విశాఖ: అడవివరం పరిధిలోని 523, 524, 528 సచివాలయాలను జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు, లబ్ధిదారుల వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు.
అనకాపల్లి: జార్ఖండ్ రాష్ట్రంలో జరుగుతున్న మహిళల జాతీయస్థాయి హాకీ పోటీలకు కోచ్గా ఎలమంచిలికి చెందిన హాకీ ప్లేయర్ ఈపు రవికుమార్ వ్యవహరిస్తున్నట్లు అనకాపల్లి జిల్లా హాకీ అసోసియేషన్ కన్వీనర్ కే నరేష్ సోమవారం తెలిపారు. ఆయన కడప జిల్లా పులివెందులలో ఖేలో హాకీ కోచ్గా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. రవికుమార్ ఆధ్వర్యంలో మహిళా హాకీ జట్టు సత్తా చాటుతున్నట్లు తెలిపారు.
GNTR: చల్లపల్లి పోలీస్ స్టేషన్లో జరిగిన బాణసంచా పేలుడు ఘటనలో గాయపడిన పోలీసులను హోంమంత్రి వంగలపూడి అనిత ఇవాళ పరామర్శించారు. మంగళగిరి NRI ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిబ్బందిని ఆమె కలిసి ధైర్యం చెప్పారు. బాధితులకు అందుతున్న వైద్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, మెరుగైన చికిత్స అందించాలన్నారు.
అల్లూరి: పాడేరులోని నన్నయ వర్సిటీ ఎంఎస్ఎన్ క్యాంపస్ ఆధ్వర్యంలో ఈ నెల 13న నిర్వహించే ‘తలాష్’ స్టేట్ లెవెల్ ఫెస్ట్ పోస్టర్ను ఇవాళ పడేరులో జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ ఆవిష్కరించారు. విద్యార్థుల్లో ప్రతిభ, సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇది అద్భుత వేదికని ఆయన అన్నారు. కార్యక్రమంలో కన్వీనర్ డా.మధుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
BPT: కర్లపాలెం మండలం యాజలి గ్రేడ్-2 పంచాయతీ కార్యదర్శిగా జి.అమర్నాథ్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. బుచ్చిరెడ్డిపాలెం నుంచి బదిలీపై వచ్చిన ఆయన తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవోలను మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే ఏట్రవారిపాలెం గ్రేడ్-2 కార్యదర్శిగా ఎం.చలపతి బాధ్యతలు స్వీకరించారు. ఆయన ముత్తుకూరు మండలం పంటపాలెం నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చారు.
PLD: జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులు అర్జీలను స్వీకరించారు. జిల్లాలోని పలు మండలాల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలను వివరించగా, సంబంధిత శాఖలకు పంపించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ELR: కొయ్యలగూడెం మండలం సీతంపేటలో బీజేపీ పార్టీ 46వ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు ఇవాళ ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా యూవ మోర్చా నాయకులు పెనుమర్తి సురేష్ బాబు, మండల కిసాన్ మోర్చా రామినా రమేష్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి బాలం నరేష్ పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేంద్ర నిధులు పథకాలు ప్రతి ఒక్కరికి అందడమే బీజేపీ లక్ష్యం అన్నారు.
విశాఖ: మధురవాడ ఐటీ సెజ్ ప్రాంతంలో అనుమానాస్పదంగా మృతి చెందిన యువకుడి మృతదేహన్ని స్థానికులు సోమవారం గుర్తించారు. సమాచారం అందుకున్న పీఎంపాలెం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతి చెందిన యువకుడు మణికంఠ (34)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
PLD: సత్తెనపల్లిలో వైసీపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ చిట్టా విజయభాస్కర్ రెడ్డి టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతి రాజధాని పేరుతో ఒక సామాజిక వర్గానికి ఆర్థిక లాభం చేకూర్చే విధంగా 54వేల ఎకరాల భూములు సేకరించారని ఆరోపించారు. చట్ట సవరణ వల్ల ఆమోదం తీసుకురావడం వెనుక ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నించారు.
SS: కదిరిలో జరిగిన నీటి సంరక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు. ‘జలధార’ స్ఫూర్తితో వాగులను అనుసంధానిస్తూ ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా జేసీబీ నడిపి పనులను ప్రారంభించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. సాగునీటి వనరుల రక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు.
పాత గుంటూరు పోలీస్ పరిధిలో టాస్క్ ఫోర్స్ రెండు సార్లు దాడులు చేసి పేకాట నిర్వహిస్తున్న 16 మందిని అదుపులోకి తీసుకుంది. రూ.1,19,410 నగదు, 15 మొబైల్ ఫోన్లు, 4 బైకులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ కొనసాగిస్తున్నారు. జిల్లాలో జూదం సహించబోమని పోలీసులు హెచ్చరించారు.
KRNL: ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ AO వసుంధర ఆధ్వర్యంలో పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహించారు. డివిజన్ పరిధిలోని వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రధానంగా భూ సమస్యలపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. ఆదోని ప్రాంతంలో వేధిస్తున్న తీవ్రమైన తాగునీటి ఎద్దడిపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
W.G: నరసాపురం మండలం రుస్తుంబాదలో ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. మోకా దుర్గారావు తన పల్సర్ బైక్పై వెళ్తుండగా, టాయ్స్ సిటీ సమీపంలో టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన రోడ్డుపై పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఆయనను నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
E.G: అనపర్తి మండలం రామవరంలో భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ జెండాను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో నాయకులకు, కార్యకర్తలకు స్వీట్స్ పంచి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంత్యోదయ స్ఫూర్తితో సుపరిపాలన లక్ష్యంగా సేవయే పరమావధి – దేశమే ప్రథమం అంటూ కొనసాగుతున్నారు.
ATP: యాడికి మార్కెట్ యార్డులో నిర్వహించిన సభలో స్థానిక MLA జేసీ అస్మిత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. నియోజకవర్గంలోని అన్ని చెరువులకు సాగునీరు అందించాలని సీఎంకు విన్నవించారు. అలాగే యాడికి ప్రాంత విద్యార్థుల సౌకర్యార్థం నూతనంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంజూరు చేయాలని కోరారు. స్థానిక సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.