: జిల్లాలో పాడి రైతులకు పశు పోషణ భారంగా మారింది. గతంలో పొలాల వద్ద పచ్చిగడ్డి విరివిగా లభించేది. ప్రస్తుతం వేసవి కావడంతో పశుగ్రాసం కొరత ఏర్పడుతోంది. లభ్యత లేకపోవడంతో వరిగడ్డిని ఇతర జిల్లాల నుంచి రవాణా చేసుకుంటున్నారు. వాటికి అధికంగా డిమాండ్ ఉండటంతో ప్రస్తుతం ట్రాక్టర్ వరి గడ్డి రూ. 20 వేలు పలుకుతోంది. ప్రభుత్వం ఆదుకోవాలని పాడి రైతులు కోరుతున్నారు.
KRNL: మహిళా ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని UTF మండల ప్రధాన కార్యదర్శి పెద్దారెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ కోసిగి మం. జంపాపురం, సజ్జలగూడెం పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయులతో కలిసి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో సుమారు 50 శాతం మహిళలే ఉన్న నేపథ్యంలో తగు చర్యలు తీసుకోవాలన్నారు.
సత్యసాయి: మడకశిర మండలం మెలవాయి గ్రామంలో స్వాతంత్య్ర సమర యోధులు గోవింద రెడ్డి అంత్యక్రియలు గురువారం నిర్వహించారు. అంత్యక్రియలు మడకశిర RDO ఆనంద్ కుమార్, తహసీల్దార్ కళ్యాణ్ చక్రవర్తి, RI సోమశేఖర్ రెడ్డి, VRO అనిత, మడకశిర CI సుబ్రహ్మణ్యం తదితర సిబ్బంది పాల్గొని నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ అధికార లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
TPT: ప్రముఖ సినీ నటి నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దంపతులు తిరుమల శ్రీవారిని ఇవాళ దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద ఆశీర్వచనంతో అధికారులు స్వామివారి ప్రసాదాలను వారికి అందజేశారు.
CTR: చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర మే 12, 13వ తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తామని జాతర వంశపారంపర్య ధర్మకర్త సీకే బాబు తెలిపారు. మే 5న గంగమ్మ జాతర చాటింపు, 12న జాతర తొలి పూజలు చేస్తామని చెప్పారు. అదే రోజు మధ్యాహ్నం మహా కుంభ నైవేద్యం సమర్పిస్తామన్నారు. 13న నిమజ్జనం జరుగుతుందని తెలిపారు.
బాపట్ల మండలం నరసాయపాలెం గ్రామంలో నిర్మాణంలో ఉన్న షిర్డీ సాయిబాబా ఆలయాన్ని గురువారం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ పిల్లర్స్ పనులను ఆయన ప్రారంభించారు. అంతకుముందు విఘ్నేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. భక్తితోనే క్రమశిక్షణ, శాంతియుత జీవనం సాధ్యమని, గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.
KKD: తుని పట్టణంలోని ప్రకాశం రోడ్డుపై ఆంజనేయ స్వామి గుడి వద్ద పరిస్థితి దయనీయంగా మారింది. వర్షం పడినప్పుడల్లా ఆ ప్రాంతం మొత్తం చెరువులా తయారవుతోంది. డ్రైనేజీ నీరు, వర్షపు నీరు కలిసిపోవడంతో రోడ్డుపై భారీగా ప్రవహిస్తున్నాయి. దుర్వాసన వెదజల్లే ఆ నీళ్ళు రోడ్డు మీదుగా పారుతుండటంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
కృష్ణా: మచిలీపట్నం 6వ డివిజన్లో నిర్మాణంలో ఉన్న ఓ జనసైనికుడి ఇళ్లు కూల్చివేత కూటమిలో అంతర్యుద్ధానికి దారి తీసింది. అక్రమ కట్టడమంటూ శ్రీపతి వెంకటాచలం ఇంటిని ఇటీవల మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ఇది కూటమిలోని TDP Vs జనసేనగా మారింది. మంత్రి కొల్లు రవీంద్ర దీన్ని అక్రమ కట్టడమని అధికారుల చర్యలను సమర్ధిస్తే జనసేనకు చెందిన MP బాలశౌరి మాత్రం తప్పు పట్టారు.
ఎన్టీఆర్: విజయవాడలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు వినూత్న చర్యగా డ్రోన్ల ద్వారా నీటి తుంపర్లు (మిస్ట్) వెదజల్లే కార్యక్రమాన్ని కలెక్టర్ జి.లక్ష్మీశ క్షేత్రస్థాయిలో గురువారం పరిశీలించారు. మహాత్మా గాంధీ రోడ్, అంబేద్కర్ స్మృతి వనం వద్ద ఈ కార్యక్రమాన్ని VMC అధికారులతో కలిసి పరిశీలించారు.
ELR: జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనితకి అప్పన్నవీడులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఘన స్వాగతంపల్లి గారు. అనంతరం అప్పన్నవీడు అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకున్న హోం మంత్రి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వేద ఆశీర్వచనం అందజేశారు. అలాగే హోం మంత్రికి సాంప్రదాయ బద్దంగా చీర, సారెను ఎమ్మెల్యే అందజేశారు.
అన్నమయ్య: రామాపురం మండలం నల్లగుట్టపల్లి బీసీ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. శ్రీనివాసులు ఇంటి వద్ద ఉన్న పొట్టేళ్ల ఫారంపై కుక్కలు దాడి చేయడంతో 14 పొట్టేళ్లు మృతి చెందాయి. ఈ ఘటనతో రైతు తీవ్ర నష్టపోయాడు. గ్రామంలో కుక్కల బెడద అధికంగా ఉందని, వెంటనే నియంత్రణ చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని బాధితుడు విజ్ఞప్తి చేశాడు.
KDP: జమ్మలమడుగు-తాడపత్రి ప్రధాన రహదారిలోని మోరగుడి గ్రామం వద్ద బుధవారం అర్ధరాత్రి కారు అదుపుతప్పి ఓ ఇంటిలోకి దూసుకెళ్లింది. స్థానికుల వివరాల ప్రకారం.. జమ్మలమడుగు వైపు వెళుతున్న కారు అతివేగంతో ఇంటిని ఢీకొని బోల్తా పడింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కారులో ఒక్కరే ఉండగా, అదృష్టవశాత్తు అతనికి గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు.
KRNL: కోసిగి గ్రామ ప్రత్యేక అధికారిగా వ్యవసాయ అధికారి వరప్రసాద్ నియమితులయ్యారు. గురువారం దొరల కాలనీలో పర్యటించి తాగునీటి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించారు. అనంతరం బీరప్పగుడ్డి కాలనీలో శ్మశానవాటికకు వెళ్లే దారిలోని డ్రైనేజీ కాలువ పూడికతీత పనులు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు.